Sunday 25 May 2014

ఎవరు తాగుబోతులు?(సాక్షి రిపోర్ట్)

Sakshi | Updated: May 25, 2014 02:18 (IST)
తెలంగాణలో ‘కిక్కు’ తక్కువే!
ఐఎంఎల్ విక్రయాలు సీమాంధ్రలోనే అధికం
సీమాంధ్రలో రూ.10,972 కోట్ల మద్యం విక్రయాలు
గ్రేటర్‌ను మినహాయిస్తే తెలంగాణ జిల్లాల్లో రూ.5 వేల కోట్ల అమ్మకాలే
బీర్ల అమ్మకాల్లో మాత్రం తెలంగాణ టాప్
ఏకంగా 2.75 కోట్ల కేసుల బీర్లు అమ్మకాలు
2013-14 ఏపీబీసీఎల్ తేల్చిన లెక్కలివీ
 
 సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలవారీగా జరిగిన మద్యం విక్రయూలపై ఏపీబీసీఎల్ తేల్చిన లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కన సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎక్సైజ్, మద్యం విక్రయూలపై లభించే వ్యాట్ ఆదాయూల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చునని తేలుతోంది. ఈ మద్యం విక్రయాల్లోనూ కొన్ని ఆసక్తికరమైన విశేషాలు కనిపిస్తున్నాయి. ఐఎంఎల్ (ఇండియున్ మేడ్ లిక్కర్) విక్రయూలు సీవూంధ్రలో అధికంగా ఉండగా... బీర్ల అమ్మకాల్లో మాత్రం తెలంగాణ టాప్‌లో ఉంది. ప్రత్యేకించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీర్ల అమ్మకాలు గణనీయుంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా కోటి కేసుల బీరును లాగించేశారు! భారత తయారీ మద్యం (ఐఎంఎల్) మూడు రకాలుగా తయారవుతుంది.
 
 బాందీ, విస్కీ మొదలైన ఈ బ్రాండ్లలో ఆర్డినరీ, మీడియం, ప్రీమియం విభాగాలుగా తయారవుతుంది. మూడు రకాల లిక్కర్ అమ్మకాల్లోనూ తెలంగాణ కన్నా సీమాంధ్ర ముం దుంది. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 47.11 లక్షల మద్యం కేసులు అమ్ముడైతే, రెండు, మూడు స్థానాల్లో హైదరాబాద్, కరీంనగర్ నిలిచాయి. సీమాంధ్రలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 29.84 లక్షల ఐఎంఎల్ పెట్టెలు అమ్ముడయ్యాయి. మరో ఏడు జిల్లాల్లో 25 లక్షల నుంచి 29 లక్షల చొప్పున మద్యం పెట్టెలు విక్రయించడం గమనార్హం. మొత్తంగా తీసుకుంటే రెండు ప్రాంతాల్లో కలిపి 4.74 కోట్ల ఐఎంఎల్ అమ్మకాలు ఉంటే, అందులో సీమాంధ్రలో 2.83 కోట్లు, తెలంగాణలోని 8 జిల్లాల్లో 1.23 కోట్లు, హైదరాబాద్, రంగారెడ్డిలో 76.64 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో అత్యల్ప ఐఎంఎల్ విక్రయాలు సాగాయి.
 
 బీరులో తెలంగాణ జోరు..
 
 వేసవిలోనే ఎక్కువగా సాగే బీర్ల అమ్మకాలు గ్రేటర్ సహా తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. తెలంగాణలో 2.75 కోట్ల బీర్ల పెట్టెలు (ఒక్కో పెట్టెకు 12 చొప్పున) విక్రయించగా, సీమాంధ్రలో ఆ సంఖ్య 1.65 కోట్లకే పరిమితమైంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే కోటికిపైగా పెట్టెల బీర్లు విక్రయించడం గమనార్హం. తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్ తర్వాత బీర్ల అమ్మకాల్లో కరీంనగర్ ముందుండగా, సీమాంధ్రలో వైజాగ్ 21.93 లక్షల పెట్టెల విక్రయాలతో ముందుంది. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 7 లక్షల బీర్ల పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యాయి.

మరికొన్ని ముఖ్యాంశాలు..
 
 ఏడాదిలో రూ.వెయ్యి కోట్లకు పైగా అమ్మకాలు సాగిన జిల్లాలు తెలంగాణలో రంగారెడ్డి (రూ.2,403.12 కోట్లు), హైదరాబాద్(రూ.1,533.82 కోట్లు), కరీంనగర్(రూ.1,064.17 కోట్లు) ఉన్నాయి. సీమాంధ్రలో విశాఖపట్నం(రూ.1,194.66 కోట్లు), తూర్పు గోదావరి(రూ.1,114.62 కోట్లు), గుంటూరు(రూ.1,102.16కోట్లు),  కృష్ణా(రూ.1,068.15 కోట్లు), చిత్తూరు(రూ.1,001.36 కోట్లు) ఉన్నాయి.
 
 రూ.474.98 కోట్లతో అత్యల్ప మద్యం విక్రయాలు సాగిన జిల్లాగా నిజామాబాద్ నిలిచింది.
 
  2012- 13 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే తరహాలో విక్రయాలు సాగాయి. ఆ సంవత్సరం సీమాంధ్రలో రూ.9,534.58 కోట్ల విక్రయాలు జరగ్గా.. తెలంగాణలో 8,575 .65 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే రూ.3,500 కోట్ల విక్రయాలు జరిగాయి. అంటే నికరంగా తెలంగాణలో 2012-13లో జరిగిన మద్యం విక్రయాలు రూ.5 వేల కోట్ల పైచిలుకు మాత్రమే.

Sunday 18 May 2014

పవన్ పార్టీ అంతా డ్రామాయేనా?



ఒక అయిదారు నెలలకిందటివరకూ సీమాంధ్రలో ఏసర్వే చూసినా జగన్‌దే గెలుపని తేల్చింది. జగన్ కూడా మితిమీరిన ఆత్మ విశ్వాసంతో తానే గెలుస్తానని అనుకున్నాడు. అయితే చివరికి జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబుదే పైచేయి అయింది. ఇందుకు చంద్రబాబు కలిసొచ్చిన రెండు అంశాలు ఒకటి దేశమంతటా మోడి గాలి వీస్తున్న తరుణంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కాగా రెండోది పవన్ కల్యాన్ ద్వారా కలిసొచ్చిన కాపు వోటు బ్యాంకు.

సీమాంధ్రలో ఎన్నికల ఫలితాలు మూడు అగ్రకులాల చుట్టూనే తిరుగుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో తెదేపా కమ్మల పార్టీ కాగా జగన్‌కు రెడ్డి, దళిత క్రిస్టియన్ల మద్దతు ఉన్నది. కమ్మలకంటే దళిత క్రిస్టియన్లు కలిపి ఎక్కువ వోట్లు ఉంటాయి కాబట్టి నిన్నమొన్నటిదాకా జగన్‌దే పైచేయిగా ఉంది. ఎప్పుడైతే కాపు వోట్లు కూడా కలిసొచ్చాయో అప్పుడు సమీకరణం తారుమారయింది.

క్రితంసారి ఎన్నికల్లో కాపులు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి మద్దతు ఇచ్చారు. ఈసారి చిరంజీవి కాంగ్రేసులో ఉన్నాడూ కనుక కాపులు కాంగ్రేసుకు వోటువేయాల్సింది. కానీ కాంగ్రేసు గెలుస్తుందని చిరంజీవి సహా ఎవ్వరికీ నమ్మకం లేదు కాబట్టి కాపులు జగన్ వైపు ఉండటమే బెటరనుకునారు. ఎప్పుడైతే పవన్ జనసేన పార్టీ అంటూ పెట్టి ఎండీయేకి మద్దతు ఇచ్చాడో అప్పుడు కొందరు ఇటువైపు తిరిగారు.

అయితే ఇప్పుడొస్తున్న సందేహం పవన్ కళ్యాన్ పార్టీ పెట్టినందున నిజంగా చిరంజీవి ఫామిలీ రాజకీయంగా విడిపోయిందా లేక అంతా ఉత్తుత్తి డ్రామానా అని. బహుషా చిరంజీవి కూడా ఊహించి ఉంటాడు.."ఎలాగూ కాంగ్రేస్ గెలిచేది లేదు. కాపులంతా కాంగ్రేస్‌కు వోటు వేస్తే అది జగన్‌కే లాభం. దానిబదులు టీడీపీకి వోటు వేస్తే జగన్ను వోడించొచ్చు. కానీ కాంగ్రేస్లో ఉండి అలా చేయమని చెప్పే ధైర్యం చిరంజీవికి లేదు. పోనీ తానే పార్టీ మారుదామన్నా అప్పుడే రెండు పార్టీలు మార్చిన చిరంజీవికి మరో పార్టీ మార్చే ధైర్యం లేదు. అందుకే బహుషా చిరంజీవి తమ్ముడు పవన్ను ముందు పెట్టి కాపు వోట్లు టీడీపీకి వేయించి ఉంటాడు. ఏమో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.  

Thursday 15 May 2014

గజదొంగ, మోసగాడు



ఊర్లో రెండే సినిమా హాళ్ళున్నాయి. రెండిట్లో ఒకదాంట్లో గజదొంగ సినిమా, ఇంకో దాంట్లో మోసాగడు సినిమా నడుస్తుంటే సినిమాకెల్దామనుకున్న ప్రేక్షక మహానుభావుడు ఏసినిమాకు వెలతాడు? రెండిట్లో ఏదో ఒకదానికి వెల్లాలి. రెండింటికీ వెల్లకుండా ఇంట్లో కూచుంటే బోరు తప్ప మరో ఫలితం లేదు. రెండిట్లో దేనికి వెల్లాలంటే ఏసినిమా మన అభిమాన హీరో నటించిందయితే దానికెలతాడు. అందులో హీరోలిద్దరి కులాలు వేర్వేరు అయ్యుంటే కొందరు వారి వారి కులాలను బట్టికూడా ఏసినిమాకెల్లాలో నిర్ణయించుకోవచ్చు.

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్ర వోటరు పరిస్థితి ఇది. ఉన్న రెండూ పార్టీల్లో ఏదో ఒకదానికి వెయ్యాల్సిందే. మిగతా పార్టీలకు ఎలాగూ హెలిచే అవకాశమే లేదు. నెగ్గబోయేది గజదొంగా, మోసగాడా అనేది తెలియబోయేది ఇంకొన్ని గంటల్లోనే.