Wednesday 27 July 2011

చిదంబరం ప్రకటనలో తప్పులు, ఈనాడు యెల్లో జర్నలిజం


తెలంగాణ అంశంపై తాజాగా చిదంబరం నిన్నటి రోజు మరో ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ఆంగ్లంలో యధాతధంగా(పీటీఐ):

“This is a unique situation where political parties in Andhra Pradesh are divided down the middle. Congress, Telugu Desam, CPI, CPI(M) are all divided.  The only party which claims to be undivided is BJP because it has only one member”

ఈఒక్క ప్రకటనలో చిదంబరం మూడు తప్పులు దొర్లించాడూ.

మొదటి తప్పు: సీపీఐ తెలంగాణ అంశంపై ఏమీ విడిపోలేదు. సీపీఐ తెలంగాణా ఏర్పాటును సమర్ధిస్తుంది, తెలంగాణకోసం కొన్ని సంవత్సరాలుగా ఉద్యమంలో పాల్గొంటుంది. అయినా మన హోంమంత్రి భాషలో సీపీఐ తెలంగాణా అంశంపై రెండుగా చీలిపోయింది.

రెండో తప్పు: సీపీఎం కూడా తెలంగాణా అంశంపై చీలిపోలేదు. సీపీఎం ఎప్పుడైనా తాము విధానపరంగా విశాలాంధ్రకు కట్టుబడి ఉన్నాము, కానీ కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటే తాం అడ్డగించబోము అనే చెప్పారు. అయినా మన హోంమంత్రి భాషలో సీపీఎం కూడా తెలంగాణా అంశంపై చీలిపోయింది.

మూడో తప్పు: బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కాదు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా బీజేపీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న దానితో సంబంధం లేకుండా ఎప్పుడూ తెలంగాణకు అనుకూలంగానే ఉన్నది. ఆంధ్రాలో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలుచుకున్నప్పుడు కూడా తెలంగాణకు వారు అనుకూలంగానే ఉన్నారు.

ఒక ప్రకటనలో ఇన్ని తప్పులు చేసినవాడు అసలు తెలంగాణ సమస్య పరిష్కారానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడో. విచిత్రంగా ఈనాడు మాత్రం తన వార్తలో ఈతప్పులన్నీ సరిదిద్ది జనం తెలంగాణపై కేంద్రం పొరపాట్లు గ్రహించకుండా జాగ్రత్త పడింది.

పై చిదంబరం ఆంగ్ల ప్రకటనకు యెల్లో జర్నిలిజానికి పేరుగాంచిన యెల్లో పత్రిక అనువాదం ఇదీ:”తెలంగాణ అంశంపై అసాధారణ స్థాయిలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌, తెలుగుదేశంలు నిట్టనిలువునా చీలిపోయాయి. చీలిపోలేదని చెప్పుకుంటున్న భాజపాకి ఉన్నది.. ఇద్దరే సభ్యులు. తెరాస, సీపీఐలు తెలంగాణకు పూర్తి అనుకూలం. ఈ స్థితిలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్టీలపై ఏదో ఒక పరిష్కారాన్ని బలవంతంగా రుద్దలేం” అని కేంద్ర హోం మంత్రి చిదంబరం స్పష్టం చేశారు.” ఇదీ మన ఈనాడు కథ.

source: missiontelangana.com

Tuesday 26 July 2011

The secrecy behind Telangana’s Chapter 8

తెహెల్కా ఆన్లైన్ మాగజైన్లో వచ్చిన "The secrecy behind Telangana’s Chapter 8" వ్యాసాన్ని ఇక్కడ చదవవచ్చు.

Monday 25 July 2011

ప్రత్యేక ఆంధ్ర దేశానికీ జై!!


ఈమధ్యన కొందరు తెలుగు బ్లాగుల్లో పనీ పాట లేక చత్తరాతలు రాసేవారు ప్రత్యేక ఆంధ్ర దేశం అంటూ ఒక కొత్త నినాదాన్ని లేవదీశారు. మమ్మల్ని దోపిడీదారులంటూ (ఉన్న విషయాన్ని బయట పెట్టి) మామనోభావాలను దెబ్బతీశారు కాబట్టి మాకు ప్రత్యేక దేశం కావాలనే వాడు ఒకడైతే మాఫాక్షనిస్టు ఎంపీలకూ, మాపార్ట్‌టైం పొలిటీషియన్ ఫుల్‌టైం బుజినెస్‌మెన్ ఎంపీలకూ మంత్రిపదవులు దక్కలేదు కనుక ప్రత్యేక దేశం కావలని ఇంకోడు. ఈదగుల్బాజీ ఎంపీలకు మంత్రిపదవులు దక్కకపోయినా వారి వ్యాపారాలకు అవసరమొచ్చే పార్లమెంట్ స్తాండింగ్ కమిటీ మెంబర్‌షిప్పులు దక్కాయి, అందుకే వారు సమైక్యాంధ్ర కావాలంటున్నారు అనేది వీరి ఊహకు అందని విషయం.

ఇలాంటి చత్త డిమాండులు పనీపాటలు లేని కొందరు బ్లాగరులు బ్లాగుల్లో కూర్చుని రాస్తారు, అందులో మెజారిటీ దేశం బయట ఉంటారు కాబట్టి ఏమ్రాసినా చెల్లుద్దనే ధీమా. ఇదేడిమాండ్ పబ్లిగ్గా జెప్పే ధైర్యం వీల్ల నాయకుల్లో ఒక్కడికీ ఉండదు, ఇలాంటి డిమాండ్‌లు పబ్లిగ్గా చేస్తే బొక్కలిరగ్గొట్టి బొక్కలో దోస్తారనేది వేరే విషయం.

సరే, ఏదయితే అదయింది..మీరెందుకు ఇలాంటి డిమాండ్‌లు చేసినా...మీ ప్రత్యేక ఆంధ్ర దేశం డిమాండ్‌ను "కోటి రత్నాల వీణ" బ్లాగ్ తరఫున నేను స్వాగతిస్తున్నాను. పైనున్న తధాస్తు దేవతల్లో ఎవరైనా మీ పనికిమాలిన డిమాండ్ విని తధాస్తు అన్నాడంటే ఈదేశానికి పట్టిన పీడల్లో చానా పీడలు తొలిగిపోతాయి. కొన్ని రక్త చరిత్రలూ, బెజవాడ రౌడీలూ, కులగజ్జి హత్యలూ, తిన్నదరగక ఒకడి తల మరొకడు నరుక్కొనే సంస్కృతులూ, భూబకాసురులూ, రియల్ ఎస్టేట్ సెటిల్మెంటర్లూ, అర్ధరాత్రులు గుంపులుగా వెల్లి మాప్రాంతానికి నీల్లిచ్చే ప్రాజెక్టులను ధ్వంసం చేసేవారూ,  నీల్లూ. ఉద్యోగాలూ, నిధులూ అన్నీ మాప్రాంతానికి మాత్రమే దక్కాలి అనుకునే పేరాశ పేరయ్యలూ లాంటి చానామంది పీడలు ఈదేశానికి తప్పుతాయి.

ఇంతకూ మీప్రత్యేకాంధ్ర దేశంలో మీతో ఎంతమంది కలుస్తారు?మొన్నటి సమైక్యాంధ్ర ప్రతినిధుల మీటింగులోనే ఉత్తరాంధ్రకు చెందినవారొక్కరు కూడా రాలేదు. ఇక మిగిలిన మధ్యకోస్తా, రాయలసీమా ప్రాంతాల్లో ఒకరంటే ఒకరికి పడదు. సరే ఏదో సెటిల్మెంటు జేసుకొని ఒకసారి ఒక అగ్రకుల సామాజిక వర్గమూ, మరోసారి ఇంకో వర్గమూ అధికారంలో ఉండొచ్చు కానీ మీ ప్రాంతంలో బలహీన వర్గాలు మిమ్మల్ని ఎప్పుడైనా నమ్ముతారా?  అయినా మాకెందుకులే..మీపాట్లేవో మీరు పడండి.. జై ప్రత్యేకాంధ్ర దేశం.. జై జై ప్రత్యేకాంధ్ర దేశం!!

ఈ చత్త డిమాండ్ సీమాంధ్ర సొదరులందరి డిమాండ్ కాదు, ఎవరో ఒకరిద్దరు తెలివితక్కువ వెధవల డిమాండ్ కాబట్టి మిగతావారిని నేను నారాతలద్వారా నొప్పిస్తే క్షంతవ్యున్ని. ఇది కేవలం సరదాకోసం రాసింది కనుక దీన్ని ఈడిమాండ్‌కు సంబంధం లేనివారు సీరియస్‌గా తీసుకోకూడదని సహృదయ మనవి.

Friday 22 July 2011

అంధేరా సర్కారు,మీడియాల అమానవత్వం




తెలంగాణ సాధనకోసం ఆత్మబలిదానాలు జరగడం కొత్తకాదు, ఇప్పటికే ఆరువందలకు పైగా యువకులు ఆత్మబలిదానాలు చేశారు. ఈఆత్మహత్యలు ఆపాలని ఇక్కడి ప్రజలు, స్వచ్చంద సంస్థలూ, ఉద్యమ నేతలు ఎంతగా కోరుతున్నా తాము తెగించి ఉద్యమిస్తుంటే కొంతమంది తమధనబలంతో తమరాష్ట్రాన్ని ఆపుతున్నారనే నిస్పృహతో నిరాశకు గురయి ఇక్కడి యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సెన్సేషన్లకు మాత్రమే విలువ ఇచ్చి ఉద్యమాలను తక్కువ చేసి చూపించే మీడియా ఈవిధంగానయినా తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చెబుతుందని, స్యూసైడ్‌నోట్ ద్వారానయినా కనీసం తమగొంతును ఒకసారి ప్రపంచానికి వినిపించాలని యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

మొన్న ఒక తెలంగాణ యువకుడు ఇక్కడినుండి ఢిల్లీ దాకా వెల్లి ఢిల్లీ నేతలకు తన గొంతు వినిపించాలని ఆరుపేజీల స్యూసైడ్ నోట్ రాసి పార్లమెంటు ముందు చెట్టుకు ఉరిపోసుకుని మరణించాడు. ఈసంఘటన తెలంగాణయావత్తునూ కదిలించింది. అయితే ఈ మరణానికి మన అంధేరా ప్రభుత్వ, అంధేరా మీడియా స్పందన మాత్రం అత్యంత హేయంగా ఉండి వీరిలో పెరిగిపోయిన అమానవత్వాన్ని తెలియపరుస్తుంది.

ఎక్కడో విదేశాల్లో, ఏదో యాక్సిదెంటులో ఎవరైనా చనిపోతే శవాన్ని మర్యాదలతో దేశానికి తీసుకొస్తారు. కానీ మనదేశంలో, పార్లమెంటు ముందు ఒకవ్యక్తి బలిదానం చేసుకుంటే శవాన్ని అక్కడే శ్మశానానికి తరలించమని అక్కడి మన ఏపీభవన్ వారు లేఖ రాయడం అత్యంత హేయమైన విషయం.

శవాన్ని కాసేపు ఏపీ భవన్లో ఉంచి నివాళులర్పించుకుంటామని తెలంగాణ కాంగ్రేస్, తెరాస, సీపీఇ నేతలంతా కోరినా వారిని పట్టించుకోక పైగా శవాన్ని వారి కుటుంబానికి అందజెయ్యాలనే కనీస ఇంగితగ్నానాన్ని మరిచి శ్మశానానికి తరలించమని ఆదేశాలు ఇచ్చారు. అది ఈ అంధేరా సర్కారు ఆదేశాలమేరకు అక్కడి ఏపీ భవన్ ఆఫీసరు లెటరు రాశాడట. అసలే కడుపు రగిలిపోతున్న తెలంగాణ నేతలను ఈఆదేశం ఇంకా భాధించడంతో అక్కడి అధికారిపై ఒక తెలంగాణ ఎమ్మెల్యే చేయి చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యను, అతని ఆశయాన్ని ఏమాత్రం కవర్ చెయ్యని మన అంధేరా మీడియా ఆవేశంలో జరిగిన సంఘటనను మాత్రం భూతద్దంలో పెట్టి చూపించింది.

విశాలాంధ్ర పేరుతో తెలంగాణపై విషం చిమ్మే ఒక వర్గానికి అందులో మనసును కదిలివేసే ఆత్మబలిదానం కనబడడం లేదు గానీ వారి గుడ్డికల్లకు శవరాజకీయాలు కనిపిస్తున్నాయి. అంధుల్లారా, శవరాజకీయాలలో ఆరితేరినవారు ఎక్కడివారో సహజమరణాలను తన అక్కౌంట్లో వేసుకుని రెండు సంవత్సరాలుగా ఓదార్పులు చేస్తున్నఘనులనడగండి..సిగ్గులేకపోతే సరి.


Wednesday 20 July 2011

తెలంగాణపై ఆత్మాహుతి దాడులట!!

రాష్ట్రాన్ని విభజించి తెలుగుజాతిని విడదీయాలని చూస్తే ఆత్మహత్యలకే కాదు, తాము ఆత్మాహుతి దాడులకు కూడా సిద్దపడుతామని ఈరోజు తెలగుదేశం అనంతపురం నేత పయ్యావుల కేశవ్ ఒక మీటింగులో చెప్పారు. ఇంకా రాష్ట్రాన్ని విభజిస్తే దేశాన్ని విభజించినట్లే, ఈదేశం ముక్కలయిపోయినా సరే రాష్ట్రాన్ని మాత్రం ముక్కలు గానీయం అని ప్రకటించారు.

అయ్యా పయ్యావుల గారు, మీకు తెలిసిందే ఒకరిని బెదిరించడం, బెదిరించి సెటిల్మెంటు దందాలు జెయ్యడం, ఎవరయినా బెదిరింపులకు లొంగకపోతే తలలు నరికెయ్యడం. మీకు ఆత్మాహుతి దాడులకంటే మంచి ఆలోచనలు ఎలా వస్తాయిగానీ, మీ ఇలాంటి ఉద్దేషాలూ, స్వభావాలూ చూసి చూసి విసిగిపోయారు కాబట్టే తెలంగాణ ప్రజలు తమకు స్వరాష్ట్రం కావాలని అడుగుతున్నారు. ఇక్కడివారు తమహక్కు కోసం పోరాడుతున్నారు, దానికోసం ఇక్కడి ఆరొందల యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఇక్కడి ప్రజలకు త్యాగాలు చెయ్యడమే గానీ ఇంకొకరిని బెదిరించి లొంగదీసుకోవడం చేతకాదు. మీరు మీ ముఠాకక్షల సాంప్రదాయాలను ఇప్పటికే మీప్రాంతం నుంచి హైదరాబాద్ వరకూ పొడిగించి అక్కడి హత్యలు ఇక్కడ చేసుకుని ఇక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇవి చాలవని ఇంకా ఆత్మాహుతి దాడులు గూడా చేస్తారా? విడిపోతామనే ఒకన్యాయమైన హక్కుకు అడ్డుపడటానికి ఇలాంటి బెదిరింపులు ఎందుకు? మీరు భయపెట్టి కలిసి ఉండమంటే అది సమైక్యత ఎలా అవుతుంది?

ఒక రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తే దేశం ఎలా ముక్కలయిపోతుంది సామీ? అలా ముక్కలయిపోయేదే నిజమయితే రాష్ట్రాలను మార్చే, పునర్విభజించే అధికారాన్ని తీసివేసేలా ఒక చట్టం తీసుకురాగూడదూ? ఇప్పటిదాకా యాభై సార్లు రాష్ట్రాలను పునర్విభజించారు, దేశం ఎన్ని ముక్కలయిందేమిటి? ఎందుకీ అసందర్భ ప్రేలాపనలు? నీకు దేశం ముక్కలయిపోయినా ఫరవాలేదు గానీ రాష్ట్రాన్ని మాత్రం విభజించనియ్యవా, ఎందుకో? అప్పనంగా దోచుకోవడం కుదరదనా?

అడక్కుండానే రాజీనామాలు చేసి ఏదో పొడిచేసామని చెప్పుకుంటున్న తెలంగాణా తెదే నేతల్లారా, జెర మీపార్టీ నాయకుల ప్రేలాపనలు జూడండి. మరి ఇలాంటి పిచ్చిపట్టిన పైత్యపు నాయకులకు మీరు సమాధానం చెబుతారా, లేక మీ గుడ్డికల్ల బాబు జెపుతాడా? తెలంగాణ నేతలు ఏచిన్న మాట అన్నా దాన్ని గోరంతలు కొండనత చేసే సీమాంధ్ర మీడియా, సీమాంధ్రా నాయకులు, సీమాంధ్రా సమర్ధ బ్లాగరులు ఇలాంటి మాటలు మాత్రం పట్టించుకోరు మరి, మనకు అనుకూలం కదా, ఏమన్నా సమర్ధనీయమే.

తెలంగాణను ఎన్ని సార్లు అడ్డుకుంటారు?

డిసెంబరు 9 2009 రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తరువాత సీమాంధ్ర నేతలు కృత్రిమ ఉద్యమం సృష్టించి గారడి చేసి కేంద్రప్రభుత్వం తిరిగి తమ ప్రకటన వెన్నక్కి తీసుకునేట్టు చేసి తెలంగాణ ఏర్పాటును అడ్డూకున్న విషయం తెలిసిందే.

అయితే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడం వీరికి ఇది కొత్తకాదు. ఇంతకుముందు ఫజల్అలి కమీషను భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన శిఫార్సులు చేసినపుడు తెలుగు మాట్లాడేవాఇకి హైదరాబాద్, ఆంధ్ర రెండు రాష్ట్రాలను సూచించింది. అయితే అప్పటి ఆంధ్ర నాయకులు తమ రాజధాని అవసరాలకై కేంద్రప్రభుత్వంపై వత్తిడీ తీసుకొచ్చి అప్పటి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నారు.

ఈక్రింది ఆంధ్ర పత్రిక 1955 అక్టోబరు 19 ఎడిషన్‌లో ఫజల్అలి సూచించినిన హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలతో ప్రచురితమైన  భారతదేశ పటాన్ని చూడవచ్చు. క్రింది టేబుల్లో రెండు రాష్ట్రాల విస్తీర్ణం, అప్పటి జనాభాలను కూడా చూడవచ్చు.

ఇంకా ఎన్ని దశాబ్దాలు ఈ సీమాంధ్రా నేతలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అడ్డుతగులుతూ తెలంగాణను తమ స్వార్ధప్రయోజనాలకోసం అడ్డుకుంటారో? కేవలం కొందరు నాయకుల స్వార్ధప్రయోజనాలకోసం కోట్లాది ప్రజల ఆకాంక్ష ఎనాల్లు వేచి చూడాలో!!

(source: missiontelangana.com)




Monday 18 July 2011

రాష్ట్రవిభజనకు హైదరాబాద్ అడ్డంకి కాదు: జేసీ

రాష్ట్రవిభజనకు హైదరాబాద్ అడ్డంకి కాదని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే జలవనరుల సమస్యే ప్రధానమని అసలు విషయం బయట పెట్టారు.

నిజానికి హైదరాబాదు విభజనకు సమస్య అని సమైక్యవాదులు పైకి చెబుతున్నప్పటికీ అది పెద్ద సమస్య కాదు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్ర సెటిలర్ల ఫోరం ఇప్పటికే పలుసార్లు విభజనకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. బెంగులూరు, మద్రాసులో ఉన్న సీమాంధ్రులకి లేని సమస్య హైదరాబాదులో ఉన్నవారికి ఉండజాలదని హైదరాబాద్ ఆంధ్రా సెటిలర్లకు తెలుసు కనుక వారెప్పుడూ విభజన సమయ్స అనుకోలేదు. కేవలం విభజన వ్యతిరేకించే నాయకులు లేని అపోహలు సృష్టిస్తూ హైదరాబాదు సీమాంధ్ర సెటిలర్ల రక్షణ ఒక సమస్య అని చెబుతున్నారు. అలా చెప్పే కుహనా సమైక్యవాదులూ ఏనాడూ తెలంగాణలో ఇతరప్రాంతాల్లో ఉన్న సీమాంధ్రుల రక్షణగురించి మాట్లాడింది లేదు.

అయితే జేసీ చెప్పేట్లు విభజన వలన నీటి వివాదాలు వస్తాయన్న దానిలో నిజం ఉంది. ఒక రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు తెలంగాణా క్రిష్ణా జలాలపై న్యాయమైన వాటాను ట్రిబ్యునల్ ద్వారా పొందగలదు. ఇప్పుడు ఒక్క నాగర్జునసాగర్ ఎడమకాలువలో కొద్ది  వాటా తప్ప (అందులో ఆంధ్రా వాటా పోగా మిగిలింది), మిగతా క్రిష్ణా జలాలు పూర్తిగా  ప్రకాశం బ్యారేజీ, నాగార్జునసాగర్ కుడి కాలువ, శ్రీశైలం కుడి కాలువ, వెలిగొండ, తెలుగుగంగ, హంద్రి-నీవా, కేసీ కెనాల్ లాంటి ప్రాజెక్టుల ద్వారా కోస్తాంధ్ర, రాయలసీమ తరలిపోతున్న విషయం తెలిసిందే. రాజోలి బండ ద్వారా మహబూబ్ నగర్‌కు కాసిని నీటిబొట్లు వస్తే అనేకసార్లు వాటికి అడ్డుపడి రాజోలిబండ గేట్లు పేల్చి జలదోపిడీ చేసిన విషయం, శ్రీశైలం ఎడమకాలువను ఫండ్సు ఇవ్వక దశాబ్దాలపాటుగా పెండింగు పెట్టిన విషయం, నాగార్జున సాగర్ ఎడమకాలువ అలైన్మెంటు మార్చి తెలంగాణ ఆయకట్టు తగ్గించిన విషయం తెలిసిందే. విభజిస్తే ఇప్పటిలా క్రిష్ణా జలాలు పూర్తిగా కొట్టేయడం జరగదని అసలు విషయం బయట పెట్టి ఇప్పుడు తెలంగాణకు క్రిష్ణాలో న్యాయమైన వాటా రావడం లేదని జేసీ చెప్పకనే చెప్పాడు.

Saturday 16 July 2011

సమైక్యాంధ్ర ఆందోళనలో విద్యార్థుల భాగస్వామ్యం ఎందుకులేదు?

తెలంగాణ ఉద్యమాన్ని గత రెండు సంవత్సరాలుగా ముందుకు తీసుకుపోయింది, అనేక ఆత్మహత్యలకు, త్యాగాలకు ఒడిగట్టింది తెలంగాణ విద్యార్థిలోకం. ఇందుకు పోటీగా సమైక్యాంధ్ర ఉద్యమంలో అక్కడి విద్యార్థులను లాగాలని సమైక్యాంధ్ర లీడర్లు ఎంత ప్రయత్నించినా విద్యార్థులు అక్కడ ఉద్యమంపై ఆసక్తి చూపట్లేదు. కడుపు కాలినవాడు ఉద్యమిస్తాడు కానీ కడుపు నిండినవాడు కాదు గదా?

ఇదే విషయంపై తెహెల్కా మాగజైను వారి వ్యాసాన్ని ఇక్కడ చూడొచ్చు.

Sunday 10 July 2011

వెక్కిరిస్తూనే కాపీకొడతారు

తెలంగాణ ఉద్యమకారులు ఏం చేసినా సమైక్యవాదులు వెక్కిరిస్తారు. కానీ అలా వెక్కిరించిన మనుషులే తిరిగి అవే పనులను కాపీకొడతారు. ఇక్కడ ఒక విద్యార్థి జాక్ ఉంటే అక్కడా ఒక విద్యార్థి జాక్ వెలుస్తుంది. ఇక్కడ ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ జాక్ చైర్మన్‌గా వ్యవహరిస్తే అక్కడ కూడా ప్రొఫెసరునే జాక్ చైర్మన్‌గా పెట్టుకుంటారు. అయినా తిరిగి ఇక్కడ ఉద్యమాలు చేసే విద్యార్థులనూ, ప్రొఫెసర్లనూ వెక్కిరిస్తూనే ఉంటారు.

ఇక్కడ ఉద్యమకారులు తెలంగాణ కలాకారుల ఆటాపాటలతో హోరెత్తిస్తుంటే అక్కడ వారి ఉద్యమానికి పాడుకోవడానికి పాటలు లేక లగడపాటి నిరాహారదీక్ష చేస్తుంటే రింగ రింగా పాట పెట్టుకుని గంతులేశారు. చివరికి డబ్బులిచ్చి ఈమధ్యనే గజల్ శ్రీనివాస్‌తో ఏదో పాట రాయించుకున్నారు. ఇక్కడ ఒక మహాఘర్జన పెడితే అక్కడా ఒక సీమాంధ్ర మహాఘర్జన పెట్టే ప్రయత్నం చేస్తారు, కాకపోతే ఆచరణలో వెయ్యిమంది కూడా రాకా అది సీమాంధ్ర మహామ్యావ్‌మ్యావ్ అవుతుందనేది వేరే విషయం. ఇక్కడ విగ్రహాలు కూలగొడితే  అక్కడా విగ్రహాలు కూలగొడుదామని వెదికనట్టున్నారు, అయితే ఎక్కడా తెలంగాణ వారి విగ్రహాలు దొరకక పోవడంతో నోర్మూసుకున్నారు.

తాజాగా తెలంగాణ ఉద్యమకారుల రోడ్డుపై వంటా వార్పు కార్యక్రమాన్ని కూడా కాపీ కొట్టడం ఈమొత్తం కాపీ కార్యక్రమానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. తెలంగాణ ఉద్యమకారులు శాంతియుతంగా నిరశన తెలుపడానికి వినూత్నంగా ఏర్పాటుచేసిన రోడ్డుపై వంటల కార్యక్రమం పూర్తి సక్సెస్ అయ్యింది. అయితే సమైక్యవాదులు మాత్రం అక్కసుతో ఆకార్యక్రమాన్ని కూడా వెక్కిరించారు. కొందరు బ్లాగుల్లో కూడా వెక్కిరించారు. అయితే ఇప్పుడు అదేకార్యక్రమాన్ని కాపీకొట్టి గుంటూరులో  చేశారు. అక్కడ కనీసం ఉద్యమ నేతలకుటుంబాలు కూడా పాల్గొనక అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినా మన పచ్చపత్రిక మాత్రం అది గొప్పగా సక్సెస్ అయ్యిందని వార్త రాసింది.

ఇంతకూ నేను చెప్పేదేమిటంటే సీమాంధ్ర కుహనా సమైక్యవాదులారా, మీకెలాగూ సొంతగా ఆలోచించే తెలివిలేదు, మీవి ఎప్పటికైనా కాపీ బతుకులే.. అయితే ఒకవైపు మీరే వెక్కిరిస్తూ మీరే కాపీ కొడితే అభాసుపాలయేది మీరేనని తెలుసుకోండి.

Monday 4 July 2011

ఆంధ్రామ్యాపుకు అలవాటుపడదాం




ఇప్పుడు తెలుగు జాతి ఐక్యత అంటూ బీరాలు పోయే సీమాంధ్రులు మద్రాసు నుండి విడిపోయేప్పుడు కోట్లాడింది తెలుగు జాతి మొత్తనికి రాష్ట్రం కోసం కాదు, మద్రాసు రాజధానిగా ఆంధ్ర ప్రాతం రాష్ట్రం కోసం అనే విషయం మనకు ఇన్నాల్లూ పాఠ్యపుస్తకాల్లో దాచిపెట్టినా ఇప్పుడు అందరికీ తెలిసిన సత్యమే. ఇదే ఆంధ్ర రాష్ట్ర పటానికి జేజేలు పలుకుతూ 1953 లో "బాల" మాగజైన్‌పై వచ్చిన ముఖ చిత్రాన్ని ఇక్కడ చూడొచ్చు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దగ్గరికి వచ్చిన ఈసమయంలో సీమాంధ్రులు ఇక తమ పాత మ్యాపుకు మెల్లిగా అలవాటు పడడం మొదలుపెడితే మంచిదేమో. అలాగే ఎలాగూ తథ్యమైన రాష్ట్ర విభజన గురించి చర్చలు మాని విడిపోయినాక కొత్త రాజధాని ఎక్కడ పెట్టుకోవాలి, రెండు రాష్ట్రాలు ఏర్పడాలా లేక మూడు రాష్ట్రాలా, ఖమ్మంలో కలిపిన గోదావరి సిగ్మెంటు తెలంగాణకు చెందాలా లేక ఆంధ్రకా లాంటి ప్రాక్టికల్ ఇష్యొలపై చర్చ జరపడం ఉత్తమం.

ఆఖరి పోరు మొదలయింది




తెలంగాణ కోసం ఆఖరి పోరు మొదలయింది. ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రేస్, తెదే ప్రజాప్రతినిధులు ప్రజల వత్తిడికి తలొగ్గి రాజీనామాలకు సిద్దమయ్యారు. ఈపాటికే సగం దాకా ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు. వీరి తెగువ ఇలాగే కడదాకా నిలిచి తెలంగాణ సాధిస్తుందని ఆశిద్దాం.