Thursday 19 December 2013

చర్చంటే భయం!!



వాదనలో న్యాయం లేనివాడికి, తనవాదన తనకే తప్పుగా తోచేవాడికీ ఎప్పుడైనా చర్చంటే భయమే. అలాగే మనరాష్ట్రంలో సమైక్యవాదులకు కూడా చర్చంటే భయమే. చర్చను తప్పించుకోవడానికి గందరగోళం సృష్ఠించడం, గొడవలు చేయడం, తిట్లకు పూనుకోవడం కూడా తరుచుగా సమైక్యవాదుల్లో చూస్తుంటాం. ఎందుకంటే ఈసమైక్యభావన ఇసుమంతైనా లేనివారు సమైక్య రాష్ట్రం కోరితే ఆవాదనకు ఎప్పుడూ విలువుండదు కదా.

ఇప్పుడు సమైక్యవాదులకు విభజనలో తమకు జరిగే నష్టాలను చెప్పుకోవడానికి ఒక అద్భుత అవకాశం వచ్చింది. అదేమంటే రాష్ట్ర విభజన అసెంబ్లీకి చర్చకు వచ్చింది. అయితే చర్చంటే సమైక్యవాదులకు సహజంగా భయం కదా, మరి వారు చర్చను ఎలా జరగనిస్తారు? అందుకే వారం రోజులుగా సీమాద్ణ్ర శాసనసభ్యులు చర్చలకు అడ్డుపడుతూ ఇప్పుడు అసెంబ్లీని వాయిదా వేయించగలిగారు. వాయిదాలతో విభజన ఆగిపోతుందని సీమాంధ్ర ప్రజలకు భ్రమ కలిగిస్తున్నారు.

చర్చకు అడ్డుపడే ప్రక్రియలో అందరికంటే ముందుండాలని తాపత్రయపడుతున్న జగన్ పార్టీ రాష్ట్రపతినుండి వచ్చిన బిల్లును పక్కనబెట్టి సమైక్యతీర్మానాన్ని చెయ్యాలని పట్టుబడుతూ తాము పట్టిన కుందేటికి అసలు కాళ్ళే లేవంటుంది. దేశంలో ప్రధమ పౌరుడిదగ్గరనుండి స్వయంగా ఒక బిల్లు వచ్చినప్పుడు దాన్ని కాదని మరొక తీర్మానం చేయడం రాష్ట్రపతిని అవమానించడమే. అంతేకాక విభజనకు అనుకూలంగా బిల్లు ప్రవేశపెట్టాలని మూడేళ్ళుగా తెరాస అడుగుతుంటే పెట్టనివారు ఇప్పుడు వైకాప చెబుతున్నట్లు సమైక్య తీర్మానం ఎలా చేయగలరు? అయినా అసెంబ్లీ తీర్మానం చేసిననంత మాత్రాన విభజన ఆగిపోతుందా?

మొత్తానికి సీమాంధ్రనేతలంతా కలిసి తమను ఎన్నుకున్న సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారు. వారికి చెందాల్సిన హక్కులగురించి మాట్లాడ్డానికి తమకు వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకుంటున్నారు. సీమాంధ్ర ప్రజలను తామింకా విభజనను ఆపగలమని మభ్యపెడుతున్నారు.

Monday 25 November 2013

చిత్తం రామునిపై భక్తి పోలవరంపై


"చిత్తం శివునిపైన భక్తి చెప్పులపైన" అనేది పాత సామెత. "చిత్తం రాముడిపైన భక్తి పోలవరం డ్యాముపైన" అనేది నేడు సీమాంధ్ర నేతలకు సరిగ్గా అతికే సామెత.

భద్రాచలం డివిజన్ మాకే దక్కాలి అనే వాదించే సీమాంధ్ర నేతలు చెప్పే కారణం "భద్రాచలం తెలంగాణలో ఉంటే పోలవరంకు అడ్డంకులొస్తాయి" అని. నిజానికి పోలవరం రిజర్వాయరు ప్రస్తుత డిజైన్ ప్రకారం భద్రాచలం డివిజన్లో సగం మునిగిపోతుంది. అందమైన పాపికొండలు కనుమరుగవుతాయి. విలువైన ఆటవీ ప్రాంతం, వన్యప్రాణులు, ఖనిజ సంపద మునిగిపోతాయి. వీటన్నిటితో పాటు రాజమ్నడ్రి లాంటి ఒకపెద్ద నగరం ఆడ్యాము కింద ఉండడం అతిపెద్ద రిస్క్.భూకంపం సంభవిస్తే రాజమండ్రి క్షణాల్లో తుడిచిపెట్టుకోగలదు. అయినా సీమాంధ్ర నేతలు తమ పంతాన్ని నెగ్గించుకోవడం కోసం పోలవరంపై పట్టుబట్టారు.

ఇప్పుడు భద్రాచలం డివిజన్ తెలంగాణకొస్తే రిజర్వాయరులో ఆటవీప్రాంతం ముంపుకు వ్యతిరేకంగా అక్కది ప్రజలు ఉద్యమిస్తారు, కోర్టులకెలతారు. అదే తమ సొంత రాష్ట్రంలో ఉంటే నయానో భయానో ఒప్పించవచ్చు. ఇదీ సీమాంధ్ర నేతల ఉపాయం.

 మీరు మాతో కలవండి, మేము మిమ్మల్ని నీటిలొ ముంచుతాం అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అందుకే భద్రాచలం ప్రజలు మేము తెలంగాణతోనె ఉంటామని తెగేసి చెబుతున్నారు, ఉద్యమిస్తున్నారు. 

రాష్ట్రం విడిపోతే నీటిపోరాటాలొస్తాయి అనే కిరణ్‌రెడ్డి కలిసుంటే నీటిపోరాటాలు ఎందుకు రావో చెప్పడు. కలిసున్నా ఇప్పుడూ నీటికోసం ఉద్యమాలు వస్తూనే ఉన్నాయి కానీ వాతిని నిరంకుసంగా అణచివేయొచ్చు విడిపోతే అణచివేత సాధ్యం కాదనేది అతని మాతల మర్మం.

అలాగే మునగాల పరగణా గురించి కూడా. నాగర్జునసాగర్ ఎడమకాలువ పారే అతికొద్ది తెలంగాణా ప్రాంతంలో ఒకటి మునగాల పరగణా. అందుకే మునగాలపై ప్రేమ. 

Monday 18 November 2013

అందరూ అంబేద్కరులే!



ఎక్కువగా మాట్లాడని జైపాల్‌రెడ్డి మాట్లాడితే అవతలివారికి దిమ్మతిరుగుతుందని నిన్న చేసిన ప్రసంగంతో నిరూపించాడు. చంద్రబాబు, జగన్, జేపీ, ఉండవల్లి, అశోక్‌బాబు తేడా లేకుండా సీమాంధ్ర నాయకులంతా ఆర్టికల్ మూదును సవరించాలని డిమాండ్ చేస్తున్నారు, అక్కడికి వీరికి రాజ్యాంగనిర్మాతలకంటే ఎక్కువ తెలిసినట్లు. మందిని మోసం జేయడం, దొరికితే జైలుకెల్లడం జేసే ఈదగుల్బాజీ నాయకులకు రాజ్యాంగం మార్చాలని చెప్పేంత సీనుందా? అందుకే అందరూ అంబేద్కరులైతే తట్టుకోవడం కష్టమని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

అసలు ఆర్టికల్ మూడు రాష్ట్రాల పునర్విభజన అధికారాన్ని కేంద్రానికి ఇచ్చిందే ఇలాంటి పరిస్థితి వస్తుందని. రాజ్యాంగ నిర్మాతలు అరవై ఏళ్ళకిందనే ఊహుంచినదాన్ని ఇప్పుడు మన సీమాంధ్ర నేతలు నిరూపిస్తున్నారు. పైగా తమ పెత్తనం కొనసాగడంకోసం రాజ్యాంగాన్నే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర నాయకుల లాభాలకోసం అవసరమైతే ఈసమైక్యాంధ్ర రాష్ట్రంలో ఫైల్లు మారుతాయి కానీ రాజ్యాంగం మారదని ఈమట్టిబుర్రలకు తెలీదులాగుంది. అలా మార్చగలిగితే ఇంకేముంది, అక్రమ ఆస్తుల కెసులనుండి జగన్ను బయటికి తేవడానికి చట్టాలనే మారిస్తే సరిపాయె.

ఆర్టిక 3 ఈ అధికారం కేంద్రానికి ఇచ్చిఉండకపోతే మద్రాసు నుండి ఆంధ్ర విడిపోగలిగేదే కాదు. సీమాంధ్ర నాయకులు చెప్పినట్టు ఆర్టికల్ 3ను సవరిస్తే భవిస్యత్తులో ఏరాష్ట్రంలోనైనా మెజారిటీవర్గం మైనారిటీ వర్గాన్ని వివక్షకు గురిచ్_ఎస్తుంటే మైనారిటీ విడిపోయేహక్కును కోల్పోతుంది. ఇలాంటి డిమాండ్‌ను  సీమాంధ్ర నాయకులు చేస్తే అది ఎలాగూ ఎవరూ ఒప్పుకోరుగానీ సీమాంధ్ర పరువు మాత్రం దేశం మొత్తంలో మంటకలుస్తుంది. సీమాంధ్ర ప్రజలారా, మిమ్మల్ని దోషులుగా జేస్తుంది మీనాయకులే.

నిజాయితీ లోపించిన మేధావితత్వం


"చెడ్డవారి దుర్మార్గం కంటే కూడా మంచివారి మౌనం వల్ల ఈసమాజానికి ఎక్కువ నష్టం". ఇది మన ప్రియతమ లోక్‌సత్తా అధినేత తరుచుగా వినిపించే సూక్తి. ఈజేపీ తెలుసుకోవాల్సిందేమిటంటే  చెడ్డవారి దుర్మార్గం, మంచివారి మౌనం కంటేకూడా మేధావివర్గం పక్షపాత ధోరణివలన సమాజానికి ఎక్కువ నష్టం. జేపీ మేధావి అన్నది ఎంత నిజమో తెలియదు కానీ ఇతను ప్రాంతీయ, కుల పక్షపాతాలకు ఏమాత్రం అతీతుడు కాదు, పైపెచ్చు ఈపిచ్చి కొంచెం మోతాదుకు మించే ఉన్నది అని మెల్లిగా అందరికీ తెలిసొచ్చింది.

రెండువేల తొమ్మిది డిసెంబరు తరువాత ఈరాష్ట్రమంతా విభజన అంశంపై విడిపోయి ఉడికిపోతున్నవేల పార్టీ ఫండ్శ్ కోసం అమెరికా వెల్లిన జేపీని అక్కడి తెలంగాణవాదులు రాష్ట్రవిభజన అంశంపై మీవైఖరి ఏంటి అని నిలదీస్తే ఇతనిచ్చిన సమాధానం అదిప్పుడు ప్రయారిటీ కాదు అని. ఆతరువాత సంవత్సరం  తిరిగినాక  ఇదే జేపీ ఇంత ముఖ్యమైన విషయంపై రాష్ట్రం ఉడికిపోతుంటే కేంద్రం ఎన్ని రోజులు సమస్యను నాంచుతుంది, వెంటనే తేల్చాలి అని స్టేట్మెంటు ఇచ్చాడు.. కాకపోతే "అందరికీ ఆమోదయోగ్యమైన సామరస్యపూరిత పరిష్కారం" కావాలంటూ ఒక క్లాజు తగిలించాడు, అదెలాగూ సాధ్యం కాదని తెలిసినోడు కాబట్టి.

రాష్ట్రవిభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నతరువాత ఈమధ్యన టీవీషోల్లో బుజీగా కనిపిస్తూ ఇదేం చిన్నపిల్లల ఆటనా, కేంద్రంలో అందరూ పనికిమాలిన వెధవలు అంటూ అందరినీ తిడుతూ తానొక్కడే పెద్దమేధావి తనకు తెలిసినంత మరెవ్వరికీ తెలియదు అన్నట్టు ఫోజు పెడుతూ కేంద్రం విభజన వ్యవహారంపై రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నదని భారీ డైలాగులు వినిపిస్తున్నడు. పోనీ ఎలా విభజిస్తే బాగుంటుందో కాస్త మీరు చెప్పండి అంటే అమ్మో నేనేదైనా చెబితే మల్లీ నన్నంటారు అంటూ వెంటనే తప్పించుకున్నాడు.

ఎక్కడా కనపడని సమైక్య ఉద్యమాన్ని పెద్దది చేస్తూ వందరోజులుగా రోడ్లపైకి జనం వస్తుంటే ఈకేంద్రానికి పట్టదా అని ప్రశ్నిస్తాడు. నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమాలతో ఉడికిపోతుంటే మాత్రం రాష్ట్రాన్ని ఉద్యమాలపేరుతో తగలబెడుతున్నారు అంటూ మొసలి కన్నీరు కార్చేవాడు. ఈసమస్యను తేల్చాల్సింది కేంద్రం కాదు, రాష్ట్ర అసెంబ్లీయే తెల్చాలి అంటూ పైగా అదే రాజ్యాంగ స్ఫూర్తి అని చెబుతున్నాడు. దోచుకునెవాన్ని దోచుకోబడేవాడు వెళ్ళి అయ్యా మీరే నాసమస్యకు పరిష్కారం చెప్పాలి అంటే చెబుతాడా? ఆ సంగతి తెలిసే రాష్టృఅ విభజనపై అధికారాన్ని రాజ్యాంగనిర్మాతలు కేంద్రానికి కట్టబెట్టారని ఈయనకు తెలియదా? 

ఒస్మానియా విద్యార్థులను అమానుషంగా కొట్టిన పోలీసులను మానవ హక్కుల ఉల్లంఘనకింద కోర్టులే అక్షేపించినా ఆవిషయంపై నోకామెంట్ అంటూ తప్పించుకున్న జేపీకి అరెస్టులూ బైండోవర్ కేసులతో ఉద్యమంపై ఉక్కుపాదం మోపినపుడు నోరుమెదపని జేపీకి ఇప్పుడు సీమాంధ్రలో మీడియాలో తప్ప ఇంకెక్కడా కనపడని ఉద్యమం గురించి ఆక్రోషం ముంచుకొస్తుంది. ఇలాంటి పక్షపాత బుద్దులవల్ల ఈసమాజానికి మేలు జరగదు గానీ కీడు మాత్రం బోలెడు. తిన్నింటివాసాలు లెక్కబెట్టే ఇలాంటి కుహనా మేధావులను తెలంగాణనుండి తరిమేసే రోజులు ఎంతోదూరంలో లీవు, ఎన్నికలకు ఇంకా ఉంది ఆరు నెలలే. 


Wednesday 13 November 2013

గొంతెమ్మ కోరికలు


కిరణ్‌రెడ్డి నేతృత్వంలోని సీమాంధ్ర సర్కారు మంత్రుల బృందానికి తమ కోరికలు తెలుపుతూ ఒక నివేదిక ఇచ్చిందంట. ఇంకా విభజన జరగలేదు గనుక ఇది వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నివేదిక కావాలి. కానీ ఏనాడు మన ముఖ్యమంత్రులూ, ప్రబుత్వాలూ ఉమ్మడి రాష్ట్రానికి ప్రభుత్వాల్లా వ్యవహరించలేదు, కేవలం తెలంగాణపై పెత్తనం చేస్తూ సీమాంధ్ర ప్రయోజనాలకోసం మాత్రమే పని చేశాయి కాబట్టి సీమాంధ్ర ప్రభుత్వం అనాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కాకుండా నిస్సిగ్గుగా తమది సీమాంధ్ర ప్రభుత్వం అని తెలియజేస్తూ ఒక నివేదిక సమర్పించారు. ఇందులో కొన్ని మచ్చు తునకలు:

లక్ష ఎకరాలలో సీమాంధ్ర రాజధాని:

లక్ష ఎకరాల్లో ఐదు లక్షల బడ్జెట్‌తో సీమాంధ్రకు రాజధానిని ఏర్పాటు చేయాలంట. ప్రస్తుతం జీహెచ్ఎంసీ  పరిధి లక్షన్నర ఎకరాలు. కనీసం దానిలో మూడింట రెండు వంతులు ఉంటే గానీ తమ రాజధానికి సరిపోదంట. ఈ లక్ష ఎకరాలు అంతా కొత్తగా కావాలంట.  అంటే ఇప్పటికే ఉన్న విశాఖ, విజయవాడ లాంటి నగరాలను అభివృద్ధి చేస్తే అవి లక్ష ఎకరాల నగరాలయినా అలాగొద్దట, పూర్తిగా లక్ష ఎకరాల కొత్త భూమి కావాలంట. దానికోసం అభయారణ్యాలను డీనోటిఫై చేసి చెట్లు కొట్టేసి రాజధానిని ఏర్పాటు చేయాలంట. 

ఒక రాజధానికోసం లక్ష ఎకరాల అడవి కొట్టేయడం ఎందుకు, ఇప్పటికే ఉన్న నగరాలపక్కన స్థలాన్ని తీసుకుని అవసరమయిన బిల్దింగులు కట్టడానికి ఎంత స్థలం కావాలి అని సామాన్యుడికి అనుమానం రావొచ్చు. మరి ఇప్పుడున్న సీమాంధ్ర నగరాలచుట్టూ ప్రైవేటు భూములుంటాయి. అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే ప్రైవేటు వ్యక్తులు తమ భూములు అమ్ముకుని లాభపడతారు, నేతలకు కబ్జాలు చేయడానికి కుదరదు గదా? అదే లక్ష ఎకరాల కొత్త ఆటవీ భూమిని డీనోటిఫై చేసి రాజధాని ఏర్పాటు చేస్తే అందులో మూడొంతులు ఈనేతలు కబ్జా పెట్టొచ్చు గదా. అంత స్థలం కబ్జా చేస్తే గానీ హైదరాబాదు వదులుకున్న ఈనేతల భూదాహం తీరదు. 

హైదరాబాదు భూముల పంపిణీ తిరగదోడొద్దు:

కొత్త రాజధానిలో తమ కబ్జాలకోసం లక్ష ఎకరాలు ఇవ్వడంతోపాటు ఇప్పటిదాకా తాము హైదరాబాదు చుట్టుపక్కల చేసిన కబ్జాలపై సీమాంధ్ర నేతలకు రక్షణ కావాలంట. అందుకోసం హైదరాబాద్ భూముల పంపినీ వ్యవహారాలను తిరగదోడొద్దనేది వీరి మరో విచిత్రమయిన కోరిక.

భద్రాచలం డివిజన్ సీమాంధ్రకివ్వలట:

భద్రాచలం డివిజన్ను  విభజన తరువాత సీమాంధ్ర కిచ్చేయాలట. దీనికి వీరిచ్చే రీజన్: పోలవరం కడితే భద్రాచలం డివిజన్ ముంపుకు గురవుతుంది. కాబట్టి మాకిస్తే ఇబ్బంది ఉండదు, డివిజన్ మొత్తాన్ని ముంచేసి అక్కడి ప్రజలను తరిమి కొడతాం. అక్కడి ప్రజలేం కోరుకుంటే మాకేంతి మా అవసరాలె మాకు ముఖ్యం, మాదగ్గర ఆదివిజన్ ఉంటే అక్కడి ప్రజలను బలిపశువులు చేయొచ్చు లెకపోతే కుదరదనేది వీరి విచిత్ర వాదన.

ఉద్యోగులు కోరుకుంటే తెలంగాణలో ఉండనివ్వాలి:

తెలంగాణలో ఎందరో సీమాంధ్ర ఉద్యోగులు అక్రమంగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ రికమెండేషన్ ప్రకారం వీరు తెలంగాణలో ఉండాలని కోరుకుంటే వీరికోసం ఖాళీలు లేకున్నా సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఇక్కడే ఉండనివ్వాలంట. అంటే విభజన జరిగిన తమ అన్యాయం అలాగే కొనసాగాలంట. 

సింగరేణిలో యాభైఎనిమిది శాతం వాటా కావాలంట:

తెలంగాణ నడిబొడ్డున ఉన్న సింగరేణి కాలరీస్‌ను విభజన అనంతరం సీమాంధ్రకు జనాభా ప్రాతిపాదికన యాభై ఎనిమిది శాతం వాటా ఇవ్వాలంట. విశాఖ ఉక్కులో,పోర్టులో, బెరైటీస్ గనుల్లో మాత్రం తెలంగాణకు వాటా ఉండదు.
  
ఆకాశరాముడు సెలవిచ్చినట్టు దురాశ దఃఖమునకు చేటు తెస్తే సంతోషానికి మంచిదే కానీ ఇది మాత్రం నిజంగా సీమాంధ్ర ప్రభుత్వపు  "దురాశ దుఃఖము, చేటు" తెస్తుంది. 

Monday 11 November 2013

యూటీతో లూటీ కొనసాగింపు

ఇన్నాళ్ళూ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్టు చెప్పిన పలువురు సీమాంధ్ర నేతలు ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాద్‌ను యూటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రమంత్రులు చిరంజీవి, పురుందరేష్వరి ఇప్పుడు యూతీ రాగాన్ని ఎత్తుకున్న వారిలో ప్రముఖులు.

నిజానికి సీమాంధ్ర ప్రజలపై వీరికేమన్నా చిత్తశుద్ది ఉంటే విభజన అనివార్యమైన స్థితిలో సీమాంధ్ర ప్రజల హక్కులకోసం పోరాడాలి. రాజధానికోసం ప్యాకేజీనో నీటికేటాయింపులకోసమో పోరాడీతే సీమాంధ్ర ప్రజలకు బాగుండేది. కానీ వీరు ఇదేదీ అడక్కుండా హైదరాబాదును మాత్రం యూటీ చేయాలని ఎందుకంటున్నారు? యూటీ చేస్తే ఎవరికి లాభం?

హైదరాబాదును యూటీ చేస్తే హైదరాబాద్ ఆదాయం కేంద్రానికి వెల్తుంది. దీనివలన తెలంగాణకు గానీ, సీమాంధ్రకు గానీ లాభం ఉండదు. హైదరాబాద్ యూనివర్సిటీలలో తెలంగాణ వారికి గానీ, ఆంధ్రా వారికి గానీ ప్రవేశం ఉండదు. మరలాంటప్పుడు హైదరాబాద్ యూటీ చేస్తే సీమాంధ్రకేం ఒరుగుతుంది?

అయితే సీమాంధ్ర నేతలకు కావల్సింది తమ సొంత ప్రయోజనాలూ, తమ ఆర్ధిక లాభాలూ తప్ప ప్రజల బాగు కాదు గదా. ఈనేతలందరికీ హైదరాబాదు చుట్టుపక్కల వేల ఎకరాల భూములు ఉన్నాయి. అన్నీ బినామీ పేర్లతో ఉన్న కబ్జా భూములు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎక్కడ తెలంగాణ ప్రభుత్వం తమ మీద కేసులు పెడుతుందో, కేంద్రపాలిత ప్రాంతమయితే కేంద్రం నుంచి చక్రం తిప్పవచ్చనేది వీరి ఆశగా కనిపిస్తుంది. అందుకే ముఖ్యంగా ఈడిమాండు కేంద్ర మంత్రులదగ్గరినుండి వస్తుంది. అయితే రోజులు ఎప్పటికీ ఒక్కలా ఉండవు కదా? వీరిపిచ్చిగానీ, ఒకవేళ కేంద్రపాలిత ప్రాంతమయినా రాబోయేది వీరి ప్రభుత్వమని ఏంటి గ్యారంటీ? 

Wednesday 6 November 2013

మంత్రుల బృందానికి నా నివేదిక

రాష్ట్ర విభజన వలన తలెత్తే సమస్యలు, వాతి పరిష్కారాల గూర్చి కేంద్ర మంత్రుల బృందానికి వారు ఇచ్చిన టరంస్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం అందజ్*ఏసిన నా నివేదిక.


To
The Group of Ministers,
Govt of India.

Sub: Regarding the issues arising due to the division of states and solutions

Dear Sir,

Thanks for giving us this opportunity to share our feedback with the esteemed  Group of Ministers.

The decision to divide the state of AP albeit delayed is a correct decision, without which justice is impossible to people of Telangana. In the united state of Andhra Pradesh people of Telangana are marginalised by the majority Seemandhra and were denied their basic rights. Over decades injustice was done to people of Telangana in irrigation, Govt funds allocation, state appointed jobs among many others. Only a separate statehood can give justice to people of Telangana. As this is not appropriate forum to list the injustices happened to Telangana and justifications for division of state, I am not going into this part and limit my feedback only on the issues that may arise in the process of division.

My feedback about the terms of reference as given by GoM:

1.       Determine the boundaries of the new state of Telangana and the residuary state of Andhra Pradesh with reference to the electoral constituencies, judicial and statutory bodies, and other administrative units:

The current ten districts of Telangana namely Hyderabad, Ranga Reddy, Nalgonda, Medak, Mahaboob Nagar, Warangal, Khammam, Karim Nagar, Nizamabad, Adilabad should be wholly with Telangana state. All the parliament and Assembly constituencies in these ten districts will then be part of Telangana state.

Rest of the 14 districs of Seemandhra region should be part of residuary Andhra Pradesh state.

Some may argue that Bhadrachalam  revinue division in the district of Khammam which was previously part of Andhra state before the merger of Andhra state with Telangana should be given back to Andhra. However the people in Bhdrachalam are culturally closer to Telangana region and they wish to be part of Telangana state post division. People of ten districts of Telangana also wish that Bhadrachalam revinue division should be with Telangana. As there is consent among people of both sides it is appropriate to make Bhadrachalam part of Telangana state.

Also historically Bhadrachalam was with Nizam state for long time and ceded to British Govt much later than the districts of Seemandhra.

2.      Look into the legal and administrative measures required to ensure that both the state governments can function efficiently from Hyderabad as the common capital for 10 years

In these days with advanced systems we do not need 10 years for building a new capital. Hyderabad as combined capital for such long time can make unnecessary friction between both states post division. Also residuary Andhra Pradesh state functioning can be impaired when their administration is happening away from their main land.

Residuary Andhra Pradesh state should be given grant for constructing necessary buildings such as secretariat, Assembly, High Court, quarters for state ministers, quarters for legislators etc. in their chosen city. Two to three years are sufficient for constructing all the necessary infrastructure.

Common capital period should be reduced to five years from 10 years. This five years time period is important and mainly required for the employees belonging to residuary Andhra Pradesh state to make up their mind whether to move to the new capital or take retirement and remain in Hyderabad city rather than for constructing capital city.

In the period of common capital, the right on administration of Hyderabad should naturally be with Telangana state. However a small area of the city that holds the administrative buildings of residuary Andhra Pradesh state post division can be identified and its administration limited to law and order only can be kept with Union Govt. However this area should be within the boundaries of MCH (not the current GHMC) and be restricted to below 80 square kilometres. This measure is required for the efficient functioning two state Governments from the same city with Hyderabad as common capital.

3.      Take into account the legal, financial and administrative measures that may be required for transition to a new capital of the residuary State of Andhra Pradesh

As suggested in the earlier point a small portion of Hyderabad within MCH limits can be identified and its law and order administration should be kept with Govt. of India. Legal rights on the same region should be with Telangana state.

As income from state departments is accounted at capital city currently the income of Hyderabad appears much higher than its actual share. However post division income of both states will be accounted separately and then Hyderabad income won’t be as big as it appears now.

Many of the companies owned by Seemandhra businessmen have their registered offices located at Hyderabad. This might do some injustice to residuary Andhra Pradesh state post division as the VAT collected from these offices will be accounted into Telangana state. For this reason post division companies should be given option to move their registered offices to Seemandhra region. Residuary Andhra Pradesh Govt can declare Tax holidays to promote their business men to move their registered offices into Seemandhra.


4.      Look into the special needs of the backward regions and districts of both the states and recommend measures.

There are backward districts in both sides. As per the rural development board’s statistics eight out of ten districts in Telangana, three districs of Seemandhra are underdeveloped in human development index. All these districts should be given special packages for their economic developments.

Rural development in India depends a great deal on Agriculture and agriculture is entirely dependent on water resource. These under developed districts should be fed with irrigation by constructing small and medium irrigation projects. Both states should be given funds for development of irrigation. Gram panchayats should be given funds for constructing check dams for improving irrigation.

Hand crafts, cottage industries, agro industries should be encouraged in these regions with NABARD schemes and empowering people with necessary education in these areas.

5.       Look into issues relating to law and order, safety and security of all residents and ensure peace and harmony in all regions and districts consequent to the formation of the state of Telangana and the residuary state of Andhra Pradesh, and the long term internal security implications arising out of the move and make suitable recommendations;

Hyderabad city is from the beginning of its birth being cosmopolitan with people from several cultures ranging from Gujaratis, Marathis, Kannadigas, Parsis, Punjabis, Marwadis coexisting with locals here and living with harmony. Over few decades lakhs of people from Seemandhra region have made Hyderabad as their home and coexisting with natives.

Apart from Hyderabad in the rest of Telangana also scores of Biharis, Marwadis, people from Seemandhra region live together with natives in harmony. Telanganaites have always been cordial and receptive to people of other cultures. It clearly shows that post division there will not be any issues of safety for minority cultural groups: either Marwadis, Biharis or Seemandhra settlers. Any special action taking regarding issue of safety of Seemandhra settlers living in Hyderabad is insulting Telangana administration and must be avoided.

In Seemandhra region there were some sporadic incidents of law and order for people of Telangana residing in that region after the announcement of  decision to divide the state. However there are very few Telangana people living in Seemandhra region and the incidents were minor. We hope over time things get better. There is no need to take any special actions regarding the safety of Telangana people living in Seemandhra region.


6.      Look into the sharing of river water, irrigation resources and other natural resources (especially coal, water, oil and gas) between the two states and also inter-se with other states, including the declaration of Polavaram Irrigation Project as a National Project

Final judgment of Brijesh Committee regarding Krishna Water sharing must be deferred until the completion of division process. Telangana state must be given its right to present its case before Brijesh Committee.

Special boards with members from Telangana and residuary Andhra Pradesh states should be formed to oversee Godawari and Krishna Water.

Under Krishna river depending on flood flow water several projects were built in Seemandhra region. However currently these projects are getting water allocation at the cost of not constructing projects with net allocation in Telangana region. Post division flood flow projects must be restricted to utilizing water from flood flow period and projects in Telangana with net water allocation such as SLBC that are in pending for long periods must be completed as priority.

Proposed Polavaram project on Godawari river submerges lakhs of acres of forest land in Bhadrachalam division. Polavaram project must be redesigned to ensure minimal submergence.

Coal Mines in Northern Telangana(Singareni collories) will naturally belong to Telangana state post division. However there are few power plants in Seemandhra region that depend on these coal mines and must be taken care post division. Hence agreement should be made for the supply of coal at reasonable prices for these Seemandhra projects post division. Likewise Telangana power projects that depend on gas from KG Basin should get gas allocation agreement.


7.       Look into issues related to power generation, transmission and distribution between the two states;

In the united Andhra Pradesh Telangana region suffered organized discrimination in several fronts. Discrimination in installation of power plants is one major thing among others. Due to this discrimination it has happened so that Telangana region though the biggest consumer and main source for coal mines does not have enough power plants. Because of this it is evident that Telangana region will get power shortage post division.

Agreements must be made such that Seemandhra excess power will be utilized in Telangana until  Telangana state becomes self-sufficient in Power Generation.


8.      Look into the issues arising on account of distribution of assets, public finance, public corporations and liabilities thereof between the two states;

-          All the movable and immovable properties that were originally with Telangana (Hyderabad state) prior to 1956 (before merger) shall naturally belong to Telangana.
-          AP Bhavan in New Delhi was compensation to Hyderabad Bhavan which was taken over by Union Govt. Hence AP Bhavan shall be with Telangana state post merger.
-          Properties of APSRTC are divided as per the region where they exist.
-          All the debts should be divded between states as per the project for which the debt was taken.


9.      Look into the issues relating to the distribution of the employees in the subordinate as well as All India Services between the two states;

Service records of all the state Govt employees should be checked thoroughly and divided between states post division as per their nativity.


10.   Look into the issues arising out of the Presidential Order issued under Article 371D of the Constitution consequent to the bifurcation and examine any other matter that may arise on account of bifurcation of the state of Andhra Pradesh and make suitable recommendations.

Article 371D wa formed because of the issues arised due to Mulki rules implementation and it is applicable only in the united Andhra Pradesh. Post division it will not be applicable to Telangana state. However for better division of employment among all districts in Telangana similar arrangement should be made in Telangana state with dividing Telangana state into four zones.

Thanks for giving me such an opportunity to express my views.


Best regards

Monday 4 November 2013

తప్పించుకు తిరుగువాడె సీమాంధ్ర నేత సుమీ!

రాష్ట్రవిభజనపై మీ వైఖరి ఏమిటో చెప్పండి అన్న ప్రశ్నకు ఇన్నాళ్ళూ టీడీపీ, వైకాప, కాంగ్రేస్, లోక్‌సత్తా అనే తేడా లేకుండా అందరూ రకరకాలుగా సమాధానం దాటవేసి నెట్టుకొచ్చారు. ఒకరు ఇది కేంద్రప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఆపేశక్తి మాకు లేదు అంటే ఇంకొకలు నేను వ్యతిరేకం గాదు, మరొకరు సామరస్య పరిష్కారం వెదకాలి అంటూ పదాలతో పదనిసలు చేశారు తప్ప సమాధానాలు చెప్పలేదు.

తీరా కేంద్ర నిర్ణయం తీసుకున్న తరువాత మేమే ఎక్కువ గట్టిగా విభజనకు అడ్డుపడుతున్నమంటే మేమే నంటూ సమైక్యాంధ్ర ఛాంపియన్షిప్ కోసం ఈసీమాంధ్ర నేతలంతా పోటీలు పడుతున్నారు. అందరూ సమన్యాయం , సామరస్యపూరిత పరిష్కారం కావాలనేవారే, కానీ అదెలాగోమాత్రం ఎవరూ చెప్పరు.

చివరికి విభజిస్తే సీమాంధ్రకొచ్చే సమస్యలేంటొనయినా చెప్పండి వీలయితే పరిష్కరిస్తామంటూ కేంద్రం ఒక మంత్రుల కమిటీని వేస్తే దానికి ఒక నివేదిక ఇవ్వడానికి కూడా ఈసీమాంధ్ర నేతలకు ధైర్యం చాలట్లేదు. ఇస్తే గిస్తే ఇక్కడ సీమాంధ్రలో వోట్లు పోతాయనో తెలంగాణలో వోట్లు పోతాయనో తప్ప ప్రజల సమస్యలనెలా కేంద్రానికి తీసుకెళ్ళాలి అని మాత్రం ఈ స్వార్ధ సీమాంధ్ర నాయకులకు పట్టదు.

ఎప్పుడూ తమ వోట్లు, తమ పదవులూ, తమ ఆస్థులూ, తమ కబ్జా భూములు, తమ ఆర్ధిక రాజకీయ అవసరాలు తప్ప ప్రజల క్షేమం పట్టని ఈ నేతలు ఇలా తప్పించుకు తిరుగుతూ ఇన్నాళ్ళూ తెలంగాణ ప్రజలను వంచిస్తే ఇప్పుడు తమ సొంత ప్రాంతమయిన సీమాంధ్ర ప్రజలనే వంచిస్తున్నారు. సీమాంధ్ర ప్రజలారా ఆలోచించండి.. ఈ దగుల్బాజీ నేతలు మీకవసరమా? 

Wednesday 30 October 2013

రెండు రోడ్డు ప్రమాదాలు


గత రెండురోజుల్లో రెండు పెద్ద రోడ్డుప్రమాదాలు ప్రధానవార్తలయ్యాయి. ఒకటి ఔటర్ రింగ్‌రోడ్ మీద డీసీఎం ట్రక్కును ఢీకొన్న ప్రమాదమయితే మరొకటి వోల్వో బస్సు దగ్ధం.

వోల్వో బస్సులు గంటకు నూటనలభై కిలోమీటర్ల వేగంతో వెల్లినా బ్యాలన్స్ తప్పవు, ప్రయాణీకులకు కుదుపులుండవు కనుక వేగంగా పోతుందని భయం ఉండదు. అయితే ఈవోల్వో బస్సులు డిజైన్ చేసింది ఫారిన్ రోడ్లను దృష్టిలో పెట్టుకొని. అక్కడి రోడ్లపై గంటకు నూటనలభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళీనా ప్రమాదాలు జరగవు. అయితే మన డ్రైవర్లు మన డొక్కురోడ్లపై కూడా వోల్వో దొరికింది గదా అని అదే స్పీడుతో వెలుతుంటారు. కానీ మన రోడ్లు అంత వేగంతో వెళ్ళడానికి అనుకూలంగా ఉండవు. ఎప్పుడు రోడ్డుపై ఏ కుక్క వస్తుందో, మేకలగుంపు వస్తుందో, పశువులు వస్తాయో తెలియని పరిస్థితి. రోడ్లకు ఆనుకునే ఊర్లు ఉంటాయి. హైవేలపై అప్పుడప్పుడూ చిన్నపిల్లలు ఆడుతుంటారు. ఇలాంటి పరిస్థితిలో నూటనలభైపై వెలుతున్న బస్సుకు సడన్‌గా ఏదైనా అడ్డువస్తే కంట్రోల్ చేయడం కష్టం. బహుషా వోల్వోలకు మన రోడ్లపై స్పీడ్ లాక్ చేయాల్సిన అవసరం ఉందేమో.

రెండోప్రమాదం జరిగిన ఔటర్ రింగ్ రోడ్డు ఫారిన్ రోడ్లకు ఏమాత్రం తీసిపోనిది. నాలుగు లేన్లతో కూడిన ఈ చక్కటిరోడ్డుపై స్పీడుగా వెల్లినా ప్రమాదాలు జరగగూడదు. కానీ అంత వేగంతో వెల్లడానికి అవసరమయిన రక్షణ వ్యవస్థ, సిగ్నలింగ్ సిస్టం లేని వాహనాలు కూడా ఈరోడ్డుపై వెలతాయి. ఇలాంటి వాహనాలు కూడా రోడ్డు బాగుంది కదా అని అంతే వేగంతో వెలతాయి. రోడ్డు మధ్యన ఆగిన ట్రక్కువాడు ఎమర్జెన్సీ బ్లింకర్ వేయకపోవడం ఒక తప్పు అయితే డీసీఎం అదుపు చేయలేనంత వేగంగా రావడం మరో తప్పు.

ఏతా వాతా తేలేదేమంటే వేగంగా వెళ్ళడానికి మంచి వాహనం, మంచి రోడ్డు రెండూ అవసరం. ఏదో ఒకటి ఉంది కదా అని స్పీడు పెంచితే పరిస్థితి ఇదే అవుతుంది. 

Tuesday 22 October 2013

మూడువేల శిశువుల ప్రాణాలు తీసిన సమైక్యాంధ్ర ఆందోళనలు


From Telegraph  India

http://www.telegraphindia.com/1131009/jsp/nation/story_17440815.jsp#.UmX8tflHJXU

Baby deaths surge amid Andhra blackout

Hyderabad, Oct. 8: Over 4,000 babies have died in Andhra Pradesh’s hospitals, about half of them newborns in non-functional incubators, since an indefinite power employees’ strike began on Sunday morning, doctors’ associations said.
No figures were available from a state government virtually paralysed by striking employees and truant ministers from Seemandhra since July 31. Doctors’ bodies gave rough estimates of infant deaths by collating district-wise inputs from hospitals, but none were willing to be quoted.
In normal times, the state’s hospitals witness an average of 300-400 baby deaths daily —which means at least an additional 1,000 babies have died per day since the strike began.
“I appeal to protesters to let the hospitals function so that these little children don’t suffer,” said Prabhakar Reddy, father of a newborn, at Hyderabad’s Nilofuer Hospital.
Doctors and NGOs said the power crisis accounted for most of the additional deaths, and that the acute staff shortage at the hospitals because of the two-month-old anti-statehood strike was also to blame.
An Indian Medical Association spokesperson said several coastal and tribal-dominated districts were witnessing an outbreak of diseases among children aged one to three.
“Viral fever, dengue and chicken pox have taken a heavy toll in Visakhapatnam and Rajahmundry,” he said.
Sources in an association of government doctors said 520 babies had died in five Hyderabad hospitals — including a private clinic — since Sunday.
State health minister and anti-statehood agitator Kondru Murali Mohan, who had two months ago tendered his resignation, which has not been accepted, said: “It is unfair to blame the deaths on the agitation — baby deaths in government hospitals are common.”
But even he appeared stunned when told about the figures. Mohan has not been attending office these past 10 weeks.
One Hyderabad hospital’s authorities said they were spending Rs 22,000 per day on generators and had back-up left for just a few hours. With ACs not running, burns patients’ sufferings have increased.
Doctors have cancelled surgeries. “Medicines, blood in the blood bank, and blood-products are deteriorating during the long power cuts,” said Dr Suresh Goud of the AP Private Hospitals and Nursing Homes Association.

Thursday 17 October 2013

సద్దుమణిగిన సమైక్యాంధ్ర, జాడలేని సీమాంద్ర్హ హక్కుల చర్చ



పెట్టుడు ఉద్యమాలు ఎన్నాల్లని ఉంటాయి? పెట్టుబడి పెట్టేవాడు మానగానే అవీ మాయమవుతాయి. సమైక్యాంధ్ర ఆందోళనల పరిస్థితీ ప్రస్థుతం అదే. ఎక్కడా ధర్ణాలు లేవు, బహిరంగ సభలు లేవు, లక్ష(?)ఘళఘోషలు లేవు. ఉద్యోగస్థులందరూ మెల్లమెల్లగా డ్యూటీల్లో చేరుతున్నారు. ప్రభుత్వంలో విలీనం హామీతో ఆర్టీసీ బస్సులు కూడా నడుస్తున్నాయి.

మొన్నటిదాకా ఈనాడు పేపరు వాడు ఎగిసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం అంటూ ఏదో బ్యానరు పెట్టి గడ్డి తినేవాళ్ళ ఫోటోలు, ఈకలు పీకేవారిఫోటోలూ పెట్టేవాడు.ఇప్పుడదీ బందయింది. సీమాంధ్ర ఛానెళ్ళు పోటీలు పడి చిన్న చిన్న ఆందోళనల క్లిప్పింగులు రోజంతా రిపీట్ చేసేవారు. వారూ మానేశారు.

పోటీలు పడి నిరాహారదీక్షలు జేసిన పెద్దలు ఇంట్లో గూర్చుని ఇప్పుడు నీది దొంగ దీక్ష అంటే నీది దొంగ దీక్ష అని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇద్దరివీ దొంగదీక్షలని తెలిసిన ప్రజలు ఇవి అసలు పట్టించుకోవడం లేదు.

నేను రాజీనామా చేశానంటే నేనూ చేశానని ప్రకటించుకున్న ఎంపీలూ, మంత్రులూ ఇంతవరకు వారి రాజీనామా పత్రాలు ఎందుకు ఆమోదించబడలేదో చెప్పడం లేదు.

బడిపిల్లలు ఎండలో కూర్చున్న ఫోటోలను ఫేస్బుక్కుల్లో షేర్ చేసుకుని సోషల్ నెట్‌వర్కర్లు మురిసిపోయేవారు కూడా ఇప్పుడు కొత్తఫోటోలు లేక మానేశారు.

అయినా ఇంకా సీమాంధ్ర నేతలు మాత్రం ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, తెలంగాణనాపుతారు అని ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప వాస్తవాలను ఒప్పుకుని ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాలపై చర్చించడం లేదు. సీమాంధ్రకు రాజధాని విషయంపై గానీ, నీటివాటాల విషయంపై గానీ, ఉద్యోగుల హక్కులవిషయంపై గానీ చర్చలేదు. సీమాంధ్ర నేటల ఈప్రవర్తన వలన నష్టపోతుంది సీమాంధ్ర సామాన్యుడే.


Thursday 10 October 2013

ఉద్యోగసంఘ నాయకులతో సీఎం చర్చలు



సీమాంధ్రలో సమైక్యాంధ్రకు మద్దుతుగా సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె గురించి ఉద్యోగసంఘాల నాయకులతో సీఎం చర్చలు జరుగుతున్నాయి.

సీఎం: ఏమయ్యా! సమ్మె బాగా చేస్తున్నారా?

నాయకుడు: ఆ, ఏం చేయడమో సార్, రెండు నెలలనుంచీ జీతాలు లెవని ఉద్యోగులు మమ్మల్ని తిడుతున్నారు.

సీఎం: అలాగంటే ఎలాగ, ఎలాగో సమ్మెను నడిపించండని మీ నాయకులందరికీ డబ్బులు బాగానే ముట్టజెప్పాను గదా?

నాయకుడు: మాకిచ్చారు, ఉద్యోగులందరికీ ఇవ్వలేదు కదా?

సీఎం: మీరే ఎలాగో మేనేజ్ చెయ్యాలి. మీక్కావలంటే ఇంకాస్త డబ్బిస్తాను.

నాయకుడు: ఇంకా ఎన్నిరోజులు ఇలా చేయమంటారు సార్, మేము సమ్మె విరమిద్దామనుకుంటున్నాం.

సీఎం: విరమిస్తారా? ఇంత డబ్బు మీకిస్తే ఇప్పుడలా అంటే ఎలా? నాకదంత తెలియదు, మీరు సమ్మె కొనసాగించాల్సిందే.

నాయకుడు: మీరు ధర్ణాలకూ, సభలకు ఇచ్చిన డబ్బు అయిపోతుంది, ఇంకాస్త కావాలి.

సీఎం: సరే ఎంత కావాలో గుమస్తానడిగి తీసుకుపొండి. మన మీడియా బాగానే కవర్ చేస్తున్నారుగా మీ ఉద్యమాన్ని?

నాయకుడు: మీడియా వాళ్ళు కూడా డబ్బడుగుతున్నారు.

సీఎం: మీడియా వాళ్ళకు దబ్బెందుకు? సమైక్యాంధ్ర వలన ఆళ్ళకూ లాభమే కద. సరే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాలే.

నాయకుడు: సరే సార్, మరి బయటికి వెళ్ళినాక ప్రెస్ వారికి ఏం చెప్పమంటారు?

సీఎం: సమ్మె విరమణకు సీఎం అభ్యర్థించారనీ, సమైక్యాంధ్ర ప్రకటన రానిదే ససేమిరా అన్నామనీ చెప్పండి.

నాయకుడు: అలాగే. మరి వస్తాం సార్.

సీఎం: మంచిది. 

Wednesday 9 October 2013

తెలుగుజాతి పరువు తీస్తున్న సీమాంధ్ర నేతలు



తెలుగుజాతి ఆత్మ గౌరవం, తెలుగుజాతి ఐక్యత అంటూ బీరాలు పోయే సీమాంధ్ర నేతలు ఢిల్లీ సాక్షిగా తెలుగుజాతి పరువుతీస్తున్నారు. తెలుగు జాతిని ఏలుతున్న నేతలు ఇంత స్వార్ధపరులు, ఆత్మ వంచకులా అని ప్రపంచం విస్తుపోయేలా చేస్తున్నారు. తెలుగు దేశం, వైకాప, కాంగ్రేస్ అంటూ తేడా లేకుండా అందరూ తెలుగు జాతి పరువు తీస్తున్నారు.
 
తెలుగుజాతి ఆత్మగౌరవం మా నినాదం అంటూ చెప్పుకునే తెలుగుదేశం నేత ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేస్తున్నాడు. అయితే ఈయన ఎందుకు దీక్ష చేస్తున్నాడు, దేనికోసం దీక్ష చేస్తున్నాడు, ఇతను రాష్ట్రాన్ని విభజించమంటున్నాడా వద్దంటున్నాడా, అసలు ఈయన పార్టీ విధానమేంటి అని తెలియక జాతీయ మీడియా జుట్టు పీక్కొంతుంది. పది నిమిషాలు ఒకే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడిగి కూడా ఐబీఎన్ రాజ్‌దీప్ మాత్రం తెలంగాణ కావాలా, వద్దా అనే ప్రశ్నకు బాబు దగ్గరనుండి సమాధానం రాబట్టలేకపోయాడు. తాము విభజనకు అనుకూలం అని కేంద్రానికి లేఖనిచ్చి, తొందరగా ఈవిషయంపై తేల్చండి అంటూ కేంద్రాన్ని నిలదీసిన చంద్రబాబు, నిర్ణయం వచ్చిన తరువాతిరోజు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పిన చంద్రబాబు ఎందుకు ఢిల్లీకి వచ్చి దీక్ష చేస్తున్నాడో అర్ధం కాక జాతీయమీడియా విస్తుపోతుంది. చంద్రబాబు అవకాశవాదాం దేశం మొత్తానికి తెలిసొచ్చింది.

మరో సీమాంధ్ర నేత జగన్‌బాబు మొన్నటిదాకా లక్షకోట్ల అవినీతి కేసులో జైళ్ళో ఊచలు లెక్కబెడుతున్నాడు.  అవినీతిని ఇలాక్కూడా చేయవచ్చని ప్రపంచానికి చూపించి, తన ధన దాహానికి ఐయేఎస్ ఆఫీసర్లను, మంత్రులను జైలుపాలు చేసిన జగన్‌బాబు "ఆమరణ"  నిరాహారదీక్ష చేస్తున్నాడు. ఒక నెలరోజులక్రితం జైళ్ళో ఉన్నప్పుడు కూడా ఇదే జగన్ "ఆమరణ" నిరాహార దీక్ష చేశాడు. ఎవరైనా ఆమరణ నిరాహార దీక్ష ఒక్కసారి చేస్తారు. నెలకొకసారి చేస్తే అది ఆమరణ నిరాహారదీక్ష ఎలా అవుతుందో తెలియక జనం జుట్టు పీక్కుంటున్నారు. ఈజగన్‌బాబు దీక్ష ఎందుకో కూడా ఎవరికీ అర్ధంకాని పరిస్థితి. మొదట నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే, నేను అడ్డూ కాదూ, నిలువూ కాదు అన్నవాడు ఆతరువాత సమన్యాయం చెయ్యాలంటూ ఒకసారి దీక్ష చేపట్టాడు. ఆ సమన్యాయం అంటే ఏమిటో ఆయనకే తెలియాలి. మళ్ళీ నెల తిరక్కుండానే సమన్యాయం నినాదాన్ని పక్కన పెట్టి సమైక్యాంధ్రకోసం దీక్ష చేస్తున్నాడు. ఇక ఈయన ఎండీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే.....అబ్బో మొసళ్ళు కూడా సిగ్గుపడుతాయి.

ఇక కాంగ్రేస్ నేతలు సరేసరి. అధిష్టానం ఏనిర్ణయం తీసుకున్నా కట్టుబడే ఉంటామని చెప్పినవారు ఇప్పుడు ఒకసారి అధిష్టానం నిర్ణయం తీసుకున్నతరువాత అడ్డుపడడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఆధిపత్యపోరులో ఒకరి ఆస్థులు మరొకరు లూటీలు చేపిస్తున్నారు.

ఈమొత్తం ఎపిసోడ్‌లో తెలుగుజాతిని ఏలుతున్న నాయకుల స్వార్ధబుద్ధి, సిగ్గులేనితనం ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు అర్ధం అయింది. తెలుగుజాతిలో తెలంగాణ ఎలా అణచివేతకు గురవుతుందో, ఆణచివేతను తొలగించేప్రయత్నాన్ని దోపిడీవర్గం ఎలా అడ్డుకుంటుందో అందరికీ తెలిసింది. పోయింది మాత్రం తెలుగుజాతి పరువు. 

తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ గర్వంగా తలెత్తుకోగలదు గానీ ఒక రాష్ట్రంగా ఉండి ఒక వర్గం దోపిడీ ప్రపంచానికి తెలిసిపోవడం వల్ల జాతి పరువు మంటగలిసింది. 

Tuesday 8 October 2013

దొంగలముఠాలో చీలికలు

దొంగలముఠాలో చీలికలొస్తే ఏం చేస్తారు? ఒకరి దొంగతనాలను మరొకరు బయటపెట్టుకుంటారు. ప్రస్తుతం సీమాంధ్ర పెద్దల పరిస్థితి కూడా అలాగే ఉంది.

ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి తనకు అనుకూలుడు, ఒకే కులం, ప్రాంతం వాడు తాను చెప్పినట్టు వింటాడు అని చెప్పి అర్హత లేకున్నా దినేష్‌రెడ్డిని అందళం ఎక్కించాడు. అప్పటికి దినేష్‌రెడ్డి కంటే సీనియర్లు, ఎక్కువ కఠినతర భాద్యతలు నెరవేర్చి ర్యాంకింగ్‌లో ముందున్నవారు తెలంగాణకు చెందిన వారు ఇద్దరు ఉన్నారు. ఒకరు గౌతంకుమార్, మరొకరు ఉమేశ్‌కుమార్. అయినా అన్యాయంగా నిబంధనలను తుంగలో తొక్కి కిరణ్‌రెడ్డికి డీజీపీ పదవి ఇచ్చాడు. దానివలన సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వంపై అక్షింతలు వేసింది. ఇంతా చేసింది ఎందుకు? తనకు అనుకూలుడు, తన మాట వినేవాడూ పోలీస్ బాస్ అయితే తనకు అడ్డు ఉండదు, అంతా తన ఇష్టప్రకారం జరుగుతుందీ అని.

చివరికి జరిగిందేమిటంటే తన పదవి ఎక్స్‌టెన్షన్ దొరకలేదని దినేశ్‌రెడ్డి ముఖ్యమంత్రిపై విరుచుకు పడ్డాడు. ముఖ్యమంత్రి సంగతులు అన్నీ బయట పెట్టాడు.

మచ్చుకు కొన్ని: ముఖ్యమంత్రి తమ్ముడి భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఏపీఎంజీవోల సభకు వద్దన్నా పర్మిషన్ ఇప్పించడం,  తెలంగాణ వస్తే నక్సలైట్ సమస్య పెరుగుతుందని అబద్దాలు చెప్పమనడం. ఇవన్నీ బయట పెట్టినందుకు దినేశ్‌రెడ్డిని ఎవరూ నిజాయితీపరుడనరు గానీ ముఖ్యమంత్రి బండారం మాత్రం బయట పడింది. ముఖ్యమంత్రీ, మాజీ డీజీపీ ఏవిధంగా తోడుదొంగలయిందీ, చివర్లో ఏవిధంగా వాటాలు కుదరక విభేధాలు వచ్చిందీ అందరికీ తెలిసింది.

ఈవ్యవహారం బయటపెట్టిన మరో విషయం ఇప్పటివరకూ సీమాంధ్ర ముఖ్యమంత్రులు తమకు కొమ్ముగాసే సీమాంధ్రకు చెందినవారికి ఏవిధంగా అక్రమంగా పదవులు కట్టబెడుతుందీ, ఏవిధంగా తెలంగాణా వారికి అన్యాయం చేస్తుందీ. 

Monday 7 October 2013

ఆధిపత్య పోరు - నిరశన ముసుగులో దాడులు



రాష్ట్ర విభజన గురించిన ప్రకటన తరువాత సీమాంధ్రలో మొదలయిన ఉద్యమం విభజన ఆపడానికి కాక సీమాంధ్రలో ఆధిపత్య పోటీ లాగా తయారయింది. ఈపోటీలో ఇప్పటిదాకా ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోగా ఇప్పుడు పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. అది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే విజయనగరంలో నిన్నటినుంచీ కర్ఫ్యూ విధించగా మరికొందరు సందట్లో సడేమియాలు దుకాణాలపై పడి దోచుకుంటున్నారు.

తెలంగాణ ఉద్యమం నాలుగేళ్ళనుంచీ తీవ్రస్థాయిలో జరుగుతున్నా ఉద్యమం ఎప్పుడూ శాంతియుతంగానే జరిగింది. ఎప్పుడైనా బస్సులపై రాళ్ళు రువ్వడం లాంటి చిన్నచిన్న ఘటనలు జరిగినా అదికూడా పోలీసులు ఒవర్‌యాక్షన్ చేసి అనవర నిర్భందాలు, లాఠీఛార్జీలతో ప్రేరేపించినప్పుడే జరిగాయి. అయినా ఎప్పుడూ తెలంగాణ ఉద్యమాన్ని ఆడిపోసుకోవడమే తమ పనిగా పెట్టుకున్న సమైక్యవాదులు ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక దాక్కుంటున్నారు.

సీమాంధ్రలో రాజకీయపార్టీలన్ని ఇంతకుముందు తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదు, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అని చెప్పినవారే. విభజన ప్రకటన తరువాత ఈపార్టీలన్నే విభజనకు కారణం తమ ప్రత్యర్ధి పార్టీయే నని వాదనలు మొదలుపెట్టారు. రాజకీయ విమర్శలు, పోటాపోటీ దీక్షలు ఇన్నాల్లు సాగితే ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. తెదేపా వర్గీయులు వైకాప నాయకుల ఇళ్ళపై, వైకాప వర్గీయులు తెదేపా నేతల ఇళ్ళపై దాడులు, కాంగ్రేస్లో ఒక వర్గం వారు మరో వర్గంపై దాడులు చేసుకుంటూ సీమాంధ్రను భ్రష్టుపట్టిస్తున్నారు.

విజయనగరంలో బొత్సా ఇల్లపై దాడులకు ప్రేరేపిస్తుంది స్వయానా ముఖ్యమంత్రేనని ఆరోపణలు వస్తున్నాయి. విజయనగరంలో బొత్సా ఆస్థులతోపాటు ఒక పది ప్రైవేటు దుకాణాలను తగలబెట్టి దోచుకున్నారు. నిన్న ఒక వైన్‌షాపును పగలగొట్టి కొందరు మందుప్రియులు వైన్ సీసాలు దోచుకుపోయారు. బొత్సాతోపాటు హర్షకుమార్, డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆస్థులపై కూడా దాడులు జరుగుతున్నాయి. వీటివెనుక ముఖ్యమంత్రి, లగడపాటిల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సీమాంధ్ర మీడియా మాత్రం యధాప్రకారం  లూటీలను కూడా సమైక్య ఉద్యమం అకౌంట్లో కలిపేసి ప్రజలకు అక్కద ఉద్యమం జరుగుతున్నట్లు భ్రమలు కల్ప్పిస్తున్నాయి. 

Thursday 3 October 2013

నాటికీ నేటికీ తేడా!



డిసెంబరు 9 2009రోజు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న యూపీయే ప్రభుత్వం మానాయకుల తడాఖాతో  రెండువారాల్లో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది, ఈసారికూడా అలాగే తీసుకోదా అని కొందరు సమైక్యవాదులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వారలా చూస్తుండగానే ఈసారి చకచకా తెలంగాణ ఏర్పాటు ముందుకు సాగుతుంది. ఇంతకీ నాటికీ నేటికీ తేడా ఏమిటి అని చూస్తే చాలా కారణాలు కనిపిస్తున్నాయి.

1. ఒకే డ్రామా మళ్ళీ మళ్ళీ చేస్తే రక్తి కట్టదు.

2. అప్పుడు ఎన్నికలు అంత త్వరలో లేవు కనుక నేతలు రాజకీయప్రయోజనాలు పక్కనపెట్టి తమ ఆర్ధిక, భూదాహ ప్రయోజనాలకోసం తెలంగాణను అడ్డుకోవడం కోసం అన్నిపార్టీలూ కలిసి పనిచేశారు. ఈసారి ఇంకోసంవత్సరంలొ ఎన్నికలుండగా అలా చేయడం కష్టం. పైగా పార్టీలు తామే సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామంటే తామేనని పోటీపడుతున్నాయి.

3. అప్పుడు కేంద్రం ముందే జరిగే పరిణామాలను ఊహించలేదు, ఈసారి ఊహించి అందుకు ప్రిపేర్ అయి ఉంది.

4. తెలంగాణ ఇస్తేనే అన్ని రాజకీయపార్టీలకూ లాభం. ప్రతిపక్షాలు కూడా తాము చేసే ఆందోళనలు విభజన ఆపడానికి కాక సీమాంధ్రకు ఎలా ఛాంపియన్ అవాలి అనే దానిపైనే దృష్టి పెట్టాయి.

సీమాంధ్రకు బెంగుళూరును రాజధాని చేయడం ఎలా?



మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయేటప్పుడు సీమాంధ్రులు చెన్నై మాకే కావలని అడిగారు. దానికోసం పాపం పొట్టి శ్రీరాములును చంపుకున్నా కూడా చెన్నై మాత్రం దక్కలేదు. కనీసం మాకు దక్కంది తమిళులకు కూడా దక్కొద్దు, చెన్నపురిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి అని డిమాండ్ చేసినా కేంద్రం సీమాంధ్ర నేతల మాటలు పట్టించుకోలేదు. ఆతరువాత కర్నూలు డేరాలక్రింద చెమటలు కారుస్తున్నప్పుడు హైదరాబాదు మీద మనసు పడి లాబీయింగ్ ద్వారా మొత్తానికి తెలంగాణను కలుపుకుని హైదరాబాదును రాజధానిగా పొందారు.
  
చివరికి కేంద్రం పుణ్యమా అని ఇప్పుడు తెలంగాణ హైదరాబాదును దక్కించుకుంటుంటే సీమాంధ్రకి మాత్రం ఇంకొక రాజధాని అవసరం అయింది. ఇప్పటికైనా తమకున్న నగరాల్లో దేన్నైనా రాజధానిగా చేసుకుని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది గానీ సీమాంధ్ర నేతలకు మెట్రో నగరాలు తప్ప చిన్న నగరాలు సరిపోవు కదా!  చెన్నై, హైదరాబాదు తరువాత దక్షిన భారతంలో మిగిలింది బెంగుళూరు ఒక్కటే. బెంగుళూరును సీమాంధ్రకు రాజధానిని చేయగలిగితే ఎలా ఉంటుంది? 

నిజానికి సీమాంధ్ర నేతలు పూనుకుంటే బెంగుళూరును రాజధానిగా పొందడం పెద్ద కష్టం కాదు. హైదరాబాదు కంటే కూడా సీమాంధ్రులకు బెంగుళూరు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. హైదరాబాదు అయితే ఉర్దూ రాక కష్టాలు, అదే బెంగుళూరు అయితే అక్కడివారికి తెలుగు బాగా వస్తుంది, అటుపక్క తెలుగు వారికి కన్నడ కూడా వస్తుంది. పైగా సీమాంధ్ర్ సరిహద్దు నుంచి చూస్తే హైదరాబాద్ కన్నా బెంగుళూరే దగ్గర.  

బెంగుళూరులో ఇప్పటికే తెలుగు వారు అనేక మంది ఉండడంతోపాటు సీమాంధ్రుల పెట్టుబడులు (ముఖ్యంగా మన జగన్ పెట్టుబడులు) కూడా బెంగుళూరులో ఉన్నాయి. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాజెక్టులకు నీళ్ళెక్కడినుంచి వస్తాయని కొందరు బాధపడుతున్నారు. కర్ణాటక ఒకవేల సీమాంధ్రతో కలిస్తే క్రిష్ణా, తుంగభద్రా ఎగువ ప్రాంతాలు సీమాంధ్ర నేతల అదుపులోనే ఉంటాయి కాబట్టి "నీటి యుద్ధాలు" జరగవు,  నీటి దోపిడీలే జరుగుతాయి. ఇన్ని లాభాలున్నప్పుడు సీమాంధ్ర కర్ణాటకతో కలిస్తే తప్పేముంది. 

ఇంతకూ ఇది ఎలా సాధ్యమంటారా! లాబీయింగు చేసి కేంద్రాన్నీ, కన్నడ నేతలను ఒప్పించగలిగారంటే అదేమంత పెద్దకష్టం కాదు. ఒకవేళ కన్నడిగులకేమయినా అనుమానాలొస్తే మీకేంకావాలంటే అవి ఇస్తామని ఒక పెద్దమనుషుల ఒప్పందాన్ని పడేస్తే సరి. ఒకసారి కలిసాక దాన్ని అమలుపరుస్తున్నామా లేదా అని ఎవడు చూడొచ్చాడు? 

మరో పాతికేళ్ళయినాక కన్నడిగులు నిద్రలేచి మాకు మీతో పడదు, విడిపోదామంటే అప్పుడు విడిపోదామని మీరనుకుంటున్నారు  కాబట్టి మీరు బెంగుళూరును వదిలేసుకోవాల్సిందేనని కిరికిరి పెట్టొచ్చు. గట్టిగా పోట్లాడాలేగానీ అప్పుడు మరో మెట్రో సిటీ సీమాంధ్ర సొంతం అయిపోదూ? 

గమనిక: అంతా బాగానే కనిపిస్తున్నా సీమాంధ్ర, కర్ణాటక కలిసిన రాష్ట్రంలో కన్నడ ఎమ్మెల్యేలే ఎక్కువమంది ఉంటారు కనుక అధికారం గుప్పిట్లో ఉంచుకోవడం సీమాంధ్ర నేతలకంత సులభం కాదు. దీనికి పరిష్కారం కూడా ఆలోచించాలి.  

Saturday 28 September 2013

ఎందుకూ పనికిరాని బ్యాటింగ్



ఒన్‌డే క్రికెట్‌లో భారీ స్కోరును చేజింగ్ ఛేస్తున్న జట్టులో ఒక్కరొక్కరుగా అందరూ అవుటవుతూ, లక్ష్యం కనుచూపుమేరలో కూడా లేకుండా మిగిలిన బంతులూ, చెయ్యాల్సిన పరుగుల సమీకరణం అసంభవంగా ఉన్న సమయంలో ఆఖరున మిగిలిన బాట్స్‌మన్ అప్పుడప్పుడూ పిచ్చిపట్టినట్టు బ్యాటింగ్ చేసి ఫోర్లూ, సిక్సర్లూ కొడతాడు. బౌలర్లు కూడా ఎలాగూ అప్పటికే గెలిచిపోయామని తెలుసుకాబట్టి బాట్స్‌మన్ కొడుతున్నా పెద్దగా  పట్టించుకోక నవ్వుతుంటారు. ఇలాంటి బ్యాటింగ్ గెలవడానికి ఏకోశానా పనికిరాదు గానీ బాట్స్‌మన్ వ్యక్తిగత రికార్డులను పెంచడానికీ,  బాట్స్‌మన్ వ్యక్తిగత ప్రతిష్ట పెరగడం తద్వారా మరికొన్నాల్లు జట్టులో స్థానం నిలుపుకోవడానికీ మాత్రం పనికొస్తాయి. ఆబాట్స్‌మన్ జట్టును గెలిపించలేకపోయినా ఓడిన జట్టులో ఆరోజుకు ఛాంపియన్‌గా గుర్తుండిపోతాడు.

ఆఖరు బాట్స్‌మన్ అలాగ పరుగులు తీస్తుంటే చూసే జనం "అరె, ఇప్పటిదాకా ఇలాగే ఆడుంటే బాగుండు కదా, గెలిచేవాళ్ళం" అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇలా ఆఖరు నిమిషంలో చెలరేగే బాట్స్‌మన్ ఎవరూ కూడా లక్ష్యం అందుబాటులో ఉన్నప్పుడు అలా ఆడరు. కారణం లక్ష్యం చేయి దాటి అసాధ్యమని తెలిసినతరువాత బాట్స్‌మన్ పై వత్తిడి ఉండదు. ఔటయినా పోయేదేమీలేదు. అందుకే కళ్ళుమూసుకుని కొడుతూ ఉంటారు. అదే ఆట ముందు ఆడాలంటే ఔటయితే జట్టు మేనేజ్‌మెంట్ తిడుతుందేమోనన్న భయం మనసులో ఉంటుంది కాబట్టి ఆడరు.

ఇప్పుడు సీమాంధ్రలో కాంగ్రేస్, వైకాప, తెదేపా నాయకులందరికీ కూడా తెలంగాణ విభజన ఎలాగు జరిగిపోతుంది, ఆపడం తమవలన సాధ్యం కాదని తెలుసు. కానీ తమ పార్టీ ప్రతిష్ఠ పెంచుకోవడానికి, సీమాంధ్ర జట్టుకు ఛాంపియన్‌గా మిగలడానికి నానా తంటాలు పడుతూ యాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రేస్లో స్టార్ బాట్స్‌మన్, సీమాంధ్ర (సమైక్యాంధ్ర) జాక్‌లకు ఛైర్మన్ అని చెప్పబడుతున్న  ముఖ్యమంత్రి ఛాంపియన్‌గా మిగలడానికి తనవంతు తంటాలు పడ్డాడు.

ఎలాగూ విభజన జరిగేది తధ్యం, నేనూ ఒకసారి సమైక్యాంధ్రకోసం గొంతు వినిపిస్తే రేపు విభజన తరువాత నాకు రాజకీయ మనుగడ ఉంటుంది అని చేసే ప్రయత్నమే తప్ప ఇది మరోటి కాదు. ఎలాగూ విభజన తరువాత కనీసం సీమాంధ్రకు కూడా ముఖ్యమంత్రిని కాలేనని తెలుసు గాబట్టి ఇప్పుడే కాస్త రెచ్చగొట్టుడు మాటలు మాట్లాడితే అలాగయినా జనానికి గుర్తుంటానని ఈముఖ్యమంత్రి ప్రయాస. అయితే సొంతబలం ఏమాత్రం లేక సర్పంచి పదవికి కూడా సొంతంగా గెలవలేని ఈసీల్డ్‌కవర్ ముఖ్యమంత్రికి ఈప్రయత్నం మేలు చేయదు కదా బెడిసికొట్టి విభజన తరువాత దిక్కులేకుండాపోవడం ఖాయం.

అంతసేపు కష్టపడి, ఎంతో ప్రిపేర్ అయ్యి చేసిన ముఖ్యమంత్రి ప్రసంగంలో ఒక్క వాస్తవం కూడా లేకపోగా నవ్వుకునేలాగున్నది. ముఖ్యమంత్రి తన మాటలద్వారా తనకు నాగార్జునసాగర్ ఎప్పుడు కట్టిందీ కూడా తెలియదని నిరూపించుకున్నాడు. పైగా దేశాలమధ్య నీటి వాటాలు పంచుకుంటుంటే రాష్ట్రాలమధ్య పంపకం అసాధ్యమని తేల్చేయడం ముఖ్యమంత్రి అమాయకత్వాన్ని తెలియజేస్తుంది.   

తన మాటలద్వారా ముఖ్యమంత్రి తన అవగాహనా రాహిత్యాన్ని చాటుకుంటున్నాడు. పోన్లే..కుర్చీలో ఉండేది మరో రెండు మూడూ రోజులేగదా. కాకపోతే ఈముఖ్యమంత్రి మాటలు చూసి తమ స్టార్‌బాట్స్‌మన్ చెలరేగాడని పండగ చేసుకుంటున్న సీమాంధ్ర ఆందోళనకారులు ముఖ్యమంత్రి పోయి రాష్ట్రపతి పాలన వచ్చినా, మరో ముఖ్యమంత్రి వచ్చినా తమ బతుకు బష్టాండే నని తెలుసుకుంటే మంచిది. 

Friday 27 September 2013

సమైక్యవాద కామెడీలు

ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయక ఫాక్షనిజం పేరుతో తిన్నదరగక చంపుకొనుడూ, కులగజ్జితో హత్యాకాండలు జేసే వర్గం ఒక్కసారి ఆందోళనలు చెయ్యాల్సి వచ్చింది. అది కూడా తమ కదుపుకోసం కాకుండా తాము కొమ్ముగాసే బడా నాయకుల ఆస్థులకోసం, టీవీ మీడియా ప్రదర్శనకోసం చేసే ఆందోళనలు ఎలాగుంటాయి? పాపం ముఖ్యమంత్రీ,డిజీపీ, అన్ని రాజకీయపార్టీలూ కలిసి ఎంతగాలికొట్టడానికి ప్రయత్నించినా కామెడీలు తప్ప ఎక్కడా ఉద్యమాలు కానరావు. ఇవీ సీమాంధ్రలో ప్రస్తుతం సమైక్యాంధ్రకోసం జరిగే కామెడీలు.   

మరి ఇక్కడ నిజంగా ఉద్యమాలు జరగలేదా అంటే గొప్ప ఉద్యమాలు జరిగాయి. కాకరాపల్లి, సోంపేట థర్మల్ కేంద్రాలకు వ్యతిరేకంగా, కారంచేడు,చుండూరు, లక్షింపేట దమనకాండలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు మచ్చుకు కొన్ని ఉదాహరణలు. కానీ పాపం ఆఉద్యమాలు సీమాంధ్ర ఛానెల్లకూ ఎన్నడూ పట్టలేదు గానీ ఇప్పుడు ఈపసలేని సమైక్యాంధ్ర డ్రామాలను మాత్రం రోజంతా ఒకటే ఊదరగొడుతున్నరు.  



తెలంగాణ వస్తే వీల్లకు కట్టుకోడానికి బట్టలు కూడా మిగలక ఆదిమ మానవుల్లాగా ఆకులు కప్పుకుంటారట.
  

తెలంగాణ వస్తే అడుక్కోవడమే వీళ్ళ బతుకట. మొన్నటిదాకా తాము లేకపోతే తెలంగాణ బతుకలేదని అన్నది వీళ్ళే.
తెలంగాణ ప్రజలు రాక్షసులట, సీమాంధ్ర ప్రజలు దేవుళ్ళట. మరి రాక్షసులతోటి ఎందుకు కలిసి ఉండడం? 



అర్ధం లేని ఆందోళనలకు జనాలు దొరక్క ఎప్పుడూ ముక్కుపచ్చలారని బడిపిల్లలనే ఎండల్లో నిలబెడతారు.


ఉద్యమమంటే ఒక ఫ్యాషన్ షో, ఒక కబడ్డీ, ఒక రికార్డ్ డాన్స్.


ఒకడు మీద పెట్రోలు పోసుకుని బెదిరిస్తుంటే మిగతావారు నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు.

తెలంగాణ అడిగితే నరుకుతారట ఈమగువలు.

ఇంకా కొందరు ఈకలు పీకుతూ, మట్టి తింటూ కూడా వినూత్నంగా ( ఈనాడు భాషలో) తమ నిరసన తెలిపారు. 

Thursday 26 September 2013

ఒక ప్రాంత సీఎం గా పనిచేస్తున్న కిరణ్ - దిగ్విజయ్ వ్యాఖ్య

-పక్షపాతం పనికిరాదు.. అన్ని ప్రాంతాల ప్రజలు 
-ఎన్నుకుంటే  సీఎం అయ్యారు: దిగ్విజయ్ వ్యాఖ్య
-కేబినెట్ నోట్ తయారవుతోంది.. కేంద్ర మంత్రివర్గం చూశాక అసెంబ్లీకి పంపిస్తాం
-ఎపీ ఎన్జీవోల సమ్మెతో సామాన్యులకు ఇబ్బందులే .. వేడుకుంటున్నా .. విరమించండి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25 (టీ మీడియా) :రాష్ట్రానికి ముఖ్యమంవూతిగా ఉండి ఒక ప్రాంతంపై పక్షపాతం ప్రదర్శించరాదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఎన్నుకుం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని గుర్తుచేశారు. 
diggirajaకాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో బుధవారం రాష్ట్ర రాజకీయాలపై సమావేశం అనంతరం తనను కలిసిన విలేకరులతో దిగ్విజయ్ మాట్లాడారు. తెలంగాణపై కేబినెట్ నోట్, సీఎం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న తీరు, ఏపీఎన్జీవోల సమ్మె, ఎంపీల రాజీనామా తదితర అంశాలపై ఆయన ఘాటుగా స్పందించారు.

అందరూ ఎన్నుకున్న సీఎం..
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికే ముఖ్యమంవూతిగా వ్యవహరించరాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారూ ఎన్నుకుం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి అన్ని ప్రాంతాల పట్ల ఆయన సమబాధ్యతతో వ్యవహరించాలి’ అని దిగ్విజయ్ హితవు చెప్పారు. ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని చట్టసభల్లో అడ్డుకుంటే రాష్ట్రపతి మీద ఒత్తిడి చేసి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోగల శక్తి తనకు ఉందని కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రకటనపై ఆయనఈ విధంగా స్పందించారు. మంగళవారం సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని ఓడిస్తే తాను వ్యక్తిగతంగా రాష్ట్రపతిని కలిసి బిల్లును తిరస్కరించాలని కోరతానని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. 

ప్రైవేటు పనిచేస్తుంటే...
ఎపీఎన్జీవోల సమ్మె పై మాట్లాడుతూ..‘సమ్మెను నిలిపివేయాలని వారిని కోరుతున్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అనవసరంగా ఇబ్బందులకు గురవుతున్నారు’అని దిగ్విజయ్ అన్నారు. ‘ప్రైవేటు వ్యాపారాలు కొనసాగుతున్నప్పుడు, ప్రైవేటు దుకాణాలు తెరిచి ఉంటున్నప్పుడు, ప్రైవేటు రవాణావ్యవస్థ పని చేస్తున్నప్పుడు, ప్రైవేటు స్కూళ్లు నడుస్తున్నప్పుడు, కేవలం ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే ఎందుకు మూసేశారు?’ అని ఆయన ప్రశ్నించారు. ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కోరారు. ‘ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా... అన్ని ఇబ్బందులు, భయాలను వినేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు దయచేసి పనిలో చేరండి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగి ప్రయోజనాలు పరిరక్షించబడతాయని హామీ ఇస్తున్నాం’ అని ఆయన చెప్పారు. 

Tuesday 24 September 2013

సత్యవాణి భూకబ్జాపై విచారణ చేయండి

- శేరిలింగంపల్లి ఎమ్మార్వోకు లోకాయుక్త ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (టీ మీడియా): ఆధ్యాత్మికం ముసుగులో భూ కబ్జాకు పాల్పడిన సత్యవాణి దందాపై సమగ్ర విచారణ జరిపించాలంటూ రంగాడ్డి జిల్లా శేరిలింగంపల్లి ఎమ్మార్వోను లోకాయుక్త ఆదేశించారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపి నవంబర్ 11లోగా నివేదికను సమర్పించాలని లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సత్యవాణి భూదందాలపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ నేత, న్యాయవాది బద్దం నర్సింహాడ్డి, జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిడ్డి భాస్కర్‌రెడ్డి చేసిన ఫిర్యాదుకు లోకాయుక్త స్పందించారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లో సత్యవాణి భూ కబ్జా బాగోతాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఇటీవలే వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. మియాపూర్ సర్వే నెం.

satyaavani100, 101లో బైనంబర్‌లతో సత్యవాణి భూదందాకు పాల్పడ్డారని, గతంలో ఆమె అధ్యక్షురాలిగా పనిచేసిన దీప్తిశ్రీనగర్ హౌస్ బిల్డింగ్ కో ఆపరేటివ్ సొసైటీ అక్రమాలపై విచారణ జరిపించాలని వారు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. సత్యవాణి భూ కబ్జా వ్యవహారం తెలిసినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ సైబరాబాద్ కమిషనర్, రంగాడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి జాయింట్ కలెక్టర్, మియాపూర్ సీఐ, శేరిలింగంపల్లి ఎమ్మార్వో, మియాపూర్ సబ్ రిజిష్ట్రార్‌లను రెస్పాండెంట్స్‌గా తన ఫిర్యాదులో చేర్చారు. మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లో ధార్మిక కార్యక్షికమాల పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేసి వ్యాపార కార్యక్షికమాలను నిర్వహిస్తున్న సత్యవాణిని వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ (టీఆర్‌సీపీ) డిమాండ్ చేసింది. దేవుడు పేరుతో దేవాలయాలు నిర్మించి శివబాలయోగి మహరాజ్ ట్రస్టు ఓనర్ గొట్టిపాటి సత్యవాణి 520 ఎకరాల భూమిని ఆక్రమించి వ్యాపార కార్యక్షికమాలను నిర్వహిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండగడ్డ విక్రమ్‌కుమార్ ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములను అట్లూరి సుబ్బారావుతో కలిసి విక్రయించిన సత్యవాణిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

Monday 23 September 2013

వర్ధిల్లాలీ సమైక్యాంధ్ర!!



"వర్ధిల్లాలీ సమైక్యాంధ్రా" సుబ్బారావు గట్టిగా, పక్కనున్న నారాయణ కాస్త నెమ్మదిగా అరిచారు. గంటనుండీ అలాగే అరుస్తున్నారు. అదేదో సమైక్యాంధ్రకోసం ధర్ణా అట. బడిపిలగాళ్ళంతా చక్కగా రంగురంగు యూనిఫారాలతో ఒద్దికగా కూర్చున్నారు. అక్కడక్కడ సుబ్బారావు, నారాయణ లాంటి మరికొందరు నడివయసు వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఎవరో ఒక పెద్దాయన నినాదాలిస్తుంటే బడి పిల్లలు చక్కగా గొంతు కలుపుతున్నారు. సుబ్బారావు కూడా వారితో పాటు గట్టిగా అరుస్తున్నా మిగతా జనాలు మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు.

నారాయణకు కాసేపటికి తామెందుకలా అరుస్తున్నామనే సందేహం వచ్చింది. సుబ్బారావ్, సమైక్యాంధ్ర వర్ధిల్లడమంటే ఏంటి?

సుబ్బారావుకు కోపమొచ్చింది. "అంటే ఈరాష్ట్రాన్ని యిడగొట్టకుండా ఇలాగే కలిపి ఉండాలని".

మరి యెవలిడగొడుతున్నరు?

నారాయణ, నువ్వసలు బొత్తిగా ఏం జరుగుతుందని తెలుసుకోవు లాగుంది. తెలంగాణోల్లు తమకు వేరే రాష్ట్రం కావాలని ఉద్యమం చేస్తున్నరు. ఈమధ్యనే కేంద్రం వాల్ల డిమాండుకు ఒగ్గేసి విడగొట్టడానికి ఒప్పుకుంది. అందుకే మనం ఇలా ధర్ణా చేస్తున్నాం.

ఆహా!! వాళ్ళు విడగొట్టమని, మనోళ్ళు కలిసుందామనీ అంటున్నరన్నమాట. ఇప్పుడేం జెయ్యాల? మనం మాత్రం కలిసుండీ వాళ్ళు విడిపోతె సరిపోద్ది గద?

నారాయణా, అసలు నీకేం తెల్వదు. వాళ్ళు విడిపోయి మనం కలిసుండడమంటె రాష్ట్రం విడిపోయినట్టే గద?

సుబ్బారావ్, నువ్వు చెప్పింది నిజమే కని మనం మాత్రం కలిసుండాలంటె సమైక్యాంధ్ర ఎట్ల వర్ధిల్లుతది?

నారాయణ, వాళ్ళు విడిపోతె మనకేంది గానీ, విడీపోతూ విడిపోతూ వాళ్ళు హైదరాబాదును కూడా తమతోపాటు తీసుకెలుతున్నరట. మన నాయుడుగారి యాపారాలన్నీ నేమో హైదరాబాదులనే ఉండె. అందుకే ఈపోరాటం. అందుకే మన నాయుడుబాబుగారు మనల్ని యిక్కడకి రమ్మని పిలిసిండు.

అట్లనా! అట్లయితే మనం హైదరాబాదు మనగ్గావాలని కద పోరాటం జెయ్యాల్సింది? మరి నడిమిట్ల సమైక్యాంధ్ర వర్ధిల్లాలని అనుడెందుకు?

అట్లడిగితె హైదరాబాదు మనకు రాదంట. నాయంగ హైదరబాదు వాల్లదేనంట. కలిసేటప్పుడు మనం దాన్ని తీసుకెల్లలేదు, అది మన ప్రాంతంల లేదు. ఎటు జూశినా అది మనకు దక్కే ఉపాయంలేదు. అందుకే సమైక్యంగ ఉంటె హైదరాబాదుమీద నాయుడుగారి పెత్తనం అట్నే నడుస్తది, ఆయన యాపారాలు అట్నే సాగుతయని నాయుడుగోరి ఆశ.

ఓహో..సూటిగడుగుతందుకు మనదగ్గర నాయం లేదు గనక యిట్ల డొంకతిరుగుడు యవ్వారం జేస్తున్నమన్నమాట. ఏమైనా నాయుడుగారిది గొప్ప తెలివే సుబ్రావ్. ఇంతకూ మనకేది మంచిగుంటది?  

మనమాహైదరాబాదును ఎప్పుడన్న సూశినమ, పెట్టినమా? మనరాజధాని మన బెజవాడ దగ్గరుంటె కనీసం అప్పుడప్పుడన్న పొయ్యిరావచ్చు. మనకు పనులు పెరుగుతయి. విడిపోతనే మనకు మంచిది.

ఈయిసయం ఇంతమెల్లగ చెబుతవేంది సుబ్రావ్? మన కోరికల నాయం లేకపాయె, మనకు లాభం లేకపాయె. మన నాయుడుగారి లాభంకోసం పొద్దాక మనమెందుకు ఈడ కూసోని గొంతుబొయ్యేదాక అరవాలె? సదువుకునే పిలగాళ్ళెందుకు సదువులు పాడు చేసుకుని అరవాలె. నాకిదేం బాగనిపిస్తలేదు. పోదాం పద.

సరే..నాకూ అదే అనిపిస్తుంది. పద ఇంటికెల్దాం. రేపటినుంచి నాయుడుగారిదగ్గర పని మానేసి ఇంకెక్కడన్న చూసుకుందాం. 


ముఖ్యమంత్రి మార్పు



రాష్ట్రవిభజన గురించి కాంగ్రేస్ నిర్ణయం తీసుకున్నతరువాత తోక జాడిస్తున్న ముఖ్యమంత్రిపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. నిర్ణయానికి ముందు అంతా మీయిష్టం అంటూ హైకమాండ్‌కు చెప్పొచ్చిన సీల్డ్‌కవర్ ముఖ్యమంత్రి ఆతరువాత వారంరోజులకు సుషుప్తావస్త నుండి బయటికి వచ్చి రాష్ట్రాన్ని విభజిస్తే నీళ్ళ సమస్యలెలా తీరుస్తారు, విద్యుత్ సమస్యలెలా తీరుస్తారు అంటూ మాట్లాడి తన అవగాహనారాహిత్యాన్ని చాటుకోవడమే కాక సీమాంధ్రలో  కిరాయి ఉద్యమాన్ని సృష్తించడం కోసం అషోక్‌బాబు లాంటి పావులను కదపడంపై ఢిల్లీ కోపంగా ఉంది.

నిజానికి విభజన ప్రకటన తరువాత సీమాంధ్రలో వారం రోజులపాటు ఎలాంటి ఆందోళనలూ లేవు. అయితే ముఖ్యమంత్రి స్వయంగా భాయాందోళనలు రగిలించడమె కాకుండా కొందరు కిరాయి మనుషులతో ఆందోళనలు ప్రోత్సహిస్తున్నాడనేది బహిరంగ రహస్యం. ఏపీఎంజీవోలు హైదరాబాద్‌లో జరిపిన మీటింగుకి కర్త, కర్మ, క్రియా అన్నీ తానే అయి నడిపించడమే కాకుండా ఏసీ బస్సులూ, ప్రత్యేక రైల్లూ అరేంజ్ చేశాడు. 

తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడంకోసం సభలకు అనుమతుల నిరాకరణతోపాటు ముందస్తు అరెస్టులూ, రబ్బరు బుల్లెట్లూ, విచక్షణారహితంగా లాఠీఛార్జీలూ చేపించే ముఖ్యమంత్రి సీమాంధ్ర ఆందోళనల్లో జాతీయ నాయకుల విగ్రహాలు కూలగొడుతున్నా పట్టించుకోలేదు. 

సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య నాటకానికి ముగింపు పలకడానికి కేంద్రం ముఖ్యమంత్రిని మార్చి తెలాంగాణకు చెందిన నాయకున్ని ముఖ్యమంత్రిని చెయ్యడమో లేకపోతే రాష్ట్రపతి పాలన విధించడమో చేయనున్నట్లు సమాచారం. ఇదేజరిగితే సమైక్యాంధ్ర ఆందోళనలు ఆపడానికి అక్కడ కూడా ముందస్తు అరెస్టులూ, లాఠీచార్జీలూ, కేసులు బనాయించడం చేస్తే వాటిని తట్టుకుని సమైక్యాంధ్ర సమర్ధకులు ఆందోళనలు ఎంతవరకు కొనసాగిస్తారనేది ప్రశ్నార్ధకమే. కడుపు కాలినవాడు పోలీసులనెదిరించి పోరాడుతాడు కానీ కడుపు నిండినవాడు చేయలేడుకదా? 

Sunday 22 September 2013

అర్ధంలేని భయాలు, మాటున దాగున్న కఠొర సత్యాలు



సీమాంధ్ర టీవీ ఛానెల్లలో విభజన గురించి జరుగుతున్న చర్చాగోష్ఠుల్లో పాల్గొంటున్న కొందరు వెలిబుచ్చుతున్న భయాందోళనలు చూస్తుంటే అక్కడి ప్రజలను వారి నాయకులు ఎంతగా బెదరగొట్టారో తెలుస్తుంది. అయితే వీరు వెలిబుచ్చే భయాందోళనలను పరిశీలించి చూస్తే చరిత్రలో దాగిన కఠోర సత్యాలు కనిపిస్తున్నాయి.

ఒక ప్రభుత్వ ఉద్యోగిని అంటుంది: రాష్ట్ర ఆదాయంలో అరవైశాతం హైదరాబాదు నుంచేనట. మరి విడిపొÓతే మాకు జీతాలెవరిస్తారు? నిజానికి ఇప్పుడు హైదరాబాదుకింద చూపించే ఆదాయం అంతా హైదరాబాదుది కాదు. రాజధాని హైదరాబాదు కనుక పన్నులన్నీ హైదరాబాదుకిందికి వస్తాయి కానీ విడిపోతే అందులో సీమాంధ్ర వాటా సీమాంధ్రకే చెందుతుంది కనుక జీతాలు ఇవ్వలేని పరిస్థితి అనేది ఒక ఎక్జాగరేషన్. అయితే దీని మాటున దాగున్న సత్యం: 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడకపూర్వం ఆంధ్రరాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. తెలంగాణతో కలవడానికి ఇక్కడ మిగులు ఆదాయం ఒక ప్రధాన కారణం.

మరో ప్రభుత్వ ఉద్యోగి: "నలభై వేలమంది ఉద్య్'ఓగులు హైదరాబాదు విడిచి వెల్లాల్సి వస్తుంది". ఇది కూడా ఎక్జాగరేషన్. పదేళ్ళవరకూ హైదరాబాద్ కామన్ కాపిటల్ అయితే పదేళ్ళు వదిలి వెల్లాల్సిన అవసరం ఉండదు. అంతలోగా ఎందరో రిటైర్ అవుతారు. అయితే ఇక్కడ  బయట పడే సత్యం: ఇన్నాళ్ళూ సీమాంధ్రులు హైదరాబాదులో అక్రమంగా తమ వాటా కంటే చాలా  ఎక్కువగా ఉన్నారని చెప్పినప్పుడు ఒప్పుకోనివారు కలుగుల్లో ఎలుకల్లా తమ సంఖ్యను తామే బయట పెట్టుకున్నారు.

"మన థెర్మల్ పవర్ ప్లాంట్లకు తెలంగాణ వారు బొగ్గు ఇవ్వరు". ఇది ఏమీ పరిష్కరించుకోలేనటువంటి సమస్య కాదు. దానికి సంబంధించి ఒప్పందం చేసుకోవచ్చు, పైగా దిగుమతి కూడా చేసుకోవచ్చు. ఎలాగూ మన బొగ్గు మన అవసరాలకు సరిపోవట్లేదు. అయితే ఇక్కడ దాగున్న సత్యం: బొగ్గు తెలంగాణలో ఉన్నప్పటికీ, కోస్తాంధ్రలో పంటపొలాలతో ఉన్న భూములు థెర్మల్ కేంద్రాలకు అనుకూలంగా లేనప్పటికీ థెర్మల్ ప్రాజెక్టులు మాత్రం అక్కడ పెట్టించారు. కారణం: ఆఉద్యోగాలన్నీ అక్కడివారికే చెందాలనే అత్యాశ.

మరొకావిడ చెబుతుంది:"నదీపరివాహిక ప్రాంతమంతా అక్కడ ఉంటే సీమాంధ్రకు సముద్రపు నీల్లే గతి". మరి పరివాహిక ప్రాంతమంతా తెలంగాణలో ఉన్నప్పుడు ఇన్నాల్లూ ఇక్కడ ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు? అప్పుడెందుకు గ్రావిటీ బూచిని చూపి తెలంగాణ ప్రాజెక్టులు అటకెక్కించారు? ఇన్నాల్లూ లేనిది ఇప్పుడుమాత్రం ఒక్కసారే ఎత్తుగడ్డపైనున్న తెలంగాణలో ప్రాజెక్టులు సాధ్యమయి నీరు క్రిందికి రాకుండా ఆపగలం?

ఇంకా ఒక ఆర్టీసీ ఎంప్లాయీ బాధ: " విడిపోతే ఆర్టీసీ మూత బడుతుంది". ఇన్నాల్లూ నడిచింది ఇప్పుడెందుకు మూతబడుతుంది? ఆర్టీసీ అంతా తెలంగాణ ఆదాయంపైనే నడుస్తునందనేది ఇక్కడ దాగిన సత్యం, పెత్తనం మాత్రం అన్నిటిలాగే ఇక్కడ కూడా ఆంధ్రాదే.






Friday 20 September 2013

అప్పుడే పుట్టిన పసిగుడ్లనూ వదలని సమైక్య సాడిజం!


సీమాంధ్రలో తెలంగాణ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకూ వెర్రితలలు వేస్తున్నాయి. అక్కడి సంఘాలు, పార్టీలు చేస్తున్న కొన్ని కొన్ని నిరసన రూపాలు చూస్తుంటే “అసలు వీళ్లకు ఉద్యమమంటే పరాచికం” అనిపిస్తుంది
కానీ ఈ వీడియో చూడండి. ఇది వారి ఉన్మాదానికి పరాకాష్ట. అప్పుడే పుట్టిన పసిగుడ్లను కూడా తమ రాజకీయాలకు ఎంత అమానవీయంగా వాడుకుంటున్నరో…
చేసినోళ్లకు బుద్ధిలేదు సరే, కనీసం దీన్ని ప్రసారం చేసిన మీడియా వాళ్లకైనా ఉండాలె ఇంగితజ్ఞానం.