Wednesday 29 October 2014

బూటకాల బాబు!

నేను రైతులకు రుణమాఫీ ప్రకటిస్తే సాధ్యం కాదంటున్నారు? వారు దోచుకోవడానికి లక్ష కోట్లు వస్తాయి. కానీ రైతులకు మాఫీ చేయడానికి రాదా? నేను ఆర్థిక శాస్త్రవేత్తను, నాకు అంతా తెలుసు. జగన్ ఏమి చదువుకున్నాడు? ఆయనకేం తెలుసు? గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 24న ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్న మాటలివి.


babu



సీను కట్ చేస్తే...


పాదయాత్ర సమయంలో ప్రజల బాధలను చూశా. రైతు రుణమాఫీ, డ్వాక్రా పొదుపుసంఘాల రుణమాఫీకి హామీ ఇచ్చా. అప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉంది. ఇప్పుడు వేరు. రాష్ట్రం విడిపోయింది. ఆంధప్రదేశ్ ఎక్కడ ఉందో.. ఎంత బడ్జెట్ ఉందో నాకే కాదు,ఎవరికీ తెలియదు మే 18న ఈనాడు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదే చంద్రబాబు చెప్పిన మాట.విషయానికి వస్తే.. మే 16నాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అంటే ఫలితాలు వెలువడ్డ రెండోరోజే నాయుడుగారి టోన్ మారిపోయింది.

ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన రైతు రుణమాఫీ పథకం మీద బాబుగారు ప్లేటు ఫిరాయించేశారు. హామీ ఇచ్చినపుడు ఉమ్మడి రాష్ట్రం.. ఇపుడు వేరు పడింది కదా అనేది లాజిక్కు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..రాష్ట్రం మార్చి 1నే విడిపోయింది. రాష్ట్ర విభజన బిల్లు మీద ఆరోజే రాష్ట్రపతి సంతకం చేశారు. ఆ తర్వాతే ఎన్నికల ప్రకటన వచ్చింది. ఎన్నికల ప్రచారం జరిగినన్ని రోజులూ చంద్రబాబు రుణమాఫీ పాట పాడారు. ఎలా సాధ్యమన్న కాంగ్రెస్, వైఎస్సార్సీపీతో పాటు రాజకీయ విశ్లేషకులను సైతం దబాయించారు.నైన్ ఇయర్స్ గవర్నమెంట్ అంటూ గొప్పలు చెప్పారు. బచ్చాగాళ్లు మీకు ఏం తెలుసన్నారు. విజడమ్ ఆఫ్ ఎకనామిక్స్ అన్నారు. మొత్తానికి ఎన్నికల ఓడ దాటేశారు.

papa



కేంద్ర మంత్రుల ముందు సంతకాల బిల్డప్..


గమ్మత్తేమిటంటే రూ. 30 కోట్లు ఖర్చు చేసి భారీ ఏర్పాట్లతో బాబుగారి పట్టాభిషేకం జరుపుకున్నారు. కేంద్ర మంత్రులందరినీ విమానాలు పెట్టి మరీ పిలిపించారు. వెంకయ్య పౌరోహిత్యంలో సాగిన ఆ పట్టాభిషేకంలో కాగితాలు తెప్పించి రైతు రుణ మాఫీ తొలి సంతకాలు గీకి పారేశారు. కేంద్రమంత్రులతో శభాష్ అనిపించుకున్నారు. కొలువు తీరాక తొండి మొదలైంది. శ్వేతపత్రాలు అన్నారు. కోటయ్య కమిటీ అన్నారు. అటు లాగా ఇటు లాగి చివరకి మొత్తం రుణాలన్నీ మాఫీ పైసా కట్టొద్దు 

అన్న పిలుపు నిచ్చిన నోటితోనే లక్షన్నరకు కుదించారు. 
అంతే రుణమాఫీ ఫైలు మూమెంట్ అక్కడితో ఫుల్‌స్టాప్. అంగుళం కదిలిన జాడ లేదు. ధారాళంగా కురిపించిన మిగిలిన హామీలకు ఆ సంబరమూ దక్కలేదు.


మాఫీ చేసింది...హామీలనే..!


నాలుగు నెలలు దాటింది. రుణమాఫీ జరిగింది లేదు. పైసా విదిల్చింది లేదు. దాదాపు దశాబ్ధం పాటు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు వాగ్ధానాలిచ్చేటప్పుడు ఆర్థికపరిస్థితి తెలియదా ? ఎన్నికల తర్వాత మాట ఎందుకు మారిందన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు ఈ నాటికి చంద్రబాబు నుంచి సరైన సమాధానం లేదు. తొలిసంతకానికి ముందు నుంచే బాబు వైఖరిలో మార్పు మొదలైంది. ఆశపడ్డ అధికార పీఠం దక్కింది, ఇంకెవరూ ఏం చేయలేరన్న ధీమా వచ్చేసింది. బేషరతు రుణాల మాఫీ అన్న నోటితోనే ఎక్కడా లేని షరతులు విధించారు. కోతల వాతలు మొదలు పెట్టారు. 


ఏం చెప్పారు? ఏం చేశారు?


చంద్రబాబు ప్రచారం రుణమాఫీ అంశమే ప్రధానంగా చోటు చేసుకుంది. రైతు రుణాలే కాదు.. డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. ఈ రుణభారం మొత్తం లక్ష60వేల కోట్ల వరకు ఉంటుందని అప్పట్లోనే పలువురు రాజకీయవాదులు, పాత్రికేయులు కూడా వెల్లడించారు. అసలే రాష్ట్రం విడిపోయి ఆర్థికపరిస్థితి దిగజారి ఉండగా అంతమాఫీ అసాధ్యమని ప్రతిపక్షమంతా వాదించింది. కానీ తనకు రాజకీయ అనుభవం ఉందని చంద్రబాబు దబాయించారు. చేసి చూపుతానని సవాళ్లు చేశారు. కానీ అధికారంలోకి రాగానే అన్నీ తుంగలో తొక్కారు. ముందుగా శాఖల వారీగా శ్వేతపత్రాలు అన్నారు. 



బ్యాంకులే కవచంగా..


కమిటీతో రెండు నెలలు లాగిన ఏపీ సర్కారు ఈసారి బ్యాంకులను కవచంగా వాడుకుంది. బ్యాంకుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు రాలేవని సాకులు మొదలు పెట్టింది. ఐదు విడతల్లో చెల్లిస్తామంది. రుణాలకు కూడా రైతు సాధికారిక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది. సర్కార్ కార్పొరేషన్‌కు చెల్లిస్తే కార్పొరేషన్ బ్యాంక్‌లకు చెల్లిస్తుందన్నమాట. తొలివిడతగా 5వేల కోట్ల రూపాయలు ఇస్తానంది. ఐదు విడతలుగా రుణాలకు బాండ్లను ఇస్తామంది. విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగలేదు. ఈ జాప్యం పుణ్యమా అని వల్ల రైతులకు ఈసారి పంట భీమా పోయింది. సర్కారు కడుతుందో లేదో తెలియక తీసుకున్న రుణాలపై వడ్డీలు పెరుగుతుంటే సీమాంధ్ర రైతు గందరగోళంలో ఉన్నాడు. బ్యాంకుల నుంచి బకాయి కట్టమని నోటీసులు వస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది పరిస్థితి.


వాగ్దానాలకు మంగళం...!


టీడీపీ ఎన్నికల్లో గెలవడానికి కుప్పలు తెప్పులు వాగ్దానాలు చేసింది. అవన్నీ ఎన్నికల ప్రచారంలో బాబు పదేపదే ప్రకటించారు. రైతులకు పంట రుణమాఫీ, డ్వాక్రా పొదుపు సంఘాలకు రుణాల మాఫీ, నిరుద్యోగులకు భృతి, ఇంటికో ఉద్యోగం, రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ , ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, బెల్ట్ షాపుల రద్దు , రైతుల వారీగా పంటభీమా, పరిశ్రమలకు, ఇళ్లకు 24గంటల విద్యుత్‌సరఫరా, పేద బ్రాహ్మణులకు ఇండ్లు , 

పేపర్ బాయ్‌లు, ఫుట్‌పాత్ దుకాణదారులకు వడ్డీలేని ద్విచక్ర వాహన రుణం చంద్రబాబునాయుడు ఇచ్చిన హమీలలో ప్రధానమైనవి. మరో అంశం ఇంటికో ఉద్యోగం. ఇలా ఇస్తామంటే ఎలా సాధ్యమని నాయకులు నన్ను తప్పుపడుతున్నారు. ఎందుకు రావు? ..బాగా చదివితే పరిశ్రమల స్థాపన జరిగితే అని చిత్తూరు జిల్లా ప్రచారసభల్లో చంద్రబాబు సమర్థించుకున్నారు. కానీ తొలిసంతకాల్లోనే దాన్ని వదిలేశారు. ఆ తర్వాత కూడా పొరబాటున ఆయన కానీ ఆయన పార్టీ వారు గానీ ఆ ఊసే ఎత్తడం లేదు. 


డిమాండ్ లేని చోట్ల 24 గంటల విద్యుత్..


కేంద్రం సాయంతో 24గంటల విద్యుత్‌ను ఇస్తామన్నారు.ఏపీని రోల్‌మోడల్‌గా చేస్తామన్నారు. రాష్ట్రమంతా ఇస్తారేమోననుకుంటే అది పెద్దగా విద్యుత్ డిమాండ్ లేని కొన్ని పట్టణాలకు మాత్రమే పరిమితమైంది. ఎక్కడా అమలు జరగడం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ దాదాపు 100 గ్రామాలలో అసలు విద్యుత్‌వెలుగులు ప్రసరించడం లేదని సమాచారం. 

pap



పింఛన్లు గాయబ్...


తొలిసంతకంలో వృద్ధులకు, వికలాంగులకు పెంచిన ఫించన్లను అక్టోబర్ నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. వృద్ధులకు వేయి రూపాయలు, వికలాంగులకు 1500 పెంచినట్లు ప్రకటించారు. ఫించన్లను జారీ చేస్తున్నామని సర్కార్ ప్రకటించినా చాలా ప్రాంతాలలో అమలు కాలేదు. ఫించన్లు పొందాల్సిన వారు 47 లక్షలుంటే వారిని 5 లక్షలకు తగ్గించినట్లు ఆరోపణలున్నాయి. వృద్ధులకు, వికలాంగులకు చెల్లించాల్సిన 3,700కోట్ల మొత్తాన్ని రెండువేల కోట్లకు తగ్గించినట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.


తప్పదారి పట్టించేందుకే వివాదాలు..


ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక సతమతమవుతున్న నేపథ్యంలోనే చంద్రబాబు కావాలని తెలంగాణతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారన్న వాదన వినిపిపస్తున్నది. వాస్తవానికి పక్కన తెలంగాణ రాష్ట్రం లేకపోయినా.. టీఆర్‌ఎస్ వాగ్దానలు చిత్తశుద్ధితో అమలు చేయకపోయినా చంద్రబాబు ఏ ఒక్క వాగ్దానం అమలుకు కూడా పూనుకునే వారే కాదని అక్కడి మేధావులు అంటున్నారు. టీఆర్‌ఎస్ సర్కారు పనులు బాబుకు సంకటంగా మారాయని ప్రజలు తనను నిలదీస్తారనే భయం ఏర్పడిందని అంటున్నారు. అందుకే కావాలని వివాదాలు రేపుతున్నారన్న వాదన ఉంది. ఇరు ప్రాంతాల మధ్య ద్వేషభావం రగిలిస్తే హామీలనుంచి ప్రజల దృష్టి మళ్లించాలని ఆయన వ్యూహంగా ఉందంటున్నారు. 

అందులో భాగంగానే తెలంగాణలో సమస్యలను ఆయన ఆయన ఆస్థాన పత్రికలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు. అడుగడుగునా తెలంగాణ సర్కారుకు అడ్డంకులు సృష్టించేందుకే వారు ప్రయత్నిస్తున్నారు. రుణమాఫీ మెట్రోరైలు నుంచి ప్రతి వివాదాన్ని పనిగట్టుకుని రెచ్చగొడుతున్నారని వారు గుర్తు చేశారు. 


ప్రజల్లో అసహనం..


ఎన్నికల్లో బోలెడు వరాలు ప్రకటించి అధికారపగ్గాలు చేపట్టిన బాబు ఒక్కో హామీ విస్మరిస్తూ రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ వర్గాల్లో అసహనం పెరుగుతున్నది. ఎన్నికల ముందు ఎన్నో ఆశలు రేపిన చంద్రబాబు పాలనకు వచ్చే సరికి చతికిల బడ్డారు. పైపెచ్చు తెలంగాణలో ప్రభుత్వం ప్రగతి కార్యక్రమాల్లో దూసుకుపోతుంటే ఇక్కడ పాలన పట్టాలకే ఎక్కలేదనే అసంతృప్తి పెరుగుతున్నది. రాజధాని విషయంలో జరిగిన దాదాగిరి మీద రాయలసీమలో ఆవేదన పెరుగుతున్నది. 

ప్రకృతి వైపరీత్యాల సమయంలో పత్రికల్లో ప్రచారాలే తప్ప సహాయం అందక బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కొత్త రాష్ట్రం పాలనానుభవం గల వాళ్ల చేతిలో ఉండాలని ఎన్నుకుంటే పాత రీతిలోనే పైపై పూతలతోనే బండి లాగుతున్నారని మేధావులు విమర్శిస్తున్నారు. ఆరునెలల్లో రాజధాని కడతానని చెప్పి కనీసం ఏవైపు కడతారో కూడా ఇంత వరకూ తేల్చకపోవడమే ఏపీ సర్కారు పనితీరుకు నిదర్శనంగా నిలిచిందని అక్కడి మేధావులు అంటున్నారు. 

ఇవి చాలవన్నట్టు భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకోకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిపోటి మాటలతో రెచ్చగొట్టడం ఇరు ప్రాంతాల మధ్య ద్వేషాన్ని రాజేయడాన్నీ వారు తూర్పారపడుతున్నారు. ఎప్పటికైనా సీమాంధ్రప్రజలు తెలంగాణ మీద ఆధారపడే వారే తప్ప తెలంగాణకు సీమాంధ్రతో పని ఉండదని అంటున్నారు. తాత్కాలికంగా విద్యుత్తు, నీటి విషయాల్లో సీమాంధ్రతో అవసరాలున్నా, ఆ మేరకు పైచేయిగా కనిపించినా ఒకసారి కేంద్రం లేదా ట్రిబ్యునల్ కేటాయింపులు నిర్దారిస్తే ఆ తర్వాత తెలంగాణ ఏపీ వైపు కన్నెత్తి చూసే అవసరమే ఉండదని అంటున్నారు. ఆస్తులు వ్యాపారాలు బంధుత్వాల కారణంగా ఏపీకే ఆ అవసరం ఉంటుందని అంటున్నారు. పదేళ్ల తర్వాత రాజధాని విద్య వైద్యంతో సహా ఏ అంశంలోనూ ఏపీకి హక్కులు మిగలవని గుర్తు చేస్తున్నారు. 


తెలంగాణలో అమలు..


తెలంగాణలోనూ రుణమాఫీ ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకుంది. ఏపీలాగే ఇక్కడా మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ కంగారు పడి రెండు లక్షల అంటూ వేలం పాట పాడింది. కానీ టీఆర్‌ఎస్ నిజాయితీగా లక్ష రూపాయల వరకూ మాఫీ అని స్థిరంగా నిలబడింది. అంతే తప్ప పోటీకి పోయి పాటను పెంచలేదు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను విశ్వసించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వమూ ప్రజల విశ్వాసాన్ని నిలుపుకుంది. రైతు రుణాల మాఫీ అమలు చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఇవాళ ఏపీ రాజకీయ వర్గాల్లో చెప్పుకునేదేమంటే తెలంగాణలో మాఫీ జరక్కుంటే ఏపీలోనూ చంద్రబాబు ఎగ్గొట్టే వాడని..


కమిటీలతో, షరతులతో కాలయాపన ..


సమస్యను నాన్చాలన్నా వాయిదా వేయాలన్నా ప్రభుత్వాలు ఆశ్రయించేది కమిటీలనే. ఆ ఎత్తుగడల్లో చంద్రబాబు ఆరితేరారు. రుణమాఫీపై తొలిసంతకం చేసిన బాబు మార్గదర్శకాల ఖరారు అంటూ నాబార్డు మాజీ ఛైర్మన్ కోటయ్య అధ్యక్షతన కమిటీ వేశారు. ఇబ్బంది లేకుండా రెండు నెలల గడిచాయి. ఆ తర్వాత ఆ కమిటీ మొత్తం పంటరుణాలు 87వేల కోట్లకు పైనే అని తేల్చింది. పాత మాటలన్నీ మరిచి లక్ష యాభైవేల రూపాయలలోపు పంట రుణాలు మాఫీ చేస్తామన్నారు. 

కుటుంబంలో ఒకరికే మాఫీ నిబంధన పుట్టించారు. అది కూడా పంటల వారీగా మాఫీమొత్తాన్ని నిర్ణయిస్తామనిచెప్పారు. వరికి 25వేలు. వేరుశనగకు 25వేలు అంటూ కొత్త మార్గదర్శకాలు ప్రకటించారు. అవీ చాలక ఆధార్ ఉండి తీరాలన్నారు. అలవికాని షరతులతో రైతు పంటరుణాలను 40వేల కోట్లకు కుదించారు. చెల్లింపులు మాత్రం జరగలేదు. 


డ్వాక్రామహిళల పరిస్థితి దయనీయం..


డ్వాక్రా మహిళలకు పంగనామాలే మిగిలాయి. మొత్తం రుణాలను మాఫీ చేస్తామన్న బాబు సర్కార్ ప్లేటు ఫిరాయించి ఒక్కో డ్వాక్రా సంఘానికి లక్ష మాత్రమే అంది. అది కూడారుణమాఫీ కాదు వ్యాపార అభివృద్ధి అంది. అదికూడా 20 శాతం చొప్పున దశల వారీగా ఇస్తామంటోంది. ఇంతవరకు పైసా రాలేదు. 


ఎన్టీఆర్ సుజల స్రవంతి...ఎక్కడ...?


మిగతా వాటి విషయం ఎలా ఉన్నా కనీసం ముఖ్యమంత్రి చేసిన తొలిసంతకాలలో ఉన్న హామీలు కూడా అమలు జరగడం లేదు. ఎన్టీ ఆర్ సుజల స్రవంతి పథకం అందులో ఒకటి. రెండురూపాయలకే 20 లీటర్ల రక్షిత నీటినందిస్తామని ప్రకటించారు. దానికి ముహుర్తాల మీద ముహుర్తాలు పెడుతూ వాయిదా వేస్తున్నారు. జన్మభూమిలో భాగంగా కొన్ని చోట్ల నామమాత్రంగా ప్రారంభించినా అది అమలుకు నోచుకోలేదు. ఇంతవరకు ఎక్కడ నీటిని సరఫరా చేశారో చెప్పమని అక్కడి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.


ఉద్యోగులకు హామీలే మిగిలాయి..


ఉద్యోగులతో ఇకపై సఖ్యంగా ఉంటా అని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. పే రివిజన్, హెల్త్‌కార్డులు ఇస్తానన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఆ రెండు హామీలను అమలు చేసింది. ఏపీలో ప్రభుత్వ పరిశీలనలోనే ఆ అంశాలున్నట్టు కనిపించడం లేదు. అపుడపుడూ ఇస్తా చూస్తాం అనే హామీలు తప్ప. బెల్డ్ షాపుల రద్దు వాగ్దానం వైన్‌షాపులను సృష్టించి మరింత చేటు చేసిందని అంటున్నారు.

Saturday 30 August 2014

వినాయకుడి భూలోక యాత్ర -2


ప్రభూ, మరిచితిరా నేడు వినాయక చవితి. మనం ఉండ్రాళ్ళవేటలో భూలోకయాత్రకు వెల్లాల్సిన రోజు. మీరేమిటి తీరిగ్గా కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయారు?

మరువలేదు వినాయకా! పోయినసారి వినాయకచవిత సమయంలో తెలుగు రాష్ట్రంలో సమైక్యాంధ్రపేరుతో నానాయాగీ జరుగుతుండేది. అప్పుడు మనం సీమాంధ్ర జోలికి పోకుండా తెలంగాణ ప్రాంతం మాత్రం వెల్లి వచ్చాం. మరి ఇప్పుడు సంవత్సరం గడిచింది కదా, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలాఉంది, ఎక్కడికెలితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను. ఇంతకూ ఆఉద్యమం ఆగిపోయిందా? ఇప్పుడు రాష్ట్రం కలిసి ఉందా, విడిపోయిందా, అక్కడి పరిస్థితులెలా ఉన్నాయి? నీదగ్గరేమన్నా సమాచారం ఉందా మూషికా?

ఏముంది ప్రభూ! వీరి దొంగ ఉద్యమాలను పట్టించుకోకుండా కేంద్రం రాష్ట్రాన్ని విభజించింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండూ ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయాయి. ఎన్నికలు జరగడంతో కొత్తప్రభుత్వాలు వచ్చాయి. ఇక ఉద్యమం సంగతంటారా... మేము బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాం, సునామి సృష్టిస్తాం అంటూ ప్రగల్భాలు పలికినవారు కేంద్రం బిల్లును ఆమోదించగానే దెబ్బకు దిమ్మతిరిగి మన్నుతిన్నపాముల్లాగ పడిఉన్నారు. 

అలాగా. పోనీలే, సమైక్య ఉద్యమాన్ని నడిపినందుకు ఆనాయకులు ప్రజల మనసులను గెలుచుకునే ఉంటారుగా. వారి భవిష్యత్తుకు మాత్రం ఢోకా ఉండదులే.

అలా జరుగలేదు ప్రభూ. పైగా ప్రజల ఆమోదం లేని ఉద్యమాన్ని సొంతలాభాలకోసం తమపైన రుద్దారని ప్రజలు వారికి దిమ్మతిరిగేలా బుద్ధిచెప్పారు. సమైక్యసింహాలమని ఘర్జించిన వారెవరికీ అడ్రసు దొరక్కుండా చేశారు. సమైక్యాంధ్ర పార్టీ అంటూ ఒక కొత్త పార్టీ పెట్టిన మాజీముఖ్యమంత్రి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏంచేస్తున్నాడో ఎవరికీ తెలియదు. పైగా విభజనకు మద్దతు ఇస్తూ లేఖ రాసిన పార్టీనీ, విభజన కోసం కేంద్రాన్ని నిలద్దీసిన పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీనీ గెలిపించి అక్కడి ప్రజలు ఈమేడిపండు సమైక్యవాదులకు బుద్దొచ్చేలా చేశారు.  

ఇప్పుడు విభజన జరిగిపోయింది కదా? ఇప్పుడు రెండు రాష్ట్రాలూ ఎలాగున్నాయి? అందరూ నాపుట్టినరోజును ఘనంగా పండగ చేసుకుంటున్నారా? 

తెలంగాణలో ప్రజలు తాము ఇన్నాళ్ళూ కలలుగన్న తమ రాష్ట్రం వచ్చినందుకు పండుగ ఘనంగా చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా మీవిగ్రహాలూ, ఉండ్రాల్లూ, లడ్డూలూ. సీమాంధ్రలో సామాన్య ప్రజలకు కలిసున్నా విడిపోయినా వచ్చేదిగానీ, పోయేదిగానీ ఏమీలేదని తెలుసు కాబట్టి అక్కడి ప్రజలు ఎప్పటిలాగే ఎవరికి తోచినరీతిలో వారు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల రికార్డ్ డాన్సులు అదిరిపోతున్నాయట.

అలాగా పోన్లే. ఇంతకూ కొత్త ప్రభుత్వాల పాలనలెలా ఉన్నాయి? 

తెలంగాణలో అధికారంలోకొచ్చిన తెలంగాణ పార్టీ దూసుకుపోతుంది ప్రభూ. అక్కడి ముఖ్యమంత్రి రోజుకొక కొత్త ఆలోచనతో ప్రజాక్షేమం గురించి ఆలోచిస్తూ పాలన చేస్తున్నాడు. మచ్చుకు కొన్ని మంచి నిర్ణయాలు: 
- సమైక్య రాష్ట్రంలో అనుమతులు తెచ్చుకున్న పనికిమాలిన నూట ఎనభై ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులను రద్దు చేశాడు. తద్వారా ఫీజు మాఫీ పేరుతో జరుగుతున్న ప్రజాధనం లూటీని ఆపేసి కేవలం అర్హత కలిగిన కాలేజీలకు మాత్రం అనుమతినిచ్చాడు. 
- ఇటీవలే విప్లవాత్మకంగా ఒక్కరోజు సర్వే నిర్వహించి ప్రజాధనం పక్కదారులు పట్టకుండా ఆపేప్రయత్నం చేస్తున్నాడు.
- ఇల్లపంపిణీలో అక్రమాలపై దర్యాప్తు చేయిస్తున్నాడూ
- క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాడు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ప్రైజుమనీని ఇప్పుడు వెంటనే ఇప్పించాడు.
- కబ్జాలపై కొరడా ఝులిపించాడు.

అయితే అంతా బాగున్నా అక్కడ కరెంటు కోతలు మాత్రం విపరీతంగా ఉన్నాయి ప్రభూ. గత ప్రభుత్వం చేసిన పాపపు నిర్ణయాల కారణంగా ఇక్కడ కరెంటు ఉత్పత్తి తక్కువ, వినిమయం ఎక్కువ. విభజన తరువాత గడ్డుపరిస్థితే వచ్చింది ప్రభూ. పక్క రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉన్నా, కోతలకు కారణం తమ గత విధానాలే అయినా సీమాంధ్ర రాష్ట్రం మాత్రం సాయం చేయడం లేదు సరికదా,  పీపీయేల రద్దు, ప్లాంటు మైంటనెన్సు పేరుతో రోజుకో కుట్రపన్నుతూ తెలంగాణప్రజల ఉసురు పోసుకుంటున్నారు. పైగా తెలంగాణలో కూడా రాబోయే కాలంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్నాడు ప్రభూ.

అలాగా! వీడెవడో సాడిస్టులాగున్నాడు. మరి సీమాంధ్ర ముఖ్యమంత్రి పార్టీకి చెందిన తెలంగాణ నాయకులైనా అడగొచ్చు గదా?

అంత ధైర్యమే వారికుంటే అసలు విభజనే అవసరం ఉండేది కాదు ప్రభూ. ఈసీమాంధ్ర పార్టీలు ఎప్పుడూ తమ మోచేతి నీటిని తాగేవారికే తెలంగాణలో నాయకత్వం ఇస్తారు.

ఇంతకూ మూషికా, సీమాంధ్ర రాష్ట్రంలో పాలన ఎలాగుంది? 

ఎలాగుంటుంది ప్రభూ! అధికారంలోకి రావడానికి అక్కడి ముఖ్యమంత్రి అడ్డమైన వాగ్దానాలన్నీ చేశాడు. ఇప్పుడు వాటిని తీర్చలేక జుట్టు పీక్కుంటునాడు. అసలే లోటు బడ్జెట్, ఆపైన ఆచరణ సాధ్యం కాని హామీలు. అందుకే ఆముఖ్యమంత్రి కుట్రలు తప్ప పాలన చేయడంలేదు. ఇప్పుడు ఈరాష్ట్రానికి కొత్త రాజధాని అవసరం ఉంది. తమ కులం వారు బాగా ఉండే ప్రాంతమూ, తమ పార్టీ నేతలకు భూములున్న ప్రాంతంలో రాజధాని కావాలని ఇతని పంతం. కేంద్రకమిటీనేమో అక్కడొద్దంటుంది. 

ప్రతిపక్షనేత ఏం చేస్తున్నాడు? అసెంబ్లీలో ఈవిషయాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడా?

లేదు ప్రభూ! అసెంబ్లీలో తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, హత్యలు చేశారు అంటూ అసెంబ్లిని స్థంభంపజేస్తున్నాడు. ప్రజల సమస్యలగురించి మాత్రం ఒక్కమాట కూడా మాట్ల్లాడడం లేదు. ఇదే మంచిదనుకొని అధికార పక్షం వీరి తండ్రిగారి పాలనలో జరిగిన హత్యలను లేవనెత్తుతుంది. దొందు దొందే. ఎక్కడైనా కర్ర ఉన్నవాడిదే బర్రె కానీ సీమాంధ్రలో మాత్రం బాంబులు, తుపాకులు ఉన్నవాడిదే అధికారం కనుక ఈరెండు పార్టీల నాయకులూ హత్యారాజకీయాలద్వారా పైకొచ్చినవారే. వీరి మధ్య నలిగిపోతున్నది సామాన్య ప్రజలే. ఎలాగోలా తెలంగాణ ప్రజలు మాత్రం  వీళ్ళబారినుండి తప్పించుకున్నారు.  

చూడబోతే ఇప్పట్లో సీమాంధ్ర బాగుపడేట్టు లేదు గానీ ఈసారికూడా మనం తెలంగాణ వెల్లి ఉండ్రాల్లు తిందాం పద మూషికా. పనిలో పనిగా విద్యత్ సమస్య నుంచి తొందరగా బయటపడాలని ఆరాష్ట్రాన్ని ఆశీర్వదిద్దాం!!

చిత్తం ప్రభూ!  







Sunday 25 May 2014

ఎవరు తాగుబోతులు?(సాక్షి రిపోర్ట్)

Sakshi | Updated: May 25, 2014 02:18 (IST)
తెలంగాణలో ‘కిక్కు’ తక్కువే!
ఐఎంఎల్ విక్రయాలు సీమాంధ్రలోనే అధికం
సీమాంధ్రలో రూ.10,972 కోట్ల మద్యం విక్రయాలు
గ్రేటర్‌ను మినహాయిస్తే తెలంగాణ జిల్లాల్లో రూ.5 వేల కోట్ల అమ్మకాలే
బీర్ల అమ్మకాల్లో మాత్రం తెలంగాణ టాప్
ఏకంగా 2.75 కోట్ల కేసుల బీర్లు అమ్మకాలు
2013-14 ఏపీబీసీఎల్ తేల్చిన లెక్కలివీ
 
 సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలవారీగా జరిగిన మద్యం విక్రయూలపై ఏపీబీసీఎల్ తేల్చిన లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కన సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎక్సైజ్, మద్యం విక్రయూలపై లభించే వ్యాట్ ఆదాయూల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చునని తేలుతోంది. ఈ మద్యం విక్రయాల్లోనూ కొన్ని ఆసక్తికరమైన విశేషాలు కనిపిస్తున్నాయి. ఐఎంఎల్ (ఇండియున్ మేడ్ లిక్కర్) విక్రయూలు సీవూంధ్రలో అధికంగా ఉండగా... బీర్ల అమ్మకాల్లో మాత్రం తెలంగాణ టాప్‌లో ఉంది. ప్రత్యేకించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీర్ల అమ్మకాలు గణనీయుంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా కోటి కేసుల బీరును లాగించేశారు! భారత తయారీ మద్యం (ఐఎంఎల్) మూడు రకాలుగా తయారవుతుంది.
 
 బాందీ, విస్కీ మొదలైన ఈ బ్రాండ్లలో ఆర్డినరీ, మీడియం, ప్రీమియం విభాగాలుగా తయారవుతుంది. మూడు రకాల లిక్కర్ అమ్మకాల్లోనూ తెలంగాణ కన్నా సీమాంధ్ర ముం దుంది. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 47.11 లక్షల మద్యం కేసులు అమ్ముడైతే, రెండు, మూడు స్థానాల్లో హైదరాబాద్, కరీంనగర్ నిలిచాయి. సీమాంధ్రలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 29.84 లక్షల ఐఎంఎల్ పెట్టెలు అమ్ముడయ్యాయి. మరో ఏడు జిల్లాల్లో 25 లక్షల నుంచి 29 లక్షల చొప్పున మద్యం పెట్టెలు విక్రయించడం గమనార్హం. మొత్తంగా తీసుకుంటే రెండు ప్రాంతాల్లో కలిపి 4.74 కోట్ల ఐఎంఎల్ అమ్మకాలు ఉంటే, అందులో సీమాంధ్రలో 2.83 కోట్లు, తెలంగాణలోని 8 జిల్లాల్లో 1.23 కోట్లు, హైదరాబాద్, రంగారెడ్డిలో 76.64 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో అత్యల్ప ఐఎంఎల్ విక్రయాలు సాగాయి.
 
 బీరులో తెలంగాణ జోరు..
 
 వేసవిలోనే ఎక్కువగా సాగే బీర్ల అమ్మకాలు గ్రేటర్ సహా తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. తెలంగాణలో 2.75 కోట్ల బీర్ల పెట్టెలు (ఒక్కో పెట్టెకు 12 చొప్పున) విక్రయించగా, సీమాంధ్రలో ఆ సంఖ్య 1.65 కోట్లకే పరిమితమైంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే కోటికిపైగా పెట్టెల బీర్లు విక్రయించడం గమనార్హం. తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్ తర్వాత బీర్ల అమ్మకాల్లో కరీంనగర్ ముందుండగా, సీమాంధ్రలో వైజాగ్ 21.93 లక్షల పెట్టెల విక్రయాలతో ముందుంది. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 7 లక్షల బీర్ల పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యాయి.

మరికొన్ని ముఖ్యాంశాలు..
 
 ఏడాదిలో రూ.వెయ్యి కోట్లకు పైగా అమ్మకాలు సాగిన జిల్లాలు తెలంగాణలో రంగారెడ్డి (రూ.2,403.12 కోట్లు), హైదరాబాద్(రూ.1,533.82 కోట్లు), కరీంనగర్(రూ.1,064.17 కోట్లు) ఉన్నాయి. సీమాంధ్రలో విశాఖపట్నం(రూ.1,194.66 కోట్లు), తూర్పు గోదావరి(రూ.1,114.62 కోట్లు), గుంటూరు(రూ.1,102.16కోట్లు),  కృష్ణా(రూ.1,068.15 కోట్లు), చిత్తూరు(రూ.1,001.36 కోట్లు) ఉన్నాయి.
 
 రూ.474.98 కోట్లతో అత్యల్ప మద్యం విక్రయాలు సాగిన జిల్లాగా నిజామాబాద్ నిలిచింది.
 
  2012- 13 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే తరహాలో విక్రయాలు సాగాయి. ఆ సంవత్సరం సీమాంధ్రలో రూ.9,534.58 కోట్ల విక్రయాలు జరగ్గా.. తెలంగాణలో 8,575 .65 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే రూ.3,500 కోట్ల విక్రయాలు జరిగాయి. అంటే నికరంగా తెలంగాణలో 2012-13లో జరిగిన మద్యం విక్రయాలు రూ.5 వేల కోట్ల పైచిలుకు మాత్రమే.

Sunday 18 May 2014

పవన్ పార్టీ అంతా డ్రామాయేనా?



ఒక అయిదారు నెలలకిందటివరకూ సీమాంధ్రలో ఏసర్వే చూసినా జగన్‌దే గెలుపని తేల్చింది. జగన్ కూడా మితిమీరిన ఆత్మ విశ్వాసంతో తానే గెలుస్తానని అనుకున్నాడు. అయితే చివరికి జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబుదే పైచేయి అయింది. ఇందుకు చంద్రబాబు కలిసొచ్చిన రెండు అంశాలు ఒకటి దేశమంతటా మోడి గాలి వీస్తున్న తరుణంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కాగా రెండోది పవన్ కల్యాన్ ద్వారా కలిసొచ్చిన కాపు వోటు బ్యాంకు.

సీమాంధ్రలో ఎన్నికల ఫలితాలు మూడు అగ్రకులాల చుట్టూనే తిరుగుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో తెదేపా కమ్మల పార్టీ కాగా జగన్‌కు రెడ్డి, దళిత క్రిస్టియన్ల మద్దతు ఉన్నది. కమ్మలకంటే దళిత క్రిస్టియన్లు కలిపి ఎక్కువ వోట్లు ఉంటాయి కాబట్టి నిన్నమొన్నటిదాకా జగన్‌దే పైచేయిగా ఉంది. ఎప్పుడైతే కాపు వోట్లు కూడా కలిసొచ్చాయో అప్పుడు సమీకరణం తారుమారయింది.

క్రితంసారి ఎన్నికల్లో కాపులు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి మద్దతు ఇచ్చారు. ఈసారి చిరంజీవి కాంగ్రేసులో ఉన్నాడూ కనుక కాపులు కాంగ్రేసుకు వోటువేయాల్సింది. కానీ కాంగ్రేసు గెలుస్తుందని చిరంజీవి సహా ఎవ్వరికీ నమ్మకం లేదు కాబట్టి కాపులు జగన్ వైపు ఉండటమే బెటరనుకునారు. ఎప్పుడైతే పవన్ జనసేన పార్టీ అంటూ పెట్టి ఎండీయేకి మద్దతు ఇచ్చాడో అప్పుడు కొందరు ఇటువైపు తిరిగారు.

అయితే ఇప్పుడొస్తున్న సందేహం పవన్ కళ్యాన్ పార్టీ పెట్టినందున నిజంగా చిరంజీవి ఫామిలీ రాజకీయంగా విడిపోయిందా లేక అంతా ఉత్తుత్తి డ్రామానా అని. బహుషా చిరంజీవి కూడా ఊహించి ఉంటాడు.."ఎలాగూ కాంగ్రేస్ గెలిచేది లేదు. కాపులంతా కాంగ్రేస్‌కు వోటు వేస్తే అది జగన్‌కే లాభం. దానిబదులు టీడీపీకి వోటు వేస్తే జగన్ను వోడించొచ్చు. కానీ కాంగ్రేస్లో ఉండి అలా చేయమని చెప్పే ధైర్యం చిరంజీవికి లేదు. పోనీ తానే పార్టీ మారుదామన్నా అప్పుడే రెండు పార్టీలు మార్చిన చిరంజీవికి మరో పార్టీ మార్చే ధైర్యం లేదు. అందుకే బహుషా చిరంజీవి తమ్ముడు పవన్ను ముందు పెట్టి కాపు వోట్లు టీడీపీకి వేయించి ఉంటాడు. ఏమో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.  

Thursday 15 May 2014

గజదొంగ, మోసగాడు



ఊర్లో రెండే సినిమా హాళ్ళున్నాయి. రెండిట్లో ఒకదాంట్లో గజదొంగ సినిమా, ఇంకో దాంట్లో మోసాగడు సినిమా నడుస్తుంటే సినిమాకెల్దామనుకున్న ప్రేక్షక మహానుభావుడు ఏసినిమాకు వెలతాడు? రెండిట్లో ఏదో ఒకదానికి వెల్లాలి. రెండింటికీ వెల్లకుండా ఇంట్లో కూచుంటే బోరు తప్ప మరో ఫలితం లేదు. రెండిట్లో దేనికి వెల్లాలంటే ఏసినిమా మన అభిమాన హీరో నటించిందయితే దానికెలతాడు. అందులో హీరోలిద్దరి కులాలు వేర్వేరు అయ్యుంటే కొందరు వారి వారి కులాలను బట్టికూడా ఏసినిమాకెల్లాలో నిర్ణయించుకోవచ్చు.

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్ర వోటరు పరిస్థితి ఇది. ఉన్న రెండూ పార్టీల్లో ఏదో ఒకదానికి వెయ్యాల్సిందే. మిగతా పార్టీలకు ఎలాగూ హెలిచే అవకాశమే లేదు. నెగ్గబోయేది గజదొంగా, మోసగాడా అనేది తెలియబోయేది ఇంకొన్ని గంటల్లోనే.

Thursday 20 February 2014

అప్పుడే ఒప్పుకుని ఉంటే!!


చివరికి అనివార్యమైన రాష్ట్ర విభజన జరిగిపోతుంది. తెలంగాణ ప్రజల అరవై ఏళ్ళ కళ సాకారం కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు.

అలాగే సీమాంధ్ర ప్రజలకు కూడా నా శుభాకాంక్షలు. సీమాంధ్ర ప్రజలకు ఈవిభజన వలన ఒక అస్తిత్వం వచ్చింది. ఇకనుంచి సీమాంధ్రకు మాత్రమే లాభించే ఏవిషయాన్ని కూడా తెలుగుజాతికి లాభంగా చెప్పుకుని తమను తము మోసం చేసుకోనక్కర్లేదు, సీమాంధ్రకు లాభం అని చెప్పుకోవచ్చు. ఇకనుంచైనా తమ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టుకోవచ్చు. విభజన జరిగేవరకూ ఈసమస్య రగులుతూనే ఉంటుంది కాబట్టి సమస్య పరిష్కారం అందరికీ మంచిదే. 
   
ఈవిభజన జరిగిన విధానం సీమాంధ్రకు అన్యాయం జరిగేట్లు ఉంది, బిల్లును తమపైకి బుల్‌డోజు చేశారు అని బాధపడేవారు ఇలాంటి పరిస్థితి రావడానికి తమనేతలే కారణమని తెలుసుకోవాలి. బిల్లులో సీమాంద్ర కోరికలు పూర్తిగా తీరలేదు అనుకునేవారు తెలంగాణప్రజల కోరికలుకూడా పూర్తిగా తీరలేదని గ్రహించాలి. ఉమ్మడి రాజధాని, ఉద్యోగులు పంపిణీ విధానం, విద్యాసంస్థల్లో ప్రవేశార్హతలు లాంటి పలు విషయాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. అలాగే పోలవరంకు తెలంగాణ అంగీకారం చేసినట్లు ఉన్న క్లాజు, పోలవరంకోసం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపి గిరిజనులను నిట్టనిలవునా ముంచడం లాంటివి అస్సలు బాగోలేవు. కాకపోతే పంపకాల్లో అన్నీ అనుకూలంగా ఉండాలనుకుంటే కుదరదు, పట్టువిడుపులు అవసరం కాబట్టి తెలంగాణ నేతలు ఇవి అన్యాయం అని తెలిసీ ఒప్పుకోవడం జరిగింది. 

అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది 2009లోనే యూపీయే ప్రభుత్వం తెలంగాణను ప్రకటించడం జరిగితే సీమాంధ్రలో పోటీ ఉద్యమం లేవదీసి విభజనను ఇన్నిరోజులు ఆపడం వలన సీమాంధ్ర ప్రాంత ప్రజలు పొందిన లాభమేమీ లేదు. పైగా అనేక నష్టాలు జరిగాయి.

రెండువేలతొమ్మిదిలోనే విభజన జరిగిఉంటే అప్పుడు సీమాంధ్ర ఎంపీల మద్దతు యూపీయేకు అవసరమైన తరుణంలో సీమాంధ్ర ఇంకాస్త గట్టిగా తమ ప్రాంత ప్రజల అవసరాలగురించి నెగోషియేట్ చేసే అవకాశం ఉండేది. దానివల్ల సీమాంధ్రకు లాభాలు బాగానే జరిగేవనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆఖరు నిముషంలో జరిగిన విభజన వలన సీమాంధ్ర ఎంపీల మద్దతు ఎవరికీ అవసరంలేని సమయంలో ఎన్ని డ్రామాలు చేసినా ఎలా తుస్సుమన్నాయో చూశాం. బ్రహ్మాస్త్రాలన్నీ తోకపటాకుల్లా తుస్సుమన్నాయి తప్ప పేలలేదు.

ఈమూడేల్లలో సీమాంధ్ర రాజధాని నిర్ణయం జరగడమేకాక షుమారు కావల్సిన ఇంఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తయేది.  ఎవరి బడ్జెట్ వారేసుకుని ఎవరి ప్రాంత అభివృద్ధిని వారు చూసుకునేవారు. సీమాంధ్రకు కేంద్రం ప్రతిపాదించిన IIT,IIM లాంటివాటిలో కొన్నైనా ఈపాటికి పూర్తయేవి. అన్నివిధాలుగా సీమాంధ్ర ప్రజలకు విభజన మూడేళ్ళకిందట జరిగిఉంటే లాభం అధికంగా ఉండేది. 

అయితే మూడేళ్ళు ఈవ్యవహారాన్ని సాగదీయడం వలన లాభపడింది ఎవరు ఎంటే సీమాంధ్ర ముఖ్యమంత్రి, మంత్రులూ, ఎంపీలో ఇతర నేతలు. ఎలాగు విభజన జరిగిపోతుందని వీరికి ముందే తెలుసు కనుక తెలంగాణను సాధ్యమయినంత దోచుకున్నారు. జలయగ్నం కాంట్రాక్టులు, ఇతర సివిల్ కాంట్రాక్టుల్లో సీమాంధ్ర పొలిటికో బుజినెస్‌మెన్ అయిన ఎంపీలు కోట్లు దండుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి ఆఖరి వారంలో పెట్టిన సంతకాలద్వారానే కోట్లు చేతులు మారాయని వినికిడి, ఈమూడేళ్ళలోకూడా బాగానే వెనకేసి ఉంటాడు.
  
అప్పుడే విభజన జరిగి ఉంటే ఎందరో యువకుల ప్రాణాలు మిగిలి ఉండేవి, పోలీసుల లాఠీచార్జీల్లో దెబ్బలు తిని కాళ్ళిరగ్గొట్టుకునే బాధ తప్పేది, తెలంగాణ ప్రజలు కూడా మూడేళ్ళ స్వయంపాలన అనుభవించేవారు.

కనుక సీమాంధ్ర ప్రజలారా, మిమ్మల్ని ఇన్నిరోజులూ విభజన జరగనే జరగదు, మేము జరగనివ్వం అని చెప్పి మోసగించిన నేతలకు ఈఆలస్యం కోట్లు తెచ్చిపెడితే సామాన్యులైన మీకు మాత్రం నష్టమే జరిగింది.    సీమాంధ్ర నేతలు తాములేవదీసిన దొంగ ఉద్యమం, రాజీనామా నాటకాలతో సీమాంధ్ర ప్రజల కళ్ళళ్ళనే పొడిచారని ఇకనైనా గ్రహించాలి. 

ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవడం వలన తెలంగాణకు లాభం కూడా జరిగింది. తెలంగాణలో ప్రజలంతా ఒక్క నినాదంతో ఒక్కటయ్యారు. ఉద్యమం అన్ని వర్గాలను దగ్గర చేర్చింది. ప్రజల్లో పోరాట పటిమను నింపింది. రాష్ట్రావశ్యకత చిన్న పిల్లవాడిదగ్గరినుండి ముసలివాళ్ళందరికీ స్పష్టంగా అర్ధం అయింది. ప్రజాఉద్యమాలపట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఈస్పిరిట్ ఇలాగే కొనసాగితే తెలంగాణ ప్రజలు తమ చైతన్యంతో తమ రాష్ట్రాన్ని కుల, మత భేధాలు లేని ఒక చక్కని రాష్ట్రంగా తీర్చి దిద్దుకునే అవకాశం ఉంది. 


తెలంగాణ గెలిచింది, సమైక్యాంధ్ర కోల్పోయింది


తెలంగాణ ప్రజల ఉద్యమం ఫలించింది. తెలంగాణ రాష్ట్రం కళ నిజమయింది. అయితే గత నాలుగేళ్ళలో తెలంగాణ ఉద్యమకారులు సాధించిందేమిటి, సమైక్యాంధ్ర మద్దతుదారులు కోల్పోయింది ఏమిటి అని ఆలోచిస్తే చాలానే అది ఒక్క రాష్ట్రసాధన మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది.

తెలంగాణ ఉద్యమం ప్రజల్లో ఐక్యతను నింపింది. ఉద్యమం బీజేపీ దగరినుండి సీపీఐ, న్యూడెమాక్రసీ వరకూ అందరినీ ఒకేవేదికపై పనిచేసేలా చేసింది. యూనివర్సిటీల్లో కుల మతభేదాలు మరిచి అందరు కలిసికట్టుగా పోరాడారు. బీద, దళిత వర్గాలు ఉద్యమంలో ముందున్నారు.

తెలంగాన ఉద్యమం ప్రజల్లో న్యాయం గెలుస్తుందనే నమ్మకాన్ని మిగిల్చింది. ఉద్యమం మూలంగా ప్రజలు తమ చారిత్రక, సాంస్కృతిక మూలాల్లోకి వెల్లగలిగారు. తెలంగాణ పాట, డప్పు, బతుకమ్మ పునరుజ్జివనం పొందాయి.

తెలంగాణ కళాకారులకు ఆదరణ పెరిగింది, తెలంగాణ పల్లెల్లో చైతన్యం వచ్చింది. తెలంగాణ ఉద్యమం తమనుండి దాచబడిన తురేబాజ్‌ఖాన్, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డిలగురించి ప్రజలకు తెలియజేసింది. ఇప్పుడు ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రజానీకానికి తమకు జరిగిన అన్యాయం లెక్కలతో సహా తెలిసింది. ఇది ఇప్పుడూ రాష్ట్రం ఏర్పడ్డాక తాము సాధించాల్సిన అభివృద్ధిని గుర్తుచేస్తుంది.

తెలంగాణ ఉద్యమం ప్రజలకు మంచి నాయకత్వాన్ని అందించింది. కేవలం రాజకీయపార్టీలు మాత్రమే కాక వివిధ రంగాలనుండి నాయకులు ఏర్పడగలిగారు.

మరి సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఉద్యమకారులకేం ఒరిగింది? ఉద్యమం ప్రజలను కులాలుగా విడదీసింది. దళితులు ఉద్యమానికి దూరంగా ఉన్నారు. అగ్రవర్ణాల్లో ఉద్యమ నాయకత్వంకోసం పోటీ వచ్చింది. ఒక అగ్రవర్ణంపై ప్రజలకు వ్యతిరేకత ఏర్పడింది.

మొదట్నుంచీ సమైక్యాంధ్ర మద్దతుదారులు తెలంగాణ ప్రజలకు తెలంగాణ వస్తుందని చెప్పి నాయకత్వం మోసగిస్తుందని ప్రచారం చేసింది. కానీ చివరికి వారికి తమనాయకులే తాము విభజనను ఆపగలమని చెప్పి మోసగించారని అర్ధమయింది.

ఇప్పుడు కనీసం సీమాంధ్ర ప్రజలు తాము ఏరాజకీయపార్టీని సమర్ధించాలో కూడా తెలియని పరిస్థితి. ఉన్న ప్రతి రాజకీయపార్టీ కూడా విభజన నిర్ణయానికి ముందొకలాగ తరువాత ఇంకోలాగ మాట్లాడి మోసగించినవారే. ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే ముఖ్యమంత్రి పార్టి లక్ష్యం ఏమిటో కూడా తెలియదు.

ఇక సమైక్యాంధ్ర అనే నినాదంలో నిజాయితీ లేదని ఆనినాదాన్ని ఎత్తుకున్నవారందరికీ తెలుసు. ఒక ప్రాంతం వారి భాగస్వామ్యం లేకుండా కేవలం మరో ప్రాంతం కలిసి ఉండాల్సిందేనని బలవంతపెట్టడం, ఉద్యమం అంటే కేవలం అవతలి పక్ష నేతలను తిట్టడం, దిష్టిబొమ్మలు తగలబెట్టడం తప్ప సమైక్యాంధ్ర వలన ఎందుకు లాభమో తెలంగాణ ప్రజలకు చెప్పలేకపోయారు. వారికీ తెలుసు, సమైక్యతవలన తెలంగాణకు నష్టం తప్ప లాభం లేదని.


ఒక అబద్ధపు లక్ష్యాన్ని ఎంచుకుని, తమ హక్కుల సాధనకోసం కాక అవతలివారి హక్కులను ఆపడానికి మాత్రమే ఉద్యమం చేయబోయి చివరికి ఓటమి తరువాత కనీసం పోరాడిన సంతృప్తికూడా లేకుండా చేసుకున్నారు. 
సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలో నాయకత్వలేమిని స్పష్టంగా బయట పెట్టింది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నట్లు చెప్పుకున్న కిరణ్, జగన్, బాబు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని తామే ఛాంపియన్లుగా చెప్పుకోవడానికి ప్రయత్నించారు. లగడపాటి, కావూరు , చిరంజీవి లాంటివారు చివరికి జోకర్లుగా మిగిలిపోయారు. 



Monday 17 February 2014

మేమేం చేస్తే అదే రైటు!!



కొంతమందికి బుద్ధి సరిగా వికసించకపోవడం వలన చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది. అలాంటివారు వాస్తవాలను అంగీకరించక ఎప్పుడూ మేమేం చేస్తే అదే రైటు, ఎదుటివారేం చేసినా అది తప్పే అని వాదిస్తుంటారు. ఆశ్చర్యం ఏమిటంటే అలాంటివారంతా సీమాంధ్రా ఎంపీలుగానూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులుగానూ పదవులు వెలగబెట్టడం. వీరికి దన్నుగా ఉండే వర్గం వారు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తుంటారు.


వీరికి తమ ప్రత్యర్ధి వర్గాన్ని ఒక విషయంపై వెక్కిరించేప్పుడు అరే, తాముకూడా ముందు ఇలాంటి పనే చేశాం అని అస్సలు స్ఫురించదు, ఒకవేళ ఎవరైనా గుర్తు చేసినా పట్టించుకోరు. అలాగే తాము ఏదైనా చర్యను సమర్ధించుకునేప్పుడు ఇంతకంటే చిన్నవిషయంపైనే ఎదుటివారు చేసినపుడు తాము తిట్టిపోసిన విషయాలూ గుర్తుకురావు.


ఉదాహరణకు:


- తాము తమిళులు తమ ఉద్యోగాలూ, నీళ్ళూ దోచుకుంటున్నారని ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాడితే అదో పెద్ద గొప్ప విషయం. సరిగ్గా అదే డిమాండ్లతో తెలంగాణవారు ప్రత్యేక రాష్ట్రం కోరితే అది తప్పు.


- తెలంగాణవారు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటే అదో మహా పాతకం, దేశసమగ్రతకు ముప్పు. తాము కేంద్రాన్ని ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తే అది మాత్రం ఒప్పు.


- రాష్ట్రంలో తెలంగాణబిల్లును తిరస్కరించే తీర్మానాన్ని అజెండాలో లేకుండా, సభ ఆర్డర్లో లేకుండా ఉండగా ముప్పై సెకన్లలో చదివి గెలిపించుకుంటే ఒప్పు. పైగా ఇది "unchallanged vote" అని ముఖ్యమంత్రి సమర్ధించుకోవచ్చు. అదే కేంద్రం  అజెండాలో చేర్చకుండా బిల్లు ప్రవేశపెడితేనే అది పెద్ద తప్పు.


- తెలంగాణవారు తాము ఒక మార్చ్ చేసుకుంటానంటే అనుమతించక నిర్భందాలూ విధిస్తే కడుపుమండి నాలుగు విగ్రహాలు కూలదోస్తే అది మహాపాతకం. అదే తమ ఉద్యమాల్లో జాతీయనేతల విగ్రహాలను తీరుబడిగా కూలదోస్తుంటే ఒప్పు. అంబేద్కర్ విగ్రహాలను పధకం ప్రకారం కూలదోస్తే ఒప్పు.


- తెలంగాణ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే అదో మహానేరం. అదే తమ ఎంపీలు వీధిరౌడీల్లా ప్రవర్తించి తోటి సభ్యులపై పెప్పర్ స్ప్రే చల్లితే అది ఒప్పు. వీడియోల్లో స్పష్టంగా గాలిలోకి విచక్షణారహితంగా స్ప్రే చేస్తున్నట్లూ, స్పీకర్ పై కూడా స్ప్రే చేసినట్లూ తెలుస్తున్నా కేవలం ఆత్మ రక్షణ అని వాదిస్తారు.

ఇంకొన్ని 

* అసెంబ్లీలో మెజారిటి ప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలి, కాని పార్లమెంటులో మెజారిటి ప్రతినిధుల అభిప్రాయం తీసుకోకూడదు. 

* అసెంబ్లీ ఆవరణలో ఒక ఎంఎల్ఏ పై ఒక అనామకుడు చెయ్యి చేసుకుంటే ప్రజాస్వామ్యం ఖుని అవుతుంది, కాని సాక్షాత్తు అసెంబ్లీలోనే ఒక ఎంఎల్ఏ ఇంకో ఎంఎల్ఏపై దాడి చేస్తే ప్రజా స్వామ్యం ఉద్దరించబడుతుంది (http://www.youtube.com/watch?v=TO_QaM7PzRQ)

* తెలంగాణా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెసువారు దేశ ద్రోహులు, కాని తెలంగాణా ఏర్పాటు చేస్తాం అని మాట ఇచ్చి ఆ మాట తప్పిన బాబు, చిరు, జగన్ లాంటి వారు దేశం ముద్దు బిడ్డలు.


- సినీనటి శ్రీయను కొందరు అడ్డుకుని "జైతెలంగాణ" అని అనమని బలవంతపెడితే మొత్తం తెలంగాణవాదులందరూ దానికి భాద్యత వహించాలి. అదే నటి తమన్నాను కొట్టినంతపని చేసి "జైసమైక్యాంధ్ర" అనమని బలవంతపెడితే ఎక్కడి దొంగలు అక్కడ గప్‌చుప్.


-- అదుర్స్ సినిమాను నడపకుండా అడ్డుకుంటామనిచెబితే వారు సంఘవ్యతిరేకులు. అదే రాంచరణ్ సినిమా తూఫాన్, మరో అల్లు అర్జున్ సిన్మా విడుదల కానీయకపోతే అది ఒప్పు.

- తెలంగాణలో సకలజనుల సమ్మె చేస్తే అది విద్యార్థుల చదువులు ఖరాబు చేస్తుంది అని గగ్గోలు ( అందులో సగం దినాలు దసరా సెలవులే అయినా). అదే ఆంధ్రాలో వరసపెట్టి బందులు చేసినా, ప్రభుత్వ పాఠశాలలు నెలలతరబడి నడపక, ప్రైవేటు స్కూళ్ళు మాత్రం నడిపినా అది తప్పుకాదు. 

మీరు సామాన్యులు కాదురాబాబూ. లగడపాటికి తక్కువ, అశొక్‌బాబుకు ఎక్కువ. 

Saturday 15 February 2014

బేషరమ్!

పార్లమెంటుకు కత్తులు, ఏకే- 47 రైఫిళ్లు కూడా తెస్తారా?.. మైకులు విరగ్గొడితే అవార్డులొస్తాయా?..మీలాంటి వాళ్లను పార్లమెంటు నుంచే కాదు, దేశం నుంచి గెంటేయాలి..మీరు చేతులు జోడించి దేశానికి క్షమాపణ చెప్పాలి..’ తెలుగుజాతి నిండు గౌరవమంటూ ఇన్నాళ్లు మైకులు మింగడంలో ఘనతవహించిన పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ని గురువారంనాటి లోక్‌సభ ఘటనలపై జాతీయ మీడియా కడిగిపారేస్తూ అన్న మాటలివి. పెప్పర్ స్ప్రే ఎంపీ తీరుపై జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ఓ పక్క సిగ్గుచేటు అని అభివర్ణిస్తే, జాతీయ ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతంగా చర్చలు నిర్వహించి దుమ్మెత్తిపోసింది. లైవ్ చర్చల్లో లగడపాటి, సీఎం రమేష్‌లను పిలిచి వారి తీరును తూర్పారబట్టింది. 

rajgopal‘చూడండి పార్లమెంటులో కబడ్డీ ఆడతా’ అంటూ మొన్న వెకిలి వ్యాఖ్యలు చేసిన లగడపాటిని జాతీయ మీడియా ఏకంగా ఫుట్‌బాలే ఆడుకుంది. ‘నీ వల్ల ప్రపంచం ముందు మేంతలదించుకున్నాం’ అంటూ ఆయా టీవీల ఎడిటర్లు లగడపాటిపై ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నపుడు తెలంగాణ ఇవ్వాల్సి ఉంటుందని తెలియదా?అని నిలదీశారు. ఆత్మరక్షణ కోసమే పార్లమెంట్‌కు పెప్పర్ స్ప్రే తీసుకెళ్లానన్న సాకుపై ఆయనను జాతీయ మీడియా దుమ్ముదులిపింది. పార్లమెంటరీ, ప్రజాస్వామ్య, రాజకీయ వ్యవస్థలకు మీ తీరు సిగ్గుపడేలా ఉంది అని అత్యంత తీవ్ర పదజాలంతో రాజగోపాల్‌పై మండిపడింది. జాతీయ మీడియా ఒకపక్క ఇంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండగా, రాష్ట్రంలోని సీమాంధ్ర మీడియా మాత్రం షరా మామూలేనన్నట్టు వ్యవహరించింది. దేశం ముందు నేరస్తుడిలా నిలబడ్డ లగడపాటి హీరోయిజం చేసినట్టుగా కథనాలు, వ్యాఖ్యానాలతో తమ నైజాన్ని చాటుకుంది. జాతీయ ప్రధాన చానళ్లలో సీమాంధ్ర ఎంపీల తీరుపై మండిపాటు ఇలా సాగింది.. 

చేతులు జోడించి క్షమాపణ చెప్పు: అర్నాబ్ గోస్వామి 
టైమ్స్‌నౌ నిర్వహించిన చర్చలో ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఎంపీ లగడపాటిని లైవ్‌లో పిలిచి దుమ్ము దులిపారు. పెప్పర్ లగడపాటి అంటూ వ్యంగ్యంగా సంబోధించారు. లోక్‌సభ ఘటన గుర్తుచేస్తూ నీకు సిగ్గుగా లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా పార్లమెంటును నువ్వు నవ్వులపాలు చేశావు’ అంటూ దండయాత్రకు దిగారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమని రాజగోపాల్ అడగ్గా..నీకు మైకు ఇవ్వను ఇది నువ్వు ఇష్టానుసారం మాట్లాడటానికి పార్లమెంట్ కాదు..పార్లమెంట్ మాది అన్నారు. ‘ముందు నువ్వు దేశానికి క్షమాపణలు చెప్పు. రౌడీలా ప్రవర్తించావు. నిన్ను అసలు పార్లమెంట్‌లోపలికి అనుమతించొద్దు. నీ ప్రవర్తనను గుర్తు తెచ్చుకుని సిగ్గుపడు.’ అని మండిపడ్డారు. దీనికి లగడపాటి స్పందిస్తూ పార్లమెంట్‌లో జరిగిన ఘటనపై తనకు బాధగానే ఉందని అన్నారే తప్ప క్షమాపణలపై నోరు మెదపలేదు.

దీనిపై ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. దిస్ ఈస్‌ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ మై పార్లమెంట్. పార్లమెంట్‌లో కబడ్డి ఆడుతావా? అసలేం అనుకుంటున్నావు. ఇలాంటి వాళ్లను సభ్యత్వం నుంచి తొలగించాలి’ అంటూ అరుణబ్ ఊగిపోయారు. ‘లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేతో ఫేమస్ అయ్యావు. నువ్వింకా ఏం చేద్దామనుకుంటున్నావ్. నీ తీరును చూసి సిగ్గుపడుతోంది దేశం. నిన్ను అటాక్ చేస్తేనే పెప్పర్ స్ప్రే చేశానంటువు కదా...? ఎవరు నీపై అటాక్ చేశారో చెప్పగలవా?’ అని నిలదీశారు. దీనికి లగడపాటి రాజగోపాల్ వంద మంది తనపై దాడి చేశారని వారెవరో మాత్రం తనకు తెలియదని తప్పించుకున్నారు. ‘ఏం మాట్లాడుతున్నావ్ రాజగోపాల్ వెల్‌లో వందమంది ఉన్నారా? పార్లమెంటులో ఒక నేరస్తుడిలా ప్రవర్తించావు. క్రిమినల్‌గా బిహేవ్ చేశావు. భారతదేశ రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తివి నువ్వు. ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకుని హీరో కావాలనుకుంటున్నావా? పార్లమెంట్‌లో నువ్వు చేసింది ఉగ్రవాద దాడి. నువ్వు ఈ దేశంలోని పిల్లలకు, యువతకు ఏం సందేశం ఇచ్చావో తెలుసా? నీలాంటివారు రాజకీయ, పార్లమెంటరీ, ప్రజాస్వామ్యంలో ఉండటానికి సిగ్గుపడాలి.’ అని అన్నారు. 

ఉగ్రవాదికి ఓ సిద్ధాంతం ఉంటుంది. నీకేం ఉంది అని ప్రశ్నించారు. దీనికి లగడపాటి తాను చేసింది చాలా గొప్పపనేనని, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తానీపనిచేశానని సమర్థించుకున్నారు. ‘నీకోసం నేను సమయం వృథా చేయను. నువ్వు చెప్పేది నేను వినదలుచుకోలేదు. ఆ ఆసక్తి కూడా నాకు లేదు. నువ్వు ఈ దేశం పెట్టుకున్న హద్దులు దాటి ప్రవర్తించావు. వెంటనే రెండు చేతులు ఎత్తి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పు. పార్లమెంట్ అంటే సర్కస్ కాదు. ఇలాగే చేస్తానంటే ముందు రాజీనామా చేసి బయటకు వచ్చి ఆటలాడుకో.’ అని అర్నాబ్ అన్నారు. దీనికి లగడపాటి స్పందిస్తూ నేనెప్పుడో రాజీనామా చేశానని, స్పీకర్ ఆమోదించలేదని తెలిపారు. ‘న్యారో, సెల్ఫ్ పొలిటికల్ ఇంట్రెస్టులతో(సంకుచిత,స్వార్థ, రాజకీయ ప్రయోజనాలతో) లగడపాటి మాట్లాడుతున్నారు. వారి తీరు ఈ దేశానికి సిగ్గుచేటు’ అని ఈసడించారు.తర్వాత అరుణబ్ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై మండిపడ్డారు. 

ఆడోళ్ల పెప్పర్ స్ప్రేతో నీకేం పని : ఎన్‌డీటీవీ బర్కాదత్ 
పార్లమెంటు ఘటనలపై చర్చా కార్యక్రమం నిర్వహించిన ఎన్‌డీటీవీ ఎడిటర్ బర్కాదత్ లైవ్ చర్చలో రాజగోపాల్ వైఖరిపై విరుచుకుపడ్డారు. ‘మిస్టర్ రాజగోపాల్. అసలు పెప్పర్ స్ప్రే ఎందుకు తీసుకెళ్లావు? నిబంధనలను ఉల్లంఘించావు. పెప్పర్ స్ప్రేను ఆడవాళ్లు ఆత్మరక్షణ కోసం ఉపయోగిస్తారు. అలాంటి స్ప్రే నీకు ఎందుకు? ’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడదాన్ని నేనే దాన్ని వాడను, మగాడివి నీకెందుకు అని నిలదీశారు. నువ్వేమన్నా వీధిలో వెళుతున్నావా? పార్లమెంటులోనే కదా ఉన్నది. అక్కడున్నది నీ సహచరులే కదా? మరి పెప్పర్ స్ప్రే ఎందుకు అని ప్రశ్నించారు.

‘కనీసం క్షమాపణలు చెప్పాలనే ఆలోచన కూడా నీలో ఉన్నట్లు నాకు అనిపించడం లేదు, దేశం పరువును తీశానే అనే బాధ ఏమాత్రం లేదా?’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి లగడపాటి రాజగోపాల్ ‘నేను గొప్ప పనే చేశాను. సిగ్గుపడటం లేదు. అయితే సభలో జరిగిన సంఘటనకు బాధ కలుగుతోంది’ అంటూ వాదించే ప్రయత్నం చేశారు. పార్లమెంట్‌లో వీడియో ఫుటేజ్‌ను చూపించాలని అన్నారు. అనంతరం బర్కాదత్ మాట్లాడుతూ ‘మీరు పార్లమెంట్‌లో చేసింది చాలా దుర్మార్గమైన పని. చండాలమైనది. నీకు ఏమన్న బాధ అనిపిస్తోందా? ప్రధాని మొన్ననే ఎంపీల తీరును చూసి నా గుండె రక్తమోడుతోంది అన్నారు. ఇవాళే మీరు ఇలా చేశారు. దీన్ని ఎలా సమర్థించుకుంటారు. సమాధానం చెప్పు రాజగోపాల్.’ అని ప్రశ్నించారు. 

ఇంకా నయం, ఎకే 47 తేలేదు : సీఎన్‌ఎన్-ఐబీఎన్ రాజ్‌దీప్ సర్దేశాయ్ 
ఐబీఎన్ 18లో జరిగిన చర్చలో ఎడిటర్ ఇన్ చీఫ్ రాజ్‌దీప్ సర్దేశాయ్ రాజగోపాల్‌కు పార్లమెంట్‌లో దాడిచేసే ఉద్దేశం లేకుంటే పెప్పర్ స్ప్రేను ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ‘చాలా బాధ కలుగుతోంది. 20 ఏళ్లుగా పార్లమెంట్ కార్యకలాపాలను చూస్తున్నాను. ఇలాంటి సంఘటన ఒక్కటి కూడా జరగలేదు. మైకులు విరగ్గొట్టారు. హత్యాయత్నాలు చేశారు. ఇది ఏమాత్రం భారతదేశ ప్రజాస్వామ్యానికి ఆమోదయోగ్యం కాదు’ అన్నారు. ఆంధ్రవారి తరపున చేస్తున్నందుకు లగడపాటి రాజగోపాల్ గొప్పవాడిగా అనిపించొచ్చు. 

ఏ అంశంపై అయినా అభిప్రాయాలుంటే పార్లమెంట్ చర్చల్లో పాల్గొని వినిపించాలిగానీ ఇదేమిటి? అని విస్మయం వ్యక్తం చేశారు. బీజేపీ కూడా డబుల్ గేమ్ ఆడుతోంది. కాంగ్రెస్ తేల్చాలనుకున్నప్పుడు రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టాలి. తెలంగాణ విషయంలో అన్ని వర్గాలు విఫలం అయ్యాయి. సర్వత్రా అవకాశవాద ధోరణి కనిపిస్తున్నది అని అభిప్రాయపడ్డారు. ‘ఇంకా నయం పెప్పర్‌నే స్ప్రే చేశారు. కత్తులు, ఎకే 47లు తెచ్చి వాడలేదు. అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి’ అన్నారు. సీమాంధ్ర ఎంపీల తీరు పార్లమెంటరీ వ్యవహారాలకు అనుగుణంగా ఏమాత్రం లేదని అన్నారు. లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్‌లో ఉన్న అత్యంత ధనిక ఎంపీల్లో ఒకరు... కానీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశాడు అని రాజ్‌దీప్ వ్యాఖ్యానించారు.

Thursday 13 February 2014

ఆత్మవంచనకు పరాకాష్ఠ



లగడపాటి రాజగోపాల్ ఈరోజు పార్లమెంటులో రెచ్చిపోయాడు. తెలంగాణ నిజమవడానికి రోజులు దగరవుతున్నకొద్దీ ఫ్రస్ట్రేషన్‌తో పిచ్చిపడుతున్న లగడపాటి సైకోలో మారి ఈరోజు పార్లమెంటులో తోటి ఎంపీలపై పెప్పర్‌స్ప్రే చల్లాడు, స్పీకర్ పోడియం అద్దాలు పగలగొట్టాడు, మైకులు విరగ్గొట్టాడు. మరో తెదెపా ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పార్లమెంటులోకి కత్తి తెచ్చాడని సమాచారం. వీరి చర్యలు నిజంగా ఈరోజు పార్లమెంటు పవిత్రతకు కళంకం కలిగించేవి. వీరి చర్యలు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు.

అయితే నాకు వీరిపై కోపం రావడంలేదు, కేవలం వీరి ఉన్మాద స్థితిపై జాళి వేస్తోంది. పాపం, ఎక్కడ తాము అక్రమంగా కూడగట్టుకున్న కోట్లు కరిగిపోతాయో, తమ అక్రమాలు బయటికి వస్తాయో, కబ్జాలు వెలుగులోకి వస్తాయో అనే భయంలో వచ్చిన ఉన్మాదంలో వారు ఈచర్యకు తెగబడ్డారు. 

అయితే ఈపిచ్చి పనులనూ, కుప్పిగంతులనూ కూడా కొందరు సమర్ధిస్తున్నారంటే ఇది ఆత్మవంచనకు పరాకాష్ఠ తప్ప మరోటి కాదు. జేపీమీద ఒక తెలంగాణవాది చెయ్యి చేసుకున్నప్పుడో, ఏపీ అసెంబ్లీలో గవర్నర్ దగ్గరనుండి బడ్జేత్ పేపర్లు లాక్కున్నప్పుడో తాటికాయలంత అక్షరాలతో ఉద్యమాన్ని బూతులు తిట్టిన కొందరికి మాత్రం ఈరోజు ఘటన తప్పుగా అంపించట్లేదట. పైగా పెప్పర్ స్ప్రే మారణాయుధం కాదు కాబట్టి తప్పులేదంట. ఇంతకన్నా ఆత్మవంచన మరోటి ఉంటుందా?  



Tuesday 11 February 2014

సమాఖ్య స్ఫూర్తి!?


సుబ్బారావును కలిసి చాన్నాళ్ళయ్యింది, ఎలా ఉండోచూద్దామని సుబ్బారావు ఆఫీసుకు వెళ్ళి చూద్దును కదా, సుబ్బారావు కళ్ళు చింతనిప్పుల్లా మండిపోతున్నాయి. 

ఏమయింది సుబ్బారావ్? ఎందుకంత కోపంగా ఉన్నావ్?

కేంద్రం రాష్ట్రవిభజన వ్యవహారం అస్సలు సరిగా చేయడం లేదు.బొత్తిగా సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించడం లేదు తెలుసా?

హమ్మయ్య! అయితే నీకోపం నాపైన కాదు కేంద్రం మీదన్నమాట. ఇంతకూ ఇలాగని ఎవరన్నారు?

ఇంకెవరంటారు? మన చంద్రబాబు, జగన్ బాబు, కిరణ్‌బాబూ రోజూ టీవీల్లో చెబుతున్నారు.

వాళ్ళకీవిషయం ఎలా తెలిసిందబ్బా? వాళ్ళకంత బుర్ర ఉన్నట్టు లేదే?

మన జయప్రకాశ్ నారాయణ వాళ్ళకు చెప్పాడంట.  

ఓహో! అయితే ఇది ఆయన తెలివితేటలన్నమాట. అనుకున్నా. అవును సుబ్బారావ్, ఇంతకూ మన దేశం ఒక సమాఖ్య వ్యవస్థేనంటావా?

నీతెలివితేటలు ఏడ్చినట్టే ఉన్నాయి. కాదు గాబట్టే గదా సమాఖ్య స్ఫూర్తి అంటూ ఏడిచేది? లేకపోతే సమాఖ్యవ్యవస్థకు వ్యతిరేకమని కోర్టుకు వెళ్ళేవాళ్ళు గదా.

అదన్నమాట అసలు సంగతి. కేంద్రం చేయడం చట్టబద్దమే కానీ స్ఫూర్తిని చూపించి రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవించాలా? అంటే అప్పుడప్పుడూ మన క్రికెటర్లు అంపైర్ ఔటివ్వకపోయినా క్రీజు వదిలి వెలుతుంటారు, అలాగే కేంద్రం చేయాలంటావా?

కరెక్ట్. ఇప్పుడూ నీకు విషయం సరిగ్గా అర్ధమయింది. ఒకప్పుడు కోర్ట్నీ వాల్ష్ ఇలాగే క్రీడా స్ఫూర్తిని చూపించి ప్రపంచ కప్ క్రికెట్ సెమి ఫైనల్లో ఆఖరు వికెట్ అని తెలిసి కూడా క్రీజుకు ఆమడ దూరంలో ఉన్న సలీం జాఫర్‌ను రన్అవుట్ చేయలేదు తెలుసా? అదీ స్ఫూర్తి అంటే. కేంద్రం దగ్గర ఏమాత్రం స్ఫూర్తిలేదు. ఉంటే అస్సలు ఇలా చేయలేదు.

బాగుంది. మనం మాత్రం పాకిస్తాన్లా  తొండాట ఆడతాం, కేంద్రం మాత్రం కోర్ట్నీవాల్ష్‌లా  స్ఫూర్తిని ప్రదర్శించాలనుకోవడం అత్యాశ కదా సుబ్బారావ్? మన కిరణ్ బాబు ముప్పై సెకన్లలో రాష్ట్ర అసెంబ్లిలో విభజనకు వ్యతిరేకంగా ఒక బిల్లును ప్రవేశపెట్టి స్పీకర్ ఏం చెబుతున్నాడో ఎవరికి అర్ధం కాకముందే గెలిపించుకున్నాడు. మన చంద్రబాబు విభజన జరిగిపోయే దశకు వచ్చినా తన వైఖరి ఏంటో చెప్పక కొబ్బరికాయలు, రెండు కళ్ళు, ఎంతమంది పిల్లలు అంటూ అందరినీ భయపెడుతాడు. మన జగన్‌బాబేమో అసలు అందరికంటే ముందే నిర్ణయం తీసుకోవాల్సింది ఆర్టికల్ మూడు ప్రకారం కేంద్రమే అని తేల్చి ఇప్పుడు ఎవర్నడిగి నిర్ణయం తీసుకున్నారంటున్నాడు. ఇదంతా తొండి కాదా సుబ్బారావ్? 

అంతేనంటావా?

ఖచ్చితంగా అంతే . అసలు కేంద్రం స్ఫూర్తిని ప్రదర్శించాలని అడగడానికి వీళ్ళెవరికైనా అర్హత ఉందంటావా? పైగా ఇన్నాళ్ళూ తెలంగాణవారు విభజనకోసం కొట్లాడుతుంటే ఏనాడైనా వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం కోసమైనా ప్రయత్నం చేశారా చెప్పు? ఒక్కనాడైనా ఈవిషయంపై అసెంబ్లీలో చర్చ పెట్టారా పోనీ? ఇప్పుడు ఏమొహం పెట్టుకుని సమాఖ్యస్ఫూర్తి అంటూ గోలపెడుతారు? అందుకే మనవాళ్ళ వాదనకు దేశంలో ఏఒక్క పార్టీకూడా మద్దతియ్యట్లేదు. నువ్వూరికే ఆవేశపడిపోయి బీపీ తెచ్చుకోక ఇంటికెళ్ళి మీఅబ్బాయితో తొక్కుడుబిల్లాడుకుని అక్కడ నీక్రీడాస్ఫూర్తిని ప్రదర్శించు. 

సుబ్బారావుకి నేను చెప్పింది తలకెక్కిందో లేదోగానీ ఆరోజు సాయంత్రమే పార్కులో వాళ్ళబ్బాయితో తొక్కుడూబిల్లాడుతూ నాక్కనిపించాడు. 

Sunday 9 February 2014

కొందరికి పోలవరం, ఎందరికో శాపం




పోలవరం అనే ప్రాజెక్టు గోదావరి నదిపై ధవళేస్వరం నకు కొంచెం ఎగువన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బహుళార్ధక సాధక ప్రాజెక్టు. ఈప్రాజెక్టుపై ఎన్నో కాంట్రావర్సీలు ఉన్నప్పటికీ రాజకీయనాయకుల వత్తిడితో త్వరలో దాదాపు జాతీయహోదా కూడా రాబోతున్నట్టు సమాచారం. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తికాకుండానే, ఆతరువాత ఒక్కప్రాజెక్టు కూడా చేపట్టకుండానే ఇప్పటికే ప్రాజెక్టు ఉన్నప్రాంతానికి మరో ప్రాజెక్టు అవసరమా లాంటి విషయాలు వదిలేసి అసలు ఈప్రాజెక్టు ఎంతవరకు సమర్ధనీయం అనే విషయం చర్చిద్దాం. 

పోలవరం వలన ఏర్పడే ఆయకట్టు 3 లక్షల హెక్టేర్లు ( సుమారు ఏడు లక్షల ఎకరాలు). అయితే ప్రభుత్వం చూపిస్తున్న ఆయకట్టులో 2.5 లక్షల ఎకరాలు ఇప్పటికే ప్రకాశం బారేజీకింద ఉన్న ఆయకట్టు. అంటే కొత్తగా వచ్చే ఆయకట్టు 4 లక్షల ఎకరాలు. ఈప్రాజెక్టు వలన ముంపుకు గురీయే ప్రాంతం అక్షరాలా 1.2 లక్ష ఎకరాలు అంటే 47 వేల హెక్టేర్లు. అందులో 11,782 హెక్టేర్ల మాగాణీ, 32,667 హెక్టేర్ల మెట్ట, 2,481 హెక్టేర్ల ఆటవీ ప్రాంతం. మొత్తం నిర్వాసితులు 276 గ్రామాలలోని 1,17,034 మనుషులు (2001 జనాభా లెక్కల ప్రకారం).అంటే ప్రతి 4 ఎకరాల ఆయకట్టుకోసం ఒక ఎకరం భూమి మునిగిపోతుంది, ఒక మనిషి నివాసం కోల్పోవలిసి వస్తుంది.

ఇంతే అనుకుంటే బాగుండేది కానీ, ఈముంపుకు ఇంకా కథ ఉంది. ఇక్కడ విలువయిన గ్రాఫైట్ గనులు కూడా మునిగిపోతున్నాయి. గ్రాఫైట్ మునిగిపోవడం వలన జరిగే నష్టం ఒక ఎత్తు కాగా ఆగ్రాఫైట్ నీటిలో కలిసి నీటిని కాలుష్యం చెయ్యడం మరో ఎత్తు.

ఇంకా ముంపులో ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ కూడా మునిగిపోతుంది. నిర్వాసితులలో ఎక్కువభాగం ట్రైబల్స్. ట్రైబల్స్‌ను మరో చోటికి తరలించడం ద్వారా వారి జీవనవిధానానికి లోటు. ఇక ట్రైబల్స్‌కు అడవిపై ఉండే హక్కులకు సంబంధించిన కేసు విచారణలో ఉంది. ఆకేసు వ్యవహారం తేలేంతవరకూ ట్రైబల్స్‌ను తరలించే హక్కు ప్రభుత్వానికి లేదు.

గోదావరి నీటిలో సెడిమెంటేషన్, స్లిట్ ఫామేషన్ ఎక్కువ. దానివలన డాంకు ప్రమాదం ఏర్పడొచ్చు.

ప్రస్తుత ప్రాజెక్టు డిజైన్ 2003లో ఏర్పరిచారు, కాబట్టి అప్పటి వరదల డాటా ప్రకారం ఏర్పడింది. కానీ 2008లో గడచిన వందేల్లళో రానంత వరదలు వచ్చాయి. ఇలా వస్తే ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు రాజమండ్రి పట్టణం మొత్తం కొట్టుకుపోతుంది.




పోలవరం ఎవరికోసం?

పోలవరం కుడి కాలువ ద్వారా 1,29,00 హెక్టేర్ల ఆయకట్టు లభిస్తే ఎడమ కాలువ ద్వారా 1,62,000 హెక్టేర్ల ఆయకట్టు లభిస్తుంది. అయితే ఎడమకాలువ వెల్లే ప్రాంతంలోనే ఇటేవలే తాడిపూడి, పుష్కరం అనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తిచేశారు. ఇదివరకే ఇదే ప్రాంతంలో చంగల్‌నాడు, తొర్రిగెడ్డ, ఏలేరు లిఫ్ట్ ఇరిగేష్న్లు వాడకంలో ఉన్నాయి. వీటి ద్వారా ఎడమకాలువల ఆయకట్టులో 95% ఇప్పటికే ఉన్న ఆయకట్టు. మిగతా ఐదు శాతం అసలు సాగుభూమి కాదు. ఎడమ కాలువ వెల్లే ప్రాంతంలో కూడా మెజారిటీ ప్రాంతం బావులద్వారా, గొట్టపు బావులద్వారా సాగులో ఉంది. ఇక్కడ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోలా భూగర్భ జలాలు అడుగంటలేదు కాబట్టి బావులద్వారా వ్యవసాయం బాగానే సాగుతుంది. కుడి, ఎడమ కాలువలు కలిపి 75% ఆయకట్టు ఇప్పటికే ఏదో ఒక రీతిలో ఉన్నదే.

మరి ఇప్పటికే ఆయకట్టు ఉన్న ప్రాంతంలో ఇంతమందిని నిరాశ్రయులను చేస్తూ, రాజమండ్రి నగరాన్ని రిస్కు చేస్తూ ఈప్రాజెక్టు ఎవరికోసం అంటే విశాఖ, కాకినాడలో కొత్తగా రాబోయే పరిశ్రమలకోసం. ఇక్కడ జిండాల్ అల్యూమినియం ప్లాంటుతో పాటు అనేక కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి, వీటికి పెద్దేత్తులో నీరు అవసరం. అంటే పోలవరం అందరూ అనుకునేట్టుగా డెల్తా రైతులకోసం కాదు, విశాఖ, కాకినాడలో పరిశ్రమలకోసం.

ముంపు, నిర్వాసితులు:

పోలవరం ద్వారా 270 గ్రామాల్లో లక్షా ఇరవై వేలమంది నిర్వాసితులవుతారనేవి 2001 జనాభాలెక్కల ఆధారంగా ప్రభుత్వ లెక్కలు. అయితే వాస్తవానికి ఇంకా ఎక్కువ గ్రామాలు మునిగిపోతాయి, అక్కడ గతపదేల్లలో ఇంకా ఎక్కువ జనాభా పెరిగింది అని ఎంజీవోలు చెబుతున్నాయి. వీరి అంచనా ప్రకారం కాలువల తవ్వకం వలన నిర్వాసితులయ్యేవారిని కలుపుకుంటే  మొత్తం నిర్వాసితులు నాలుగు లక్షల మంది వరకూ ఉంటారు. అందులో మెజారిటీ దళితులు, ఆదివాసీలు. లక్ష ఎకరాలు కూడా కొత్తగా ఆయకట్టు తీసుకురాని ఒక ప్రాజెక్టుకోసం నాలుగులక్షలమంది ప్రజలు తమ ఇల్లు, పొలాలు వదులుకుని మరోచోటికి వెల్లాలి.

ఇందులో పావువంతుదాకా ఆయకట్టుకింద వ్యవసాయం చేసుకుంటున్నవారు. అంటే లక్ష ఎకరాల కొత్త ఆయ్కట్టుకోసం 25వేల ఎకరాల ఆయకట్టు భూమిని వదులుకోవాలి. వీరికి పునరావాసంలో మల్లీ ఆయకట్టుకింద భూములు దొరకడం కల్ల. ఆదివాసీలు అడవిపైనే ఆధారపడతారు, వారిని తరలించడమంటే వారి పొట్ట కొట్టడమే.

ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు:

ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో కొంత ఒరిస్సా, చత్తీస్‌ఘర్ లలో కూడా ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాలలో ముంపును తప్పించడానికి మన ప్రభుత్వం చూపించిన పరిష్కారం అక్కడ ఎత్తయిన అడ్డుకట్ట కట్టడం. ఈ అడ్డుగోదల ఖర్చు ప్రాజెక్టు ఖర్చుకు అదనం. అయితే దీనిపై ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం జరగలేదు, వరదలను దృష్టిలో పెట్టుకుంటే ఎంత అడ్డుకట్ట కట్టాలనే దానిలో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదు.

ఈ ప్రాజెక్టును ఎలాగయినా అడ్డుకోవాలనే సంకల్పంతో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పావులు కదుపుతూ సుప్రీం కోర్టుకు వెల్లాడు. సుప్రీం కోర్టులో కేసు వోడిపోయే అవకాశాలే మనరాష్ట్రానికి ఎక్కువ. అంటే కేసు వోడిపోతే మనం పెట్టే ఖర్చంతా శుద్ద వేష్టు. అంటే ఇప్పుడేదో ఈప్రాజెక్టువల్ల ఉపయోగం ఉందని కాదు గానీ అప్పుడు పూర్తిగా ఆపేయాల్సి వస్తుంది.

ఇన్ని సమస్యలు ఉన్నా ఈప్రాజెక్టు కావాలని అన్ని రాజకీయ పార్టీలూ రోజూ ఉద్యమాలు చేస్తున్నది ఎవరికోసం అంటే కొందరు పారిశ్రామిక వేత్తలు, మరియు ప్రాజెక్టు వస్తే తాము మూడో పంటకూడా వేసుకోవచ్చునేమో నని ఆశపడే కొందరు ధనికులు.

Thursday 30 January 2014

మోసగాన్ని నమ్మితే



మోసగాన్ని నమ్మితే ఏమవుతుంది? ఒక చెడ్డవాన్ని నమ్మి మరో చెడ్డవాడు దుర్మార్గపు పనికి పూనుకుంటే ఏమవుతుంది? దొంగల మధ్య ఒప్పందాలు చివరికి ఏమవుతాయి?  ఇటీవలి రెండు ఉదాహరణలు చూస్తే ఈప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.

మొదటిది ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి తనకు అనుకూలంగా పనిచేయించుకోవడం కోసం అర్హత లేకున్నా దినేష్‌రెడ్డికి డీజీపీ స్థానంలో కూర్చోబెట్టాఆడు. అందుకు ప్రతిగా పదవిలో ఉన్నన్నాల్లూ దినేష్‌రెడ్డి ముఖ్యమంత్రికి, ఆయన కొమ్ముగాసే సమైక్యవాదానికి అనుకూలంగా వ్యవహరించి తెలంగాణ ఉద్యమంపై కర్కశంగా వ్యవహరించాడు, సీమాంధ్ర సభలకు మాత్రం రాచమర్యాదలు చేశాడు. అయితే చివరికి మరో రెండేళ్ళు తనపదవిని కొనసాగించకపోతే అదే సీఎంపై దుమ్మెత్తిపోశాడు.

ఇప్పుడు తాజాగా మొత్కుపల్లి వ్యవహారం రక్తికట్టించింది. గొర్రె కసాయివాన్ని నమ్మినట్టు మొత్కుపల్లి చంద్రబాబును నమ్మి చంద్రబాబు చెప్పినట్లు కేసీఆర్ను అడ్డమైన బూతులూ తిట్టాడు, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేశాడు. ఇదంతా ఎందుకు చేశాడంటే ఎలాగూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలిచే అవకాశంలేదు కాబట్టి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తే రాజ్యసభకైనా వెల్లొచ్చని. అయితే చివరికి చంద్రబాబు మొత్కుపల్లికి మొండిచెయ్యి చూపించి రాజ్యసభకు రెండు సీట్లకూ సీమాంధ్ర నేతలకే టికెట్లిచ్చాడు.

బాబు మోసంతో దిమ్మతిరిగిన మొత్కుపల్లి పాపం అసెంబ్లీలో కన్నీళ్ళు కూడా కార్చాడంట. గత రెండేళ్ళుగా చంద్రబాబును నమ్మి మాట్లాడిన మాటలకు మొత్కుపల్లికి నియోజకవర్గానికి వెళ్ళే దమ్ముకూడా లేదు. వేరే పార్టీకి వెళ్ళే అవకాశాలు పెద్దగాలేవు. ఒకటీ అరా పార్టీలు అవకాశమిచ్చినా వాతికి గెలిచేంత సీనులేదు.

ఇప్పుడు తాజాగా చంద్రబాబు మొత్కుపల్లిని గవర్నర్ను చేస్తానని బుజ్జగిస్తున్నాడట. నమ్మేవాడుంటే గవరరేం ఖర్మ రాష్ట్రపతిని చేస్తానని కూడా అనొచ్చు. 

Thursday 23 January 2014

గ్రామ సింహాలు



గ్రామ సింహాలు మొన్నటిదాకా ఘర్జించాయి "ఈరాష్ట్రాన్ని ఎలా విభజిస్తారో చూస్తాం" అటూ. మా అధిష్టానానికి బుద్ధి చెబుతాం అని ఒకడు, ఢిల్లీలో మాప్రభుత్వాన్నే కూల్చి పడేస్తామని ఒకడు, అసెంబ్లీలో తొడగొడతామని ఒకడు, ఇది రాజ్యాంగవ్యతిరేకం కనుక అసలు సాధ్యమే కాదని మరొకడు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ఓడించి విభజనను ఆపుతామని ఒకడు, బిల్లుపై చర్చను సాగదీసి, గడువు పొడిగించి ఎలక్షన్లలోపు విభజన సాధ్యంకాకుండా చేస్తామని ఇంకొకడు.

పాపం ఒక్కొక్కటిగా తమ ప్రగల్భాలన్నీ తేలిపోయాక సీమాంధ్ర నేతలనబడే గ్రామసింహాలు ఇప్పుడు మియ్యావ్ మియ్యావ్ అంటున్నాయి. అసెంబ్లీలో తొడగొడతామన్నవారు తొడగొట్టలేదు కదా తడబడి మాటలు రాక తెల్లబోయారు. అసలు ఏం మాట్లాడాలో తెలియక ఎందుకు తాము విభజన వద్దంటున్నామో చెప్పలేక అసలు విభజన ఎందుకో ఒక్క కారణం కూడా వివరించలేక ఒక్కొక్కరూ మొహాన నెత్తురుచుక్కలేకుండా మిగిలిపోయారు.

ఒక్కొక్క సీమాంధ్ర నాయకుడూ గంటల తరబడి మాట్లాడుతాడు..కానీ అందులో ఒక్క పాయింటు కూడా ఉండదు. తెలంగాణ నేతలు తమకు దొరికిన కొద్ది సమయంలో సూటిగా స్పష్టంగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను, సీమాంధ్ర నేతల మోసాలను, మాట తప్పి మడమ తిప్పిన విషయాలనూ వివరిస్తుంటే సీమాంధ్రనేతలవద్ద సమాధానమే లేదు. మాట్లాడ్డం చేతకాక ప్రసంగంలో పసలేక పాపం ఇబ్బందిపడ్డారు, జనాలను బోరు కొట్టించారు.

చర్చలో పాల్గొంటే ఎక్కడ తమ మోసం బయట పడుతుందోనని చర్చే వద్దని ఒకపార్టీ పది రోజులు చర్చకు అడ్డుపడింది. ఎలాగూ మందబలం ఉంది కనుక ఓటింగు పెడితే చాలు చర్చ జరిగితే తమ మోసం బయటపడుతుందని కపటోపాయాలు. ఇంకో పార్టీ ఇంకా తమ రెండు కళ్ళ విధానాన్ని వీడదు.

మొత్తానికి ఈఅసెంబ్లీ చర్చ ద్వారా ప్రపంచానికి తెలిసిందేమంటే  సీమాంధ్రనేతలు గ్రామ సింహాలు.. తమ మెజారిటీ ఉన్నంతకాలం తొడలు కొడుతూనే ఉంటారు కానీ ఎవరికీ మాట్లాడే చేవ లేదు. విభజనను మేము ఆపుతామని ప్రగల్భాలు పలుకుతూనే ఉంటారు కానీ వారికంత సీను లేదని. విభజనకు ఇంకా అడ్డుపడుతూ, చర్చలో మాత్రం తెల్లమొహాలు వేస్తూ ఇన్నాళ్ళూ తెలంగాణను దోచుకున్నది నిజమేనని దేశం మొత్తానికి తెలిసేలా చేస్తున్నారు.

ఒక గ్రామసింహం ఒకవైపు విభజన ప్రక్రియ జరిగిపోతుంటే ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ముప్పై సీట్లు గెలుచుకుందాం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ఢిల్లిలో గద్దెనెక్కిద్దం అని చెబుతుంది. ఎన్నికల లోపే విభజన జరిగిపోతుంటే ముప్పైసీట్లు గెలుచుకుని ఏం చేస్తాడట, మరో లక్షకోట్లు దండుకోవడం తప్ప. ఇంకో గ్రామ సింహం ఇప్పుడు కొత్తగా సమైక్యాంధ్ర పార్టీ పెడ్తుందట. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు విభజన జరిగినంక సమైక్యాంధ్ర పార్టీ ఎందుకు? సీమాంధ్ర పార్టి అని పెట్టుకోవచ్చుగద?   

Sunday 5 January 2014

చేనులో గొడ్డు


(కథ - నమస్తే తెలంగాణ నుండి)
‘చేనులో గొడ్డు పడితే చేను ఆసామి లబోదిబోమనాలా?... గొడ్డు ఆసామా?.... గొడ్డు ఆసామే’ అంటాడు గంగయ్య మేస్త్రి. మేస్త్రి అంటే తాపీ మేస్త్రి కాదని, ముఠామేస్త్రి అవునని గమనించాలి.
ముఠామేస్త్రి గంగయ్య వాదన ఏమిటంటే ‘గొడ్డు పడింది అంటే దెబ్బ తగిలి ఉండాలి. అందువల్ల గొడ్డు ఆసామి లబోదిబోమనడం సబబు. అదే రైటు డబుల్ రైటు’ అంటాడు.
గంగయ్య మేస్త్రి వాదన విని... చేనులో గొడ్డు పడిన వార్తను బొడ్రాయి దగ్గరికి మోసుకొచ్చిన చెంద్రయ్య చేష్టలుడిగిన వాడై చూస్తుండిపోయాడు.
బొడ్రాయి దగ్గరున్న నలుగురు గంగయ్య మేస్త్రి వాదన విని ముక్కున వేలేసుకున్నారు. ఒకాయన ముక్కుతో పాటు నోటిమీద కూడా వేలేసుకున్నాడు.
తమ అపర చాణక్య రాజకీయ నాయకుడిని చూసి గంగయ్య ముఠామేస్త్రి శాల్తీలన్నీ పరమానందభరితమై ఉబ్బి తబ్బిబ్బయి పోతుండగా...
‘‘కాదు...’’ అని బిగ్గరగా అరుపు వినిపించింది. బొడ్రాయి దగ్గరి తలలన్నీ అటువైపు చూశాయి. అట్లా ధైర్యంగా అరిచింది, గర్జించింది రంగయ్య మేస్త్రి. ఇతను కూడా పైన చెప్పిన విధంగా ఒక ముఠామేస్త్రి అని గమనించాలి.
chenulo
‘రంగయ్య మేస్త్రి ముక్కుసూటి మనిషి’ అని పేరు తెచ్చుకొని చాలా కాలమయింది. తెచ్చుకున్నాడు, కొనుక్కోలేదు.
‘‘చేనులో గొడ్డు పడింది అంటే... ఆ గొడ్డు కింద పడింది అని అర్థం కాదు. చేనులో చొరబడింది... ఆవురావురుమని చేను మేస్తున్నదని అర్థం...’’
రంగయ్య మేస్త్రి మాటలు బొడ్రాయి దగ్గరి గంగయ్య మేస్త్రి ముఠాకు ఆగ్రహం తెప్పించడంలో ఆశ్చర్యం లేదు. వాళ్లకు వేదాలు వేదాలు కావు. గంగయ్య మేస్త్రి చెప్పిందే వేదం. ఇజాలు నిజాలంటే వాళ్లకు ఎలర్జీ... ఎర్రకారం మంట!
ఇంకా రంగయ్య మేస్త్రి ఇట్లా వివరణ ఇచ్చాడు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవని రంగయ్య చిన్నప్పుడే చదువుకున్నాడు. గంగయ్య ముఠా వాళ్ల అరుపులకు అతడు బెదరలేదు.
‘‘పనిలో పడి మరచిపోయాం అంటాం... అంటే ఏమిటి? పనిలో ఉండి ఫలాని విషయం మరచి పోయాం అని కదా తాత్పర్యం. అందువల్ల చెంద్రయ్య బొడ్రాయి దగ్గరికి తెచ్చిన వార్త‘ చేనులో గొడ్డు పడింది అంటే.. చేనులోకి గొడ్డు చొరబడింది’ అని అర్థం... చేనులోకి గొడ్డు ఎందుకు చొరబడుతుంది? ఫొటో దిగడానికా... పొట్ట నింపుకోడానికి... అంటే చేను మేయడానికి. అందువల్ల చేను ఆసామి లబోదిబోమనాలి కాని... గొడ్డు ఆసామి ఎందుకంటాడు?
‘‘చేను ఆసామి లబోదిబోమనడం డబుల్ రైటు.. త్రిబుల్ రైటు. ఆ మాటకొస్తే త్రిబుల్ క్యూబ్ రైటు...’’ అన్నాడు రంగయ్య మేస్త్రి.
చిన్నప్పట్నించి రంగయ్య మేస్త్రికి లెక్కలంటే ఇష్టం. లెక్కల సారంటే ఇష్టం... లెక్కల పుస్తకాలన్నా, ఎక్కాల పుస్తకాలన్నా మరీ మరీ ఇష్టం... ఎక్కాలు రాని.. లెక్కలు రాని గంగయ్య మేస్త్రీ కాకి లెక్కలంటే రంగయ్య మేస్త్రికి ఒళ్లు మంట.... అరికాలి మంట.
బొడ్రాయి దగ్గర రంగయ్య మేస్త్రీ ముఠా కూడా ఉన్నది. రంగయ్య మాటలకు ఆ ముఠా బిగ్గరగా చప్పట్లు చరిచేసరికి చుట్టూ చెట్ల మీదున్న పిట్టలు ఎగిరిపోలేదు- సంబరంగా చూశాయి.
‘‘చెంవూదయ్యా... చేన్ల పడిన గొడ్డును గెదుమక ఇక్కడిదాక ఆ వార్త మోసుకొచ్చినవా..’’ చెంద్రయ్య వంక తిరిగి అడిగాడు రంగయ్య మేస్త్రి.
చెంద్రయ్య.... ఆ గొడ్డు గంగయ్య దొర మేనమామ గారిదని చెబుతుంటే ‘‘ష్’’ అని చెంద్రయ్య నోరు మూయించాడు గంగయ్య మేస్త్రి. ఆ తరువాత రంగయ్య మేస్త్రి వంక ఉరిమి చూస్తూ.... ‘‘ఏం మాట్లాడుతున్నవ్, నువ్వు ఏ స్కూళ్ల చదువుకున్నవయ్యా? ఎన్నో క్లాసు దాకా చదువుకున్నావు? నీకు తెలుగు చెప్పిన పంతులు ఎవరు? తెలుగు తల్లినే అవమానిస్తున్నావ్... నేలమీద నువ్వు పడితే నీకు దెబ్బ తగులుతుందా?...నేలకా? నీకే కదా... మరి చేనులో గొడ్డు పడితే గొడ్డుకే తగలాలె కదా..’’
‘‘అంతేకదా...’’ గంగయ్య ముఠా వాళ్లంతా ఖుషి ఖుషి ....
గంగయ్య మేస్త్రి వితండ వాదం విని రంగయ్య మేస్త్రి సూటిగా ఒక ప్రశ్న వేశాడు.
‘‘అసలు గొడ్డు చేనులోకి ఎందుకు రావాలి?’’
‘‘ఎందుకంటే... చేను ఏపుగా పచ్చగా కనిపించింది... వచ్చింది- అది గొడ్డు బుద్ధి... అంత పచ్చగా ఏపుగా చేను కనిపించకపోతే గొడ్డు తన దారిన తాను పోయేది. తప్పు ఏపుగా పెరిగిన చేనుది. గొడ్డుది కాదు...’’
ఆహహా... ఓహొహో... తిమ్మిని బమ్మి.... బమ్మిని తిమ్మి చేయడంలో తమ మేస్త్రిని మించిన ముఠామేస్త్రి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు.... ఆలోవర్ వరల్డ్‌లోనే లేడని గంగయ్య మేస్త్రి ముఠా వాళ్లంతా ఏకక్షిగీవంగా తీర్మానం చేసి, ఆనందం పట్టలేక ఒకరి అంగి ఒకరు చింపుకొని, ఒకరి జుట్టు ఒకరు పీక్కొని ఎగిరి గంతులు వేశారు.
అంతటితో ఆగిపోలేదు గంగయ్య వాదన. ‘‘మిస్టర్ రంగయ్యా... చేను ఆసామి చేరాలు మీ బామ్మరిదికి దగ్గరి వాడా... బావకు దగ్గరి వాడా...అతనికి వత్తాసు పలుకుతున్నావ్. ఆ మాటకొస్తే చేనును ఏపుగా పెంచి, గొడ్డును ఆకర్షించి, అది చేనులో పడటానికి కారణమైన చేరాలు గొడ్డు ఆసామికి నష్టపరిహారం చెల్లించాలి...’’
ఆ వాదన విని, ఏనుగును దాని ఎత్తు తక్కువనుకుంటే ఒంటెను ఎక్కినంత సంతోషంతో గంగయ్య ముఠా కేరింతలు కొట్టింది...
తల దిమ్మెక్కిపోయింది రంగయ్యకు...
‘‘తెలివి...అతి తెలివంటే నీదయ్యా గంగయ్యా... ఎద్దు చేనులో పడి చేను ఆసామి నష్టపోతే అతన్నే నష్టపరిహారం చెల్లించమంటావా...’’
‘‘అవును, చెల్లించాల్సిందే...’’ గంగయ్యతో పాటు అతని ముఠా వాళ్లంతా బిగ్గరగా అరిచారు.
అప్పుడు కథలో ఒక చిన్న ట్విస్ట్. అదేవిటంటే- గంగయ్య మేస్త్రి ఏకైక పుత్రికా రత్నం, వజ్రం, వైడూర్యం, మరకతం, మాణిక్యం తండ్రి చెవిలో గుసగుసగా అంది-
‘‘డాడ్...’’
‘‘ఎస్ బేబీ...’’
‘‘తొందర పడ్తున్నారు...’’
‘‘ఎందుకు బేబీ....’’
‘‘మన అస్మదీయుల పట్ల వాదిస్తున్నారు. మన ఓట్లు సేఫ్. బాగానే ఉంది. కానీ, చేను ఆసామి చేరాలు బంధుమివూతులు చాలామంది ఉన్నారట. అందుకే రంగయ్య మేస్త్రి చేరాలుకు అనుకూలంగా వాదిస్తున్నాడు. వచ్చే ఎలెక్షన్లలో ఆ ఓట్లన్నీ అతనికే పడతాయి. మనకు రెండువైపులా ఓట్లు రావాలంటే తటస్థంగా ఉండటం మంచిది. వన్ సైడ్ వాదన డేంజర్ డాడ్...’’
‘‘అవునా బేబీ డియర్...’’
‘‘ఎస్ డాడ్...’’
ఊసర కంటే వేగంగా గంగయ్య రంగులు మార్చగలడు. గొంతు మార్చగలడు. మార్చేశాడు.
‘‘చేనులో గొడ్డుపడింది సరే... మిత్రులారా! నా కార్యకర్తలారా, చేను ఆసామి చేరాలు కూడా మన వాడే. అతనికీ అన్యాయం జరగొద్దు. ఇటు గొడ్డు ఆసామికీ అన్యాయం జరగొద్దు. ఇద్దరికి సమన్యాయంగా నేను తీర్పు చెబుతున్నా...’’ అన్నాడు.
‘‘చెప్పండి... చెప్పండి...’’ చెవులు చేటంత, ఏనుగు చెవులంత చేసి వినడానికి సిద్ధంగా ఉన్నారు గంగయ్య ముఠా వాళ్లు.
‘‘సమన్యాయం అంటే ఏమిటి దొరా...?
‘‘ఏవిటి నాయకా...?’’
‘‘ఏవిటి నాయకుల నాయకా...’’
‘‘ఏవిటి నాయకుల నాయకుల ఆలోవర్ దునియా నాయకుల నాయకా...నాయకా గ్రేసరా....’’
అట్లా అస్మదీయులంతా ఉత్సాహంగా, ఉత్కం అడిగేసరికి గంగయ్య మేస్త్రి సంతోషించి, సంతృప్తి చెంది సమన్యాయాన్ని ఇట్లా వినిపించాడు-
‘‘చేను ఆసామి చేరాలు నష్ట పరిహారం చెల్లించనవసరం లేదు. అందుకు బదులుగా గొడ్డును దాని ఇష్టం వచ్చినంత సేపు చేనును మేయనిస్తే చాలు. అటు చేను ఆసామి చేరాలుకు నష్టపరిహారం చెల్లించే బాధ తప్పుతుంది. ఇటు గొడ్డు ఆసామికి తన గొడ్డుకు దెబ్బ తగిలింది కనుక దానికి పరిహారంగా అతడు గొడ్డుకు మేత పెట్టే బాధ తప్పుతుంది.’’
‘ఆహా! ఏమి సమన్యాయం...ఏమి సమన్యాయం...’ అని గంగయ్య ముఠా వాళ్లంతా గంగయ్యను పొగడ్తలతో ఆకాశానికి...అంతకంటే పైన ఇంకేదైనా ఉంటే అక్కడి దాకా ఎత్తుతుంటే...
‘‘చాల్లే నోర్మూయండి... సమన్యాయమంటే ‘నీ కంట్లో నేను వేలుపెడతా... నా నోట్లో నువ్వు వేలు పెట్టు’ అన్నట్టా... ఇదేనా మీ సిద్ధాంతం, రాద్ధాంతం...’’ రంగయ్య గొంతులో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.
అప్పుడు ఆ ఊరి గోపయ్య అటువేపు వచ్చాడు- అతణ్ణి అందరూ ఆప్యాయంగా కాకా అని పిలుస్తారు.
‘‘తప్పు గంగయ్యా... ముందా గొడ్డును చేను నుంచి తరిమేయమని చెప్పు’’ అన్నాడు గోపయ్య వస్తూనే...
గోపయ్య కాక పలికిన హితవు మాటలు గంగయ్య చెవి కెక్కలేదు. నిప్పు తొక్కిన కోతిలా అనకూడదు- కోతి మన అన్న. నిప్పు తొక్కిన క్రూరమృగంలా గఁయ్‌న గోపయ్య మీదికి లేచాడు గంగయ్య.
‘‘కాటికి కాళ్లు చాపిన ముసలోళ్లు కూడా మాకు నీతులు చెప్పుడేనా... నీకెందుకు ముసలాయనా ఈ రాజకీయాలు. గొడ్డును చేను నుంచి తరిమేయడం అంత సులువు కాదు. అందుకు ఇద్దరు ఆసాములు ఒప్పుకోవాలి..’’
‘‘పరాయి చేనులో పడి మేస్తున్న గొడ్డును తరమడానికి గొడ్డు ఆసామి అంగీకారం కావాలా!?’’ బీరిపోయి చూశాడు గోపయ్య కాక. బీరిపోయి చూశాడు రంగయ్య మేస్త్రి.
‘‘గొడ్డు ఆసామి ఒప్పుకునేదాకా చేను ఆసామి గొడ్డును తరిమేయకుండా తన చేనును మేయనివ్వాలా!!’’ అడిగాడు రంగయ్య మేస్త్రి ఆశ్చర్యంగా...
‘‘అవును- అదే సమన్యాయం అంటే...’’
గంగయ్య తన ముఠా వాళ్ల వంక చూస్తూ అన్నాడు.
‘‘అవును...అవును... అదే సమన్యాయం...’’ ముఠా నుండి కేకలు...కేరింతలు!!
అప్పుడు భుజానికి ఒక సంచి, పొడుగాటి లాల్చి పైజామాతో ఒక ఆకారం అక్కడ ప్రత్యక్షమయింది.
ఆ ఆకారం గల మనిషి ప్రజల పక్షాన నిలబడే పార్టీ నాయకుడు కనుక ‘గంగయ్య మేస్త్రి సమన్యాయాన్ని చీల్చి చెండాడి చేను నుంచి తక్షణమే గొడ్డును తరిమేయాలి. చేను ఆసామికి నష్టపరిహారం చెల్లించాలి. అదే సమన్యాయం...న్యాయం’ అని చెబుతాడు...అరుస్తాడు...ఘీంకరిస్తాడు...గాండ్రిస్తాడు...గర్జిస్తాడు అనుకొని రంగయ్య మేస్త్రి కళ్లు ఆశగా అతని వంక చూశాయి.
‘‘గంగయ్య మేస్త్రి చెప్పిన సమన్యాయమే సరియైనది. గొడ్డును తన ఇష్టం వచ్చినంత సేపు చేనులో మేయనివ్వాలి...’’ అని ఆ ఆకారం పిల్లిలా మ్యావ్ మ్యావ్ అనేసరికి అక్కడున్న వాళ్లంతా బిత్తరపోయారు. గంగయ్య మేస్త్రి ముఠా కూడా నమ్మలేకపోయంది. అంత సులభంగా ఆ ఆకారం తమ వాదనను ఒప్పుకునేసరికి వారి ఆనందానికి పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. దగ్గరున్న పందిరిని పీకి పడేసేదాకా వారి కాళ్లు చేతులు నిలువనంటున్నాయి.
చేనులో గొడ్డు పడిన వార్త తెచ్చి అప్పటి దాకా మౌనంగా ఉన్న చెంద్రయ్య ఒక్కసారిగా నోరు విప్పి గట్టిగా అరిచాడు- ‘‘ఛీ...ఇంత ఘోరమా!!’’.
‘‘ఏవిట్రా... ఏమంటున్నావ్...’’ పందిరి పీకే ప్రయత్నంలో ఉన్న గంగయ్య ముఠాలోని ఒక శాల్తీ చెంద్రయ్య మీదికి లంఘించింది.
‘‘ఎర్ర చీమ ఈయన్ని చూసి సిగ్గుపడాలె’’ అన్నాడు చెంద్రయ్య బెదరకుండా... లాల్చీ ఆకారాన్ని చూస్తూ-
‘‘ఎందుకురా...?’’
‘‘దాని పేరులో ఎర్ర అనే పదం ఉన్నందుకు...’’
చెంద్రయ్య మీదపడి గంగయ్య ముఠా వాళ్లు తమ పిడిగుద్దుల ఇష్టాన్ని తీర్చుకునే వాళ్లే...
ఇంతలో... ‘‘పారిపోండ్రి పారిపోండ్రి...’’ అంటూ ఆ ఊరి వీరసామి అటు పరుగెత్తుకుంటూ వచ్చాడు.
‘‘ఏవిట్రా వీరసామి, ఏమయింది...?’’ అని ఎవరో అడిగితే...
‘‘తమ చేన్ల గొడ్డు పడితే ఊర్కుంటడా... చేరాలు కొడుకు... గొడ్డును తరిమేసి పోతరాజు లెక్క వార్ కట్టె పట్టుకొని ఇటే వస్తున్నడు... ఎవరి మీద పడ్తడో ఏమో...’’
పోతరాజు... వార్ కట్టె అనే పదాలు వినేసరికి గంగయ్య ముఠా వాళ్లు గజగజ వణికిపోయారు. అశ్శరబశరబ....
‘‘డాడ్... వార్ కట్టె అంటే మన మద్రాస్ ఇంగ్లీషులో హంటర్ కదా...’’ అని అడిగింది గంగయ్య మేస్త్రి పుత్రికా రత్నం.
‘‘ముందు ఇక్కణ్నుంచి పదమ్మా... అసలేవాడు పోతరాజులా వస్తున్నడట...’’ కూతురు చేయి పట్టుకొని గంగయ్య మేస్త్రి తన బంగళాకు పరుగో పరుగు...