Sunday 30 December 2012

610జీవో@27ఏళ్లు..


ఎప్‌టీ రామారావు ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు ప్రభుత్వం 1985లో తెలుగుగంగ పనులను శరవేగంగా పూర్తి చేయటానికి పూనుకున్నది. ఈ ప్రాజెక్టు పనిలో భాగంగా కొంతమంది తెలంగాణ ఉద్యోగులను రాయలసీమకు పంపటం జరిగింది. ఇది సహించలేని కొందరు రాయలసీమ నాయకులు, ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులను వెంటనే వెనక్కి పంపించాలని అలా పంపకపోతే తదుపరి జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని రాష్ర్ట ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాయలసీమ నాయకులు, ఉద్యోగుల డిమాండుకు తలవంచిన నాటి ప్రభుత్వం 564 జీవోను జారీ చేసి 30 రోజుల్లో తెలంగాణ ఉద్యోగులను రాయలసీమ నుంచి వెనక్కి పిలిపించారు.

564 జీవో అమలుతో అవమానానికి ఆవేదనకు గురైన తెలంగాణ ఉద్యోగులు, మా ప్రాంతంలో రాష్ర్టపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్న సీమాంధ్ర ఉద్యోగుల మాటేమిటని ఎన్‌టీఆర్‌ను నిలదీశారు. ఇది చిలికి చిలికి గాలివానై మరో తెలంగాణ ఉద్యమానికి దారి తీయగలదని గ్రహించిన ఎన్‌టీఆర్ తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను వారి సొంత ప్రాంతాలకు పంపే నిమిత్తం 610 జీవోను 30-12-1985న జారీచేస్తూ మూడు నెలల్లో జీవో లక్ష్యం పూరి ్తకావాలని గడువు విధించా రు. 610 జీవోను 31.03.1986 నాటికి పూర్తి గా అమలు చేయాలి. కానీ 30-12-2012 నాటికి 27ఏళ్లు నిండినా 610 జీవో అమలుకి నోచుకోలేదు. 610 జీవో ప్రకారం రాష్ర్టపతి ఉత్తర్వులు అమలులోకి వచ్చిన నాటి (18- 10-1975) నుంచి తెలంగాణలో జోనలైజేషన్‌కి విరుద్ధంగా నియమించబడిన సీమాంధ్ర ఉద్యోగులను వారి సొంత జోన్లకు పంపి అట్టి ఖాళీలను తెలంగాణ నిరుద్యోగులతో నింపాలి. 38 సంవత్సరాల నుంచి రాష్ర్టపతి ఉత్తర్వులు 28ఏళ్ల నుంచి 610 జీవో అమలుకు నోచుకోలేదు.

తెలంగాణవాదుల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడల్లా, సభాసంఘాలు, కమిటీలు, కమిషన్స్‌తో కాలయాపన చేయటం, జీవోల జారీలతో తెలంగాణ వారిని మభ్యపెట్టడం సీమాంధ్ర పాలకులకు అలవాటుగా మారింది. 31.12.1985 నాటికి వివిధ కమిటీల లెక్కల ప్రకారం తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్న సీమాంవూధుల సంఖ్య 59 వేలు కాగా, నేటికి ఆ సంఖ్య రెండు లక్షల పైనే ఉంటుంది.1973లో ఆరు సూత్రాల పథకం ఆవెూ దం పొంది, రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించారు. ప్రతి ఉద్యోగికి సంబంధించిన స్థానిక, స్థానికేతర వివరాలను, సర్వీస్ రిజిస్టర్‌లో తప్పనిసరిగా నవెూదు చేయాలని 1975 లో 729 అనే జీవోను జారీ చేశారు. ఈ జీవోను సీమాంధ్ర పాలకులు ఉద్దేశ్యపూర్వకంగానే అమలు చేయలేదు. దీని పర్యవసానంగా తెలంగాణలో స్థానికుల కేటగిరిలో, ఎంతమంది ఏయే శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారో గుర్తించడం చాలా కష్టమైనది.

ఈ విధంగా గుర్తించడానికి వీలు పడకుండా 729 జీవో లక్ష్యానికి అందకుండా, తెలంగాణలో అక్రమంగా తిష్టవేసిన సీమాంధ్ర ఉద్యోగులు, గుర్తించబడ్డ ఉద్యోగులకంటే ఎన్నోట్లు ఎక్కు వ. 610 జీవో అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను అధ్యయనం చేసి అధిగమించడానికి తగిన సూచనలు సలహాలు ఇచ్చే నిమిత్తం 2001లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రిటైర్డ్ ఐ.ఎ.ఎస్. అధికారి గిర్‌గ్లాని నేతృత్వం లో ఏకసభ్య కమిషన్‌ను నియమించారు.ఈ కమిషన్ తన నివేదికను 2004 లో రాష్ర్ట ప్రభుత్వానికి నివేదించింది. 2004లో తెలంగాణ రాష్ర్ట సమితితో ఎన్నికల పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్‌ఎస్ మంత్రుల ఒత్తిడి మేరకు, 610జీవోను అమ లుచేసి నివేదిక పంపాలని అధికారులను ఆదేశిస్తూ 548అనే మరొక జీవోను జారీ చేశారు.

గిర్‌గ్లానీ కమిషన్ నివేదికను అమలు చేయటానికి బదులు 2004 మేనెలలో కొత్తగా అధికార బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ఆ కమిషన్‌లోని అంశాలను పరిశీలించి ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా నాటి గ్రామీణాభి వృద్ధి శాఖామంత్రి డి.శ్రీనివాసును చైర్మెన్‌గా, మంత్రులు కె.జానాడ్డి, డి. రెడ్యానాయక్, ధర్మాన ప్రసాదరావు, కోనేరు రంగారావు, జె.సి.దివాకర్‌డ్డిలను సభ్యులుగా నియమిస్తూ 778 అనే వేరొక జీవోను జారీ చేశారు.

610 జీవో అమలుకు బదులు సభాసంఘాలు, కమిటీలు, కమిషన్‌లతో కాలయాపనకు అలవాటు పడ్డ సీమాంధ్ర పాలకులకు తానేమి అతీతుడను కాదన్నట్టు నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌డ్డిని 610 జీవో అమలుకు ఒక సభా కమిటీ వేసి ఆ కమిటీకి ఉత్తం కుమార్‌డ్డి (కాంక్షిగెస్ ఎమ్.ఎల్.ఎ)ను చైర్మన్ గా నియమించారు. 38 ఏళ్ల నుంచి (18-10-1975) రాష్ర్టపతి ఉత్తర్వు లు 28 ఏళ్ల నుంచి (30.12.1985) 610జీవో అమలు కోసం ఎదురు చూసి తెలంగాణ నిరుద్యోగ యువత ఏజ్‌బార్ అయి గృహస్తులుగా, తండ్రి గా, తాతగా, అమ్మమ్మగా, నాయనమ్మగా షష్టిపూర్తి చేసుకుంటున్నా ఈ ఉత్తర్వులు, జీవోలు మాత్రం అమలుకు నోచుకోవటం లేదు.

తెలంగాణ ఐ.ఎ. ఎస్. అధికారులపైనా! సీమాంధ్ర పాలకులకు చిన్న చూపే? ప్రాధాన్యం లేని పదవుల్లో నియమించటం, పదోన్నతుల్లో పద్ధతులకు నీళ్ళొదలటం పరిపాటి అయింది. 31-10-2012 నాటికి రాష్ర్టంలోఉన్న 276 మంది ఐ.ఎ.ఎస్. అధికారుల్లో తెలంగాణ వారు 14 మంది. ఈ పద్నాలుగు మందిలో ఏఒక్కరినీ కీలక శాఖలో కాని, ప్రాధాన్యం గల పోస్టులోగాని నియమించలేదు. రాబోవు 30సంవత్సరాల్లో ప్రధాన కార్యదర్శి (సి.ఎస్) అయ్యే అవకాశం ఏ ఒక్క తెలంగాణ ఐ.ఎ.ఎస్ అధికారికి లేదు.అర్హత గల తెలంగాణ అధికారులకు కన్‌ఫర్మ్‌డ్ ఐ.ఎ.ఎస్. దక్కటం అందని ద్రాక్ష అయింది.

2012 సెప్టెంబరు 19, 20 తేదీలు మహబూబ్‌నగర్ జిల్లా చరివూతలోనే మర్చిపోలేని దుర్దినాలు. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన 220 మంది మహబూబ్‌నగర్ జిల్లావాసులకు 26 ఏళ్ల తర్వాత ప్రభుత్వం కర్నూల్ జిల్లాలో ఉద్యోగాలిస్తేఅట్టి నిర్వాసితులను కూడా,కర్నూలు జిల్లా యంత్రాంగం రాజకీయ నాయకుల అండతో నిర్దయగా వెనక్కి పంపారు. దీని మీద నోరువిప్పని సీమ నాయకులు సమైక్యాంధ్ర గురించి ఊకదంపుడు ఉపన్యాసాలిస్తారు. 21-11-2012న రాష్ర్ట హైకోర్టు 610జీవోఉత్తర్వులు సమంజసమేనని తీర్పునిచ్చింది.

30 డిసెంబరు 1985న ప్రభుత్వం జారీ చేసిన 610 జీవో ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగ నియామకాల్లో జరిగిన ఉల్లంఘనలు సవరిస్తూ 07-09-2007న రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసిన 674జీవో ఈ రెండు జీవోలు సమంజసమేనని ఇవి రాష్ర్టపతి ఉత్తర్వులకు (18.10. 1975) అనుకూలంగా ఉన్నవి తప్ప అధిగమించి లేవని హైకోర్టు పేర్కొన్నది. 18-10-1975నాటి రాష్ర్టపతి ఉత్తర్వుల ఆధారంగానే స్థానిక కోటా ఏర్పా టు అయిందని ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు 80శాతం ఓపెన్ కేటగిరిలో 20శాతం పోస్టులను భర్తీ చేసే నిమిత్తం నాటి రాష్ర్ట ప్రభుత్వం 08-01-2002న జారీ చేసిన జీవో 8 కూడా సమంజసమేనని హైకోర్టు తీర్పు నిచ్చింది.

ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఎన్జీవోల విజ్ఞప్తి మేరకు 610 జీవో అమలు చేసే నిమిత్తం రాష్ర్ట ప్రభుత్వం 07-09-2007న 674అనే జీవోను జారీ చేసింది. ఈ 674జీవోను సీమాంధ్ర ఉద్యోగులు ఆంధ్రవూపదేశ్ పరిపాలన ట్రిబ్యునల్‌లో సవాల్ చేశారు. ఆంధ్రవూపదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ 23-04-2012న 610, 674జీవో సమర్థిస్తూ తీర్పునిచ్చింది.

ఈతీర్పును 1528 మంది సీమాంధ్ర ఉద్యోగులు హైకోర్టులో అప్పీలు చేశారు. హైకోర్టు 21-11-2012న, 610జీవో ఉత్తర్వులు సమంజసమే ముందు ఉత్తర్వులను అమలుపరిచి తెలంగాణలో అక్రమంగా వున్నవారిని వారి సొంత జోన్లకు పంపండి. ఆవిధంగా వారు వారి సొంత జోన్లలో విధుల్లో చేరిన తర్వాత, వారికి ఏదైైనా అన్యాయం జరిగింది అనిపిస్తే, 03-05-2012న రాష్ర్ట ప్రభు త్వం నియమించిన జస్టిస్ రాయ్‌కోటి కమిషన్‌కి వారు ఫిర్యాదు చేసుకోవచ్చునని హైకోర్టు సూచించినది. ఈ తీర్పును గౌరవించి సీమాంధ్ర ఉద్యోగులు వారి సొంత జోన్లకు వెళ్ళటంగాని, నేడు రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పాలకులు హైకోర్టు తీర్పును అమలు చేయం గాని, చేస్తారని గత సీమాంధ్ర పాలకుల చరిత్ర తెల్సిన తెలంగాణ వారు నమ్మాల్సిన పనిలేదు. కాలయాపనలో భాగంగా సీమాంధ్ర పాలకులు ఉద్యోగులు కుమ్మక్కై సుప్రీంకోర్టుకు వెళ్ళినా! ఆశ్చర్యపడనక్కర లేదు.

ఇక్కడ యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల్సిన విషయం ఒకటుంది. రాయలసీమ ఉద్యోగులకు మేలు చేసి తెలంగాణ ఉద్యోగులను వెనక్కి పంపే 564జీవోను విడుదల చేసిన 30 రోజుల్లో కచ్చితంగా అమలు చేశారు. అదే సంవత్సరం అనగా 30-12-1985న విడుదలై మూడు నెలల్లో అమలుకావాల్సిన 610 జీవో మాత్రం 27 ఏళ్లు నిండినా అమలుకి నోచు కోకుండా సభాసంఘాలు, కమిటీలు, కమిషన్‌లతో కాలయాపనకు గురవుతున్నది. ఈ జీవో అమలు చెయ్యాలని ఇంకొక జీవో విడుదల చేయటం, ఆ జీవోఅమలుకు మరొక జీవో వేయటం ఈ రెండు జీవోలు అమలుకు ఇప్పుడున్న నిబంధనలు వర్తించవని కొందరు సీమాంధ్ర ఉద్యోగులు పరిపాలన ట్రిబ్యూనల్‌కు వెళ్ళటం పరిపాటి అయ్యింది.

ఆ తీర్పు అనుకూలంగా లేకపోతే హైకోర్టుకు వెళ్ళటంఅక్కడ అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళటం చివరికి సుప్రీంకోర్టులో కూడా సీమాంవూధులకు వ్యతిరేకంగా తీర్పు వస్తే కాంగ్రెస్ అధిష్ఠానం ఆశీస్సులతో రాజ్యాంగ సవరణ చేయించి అయినా దేశ సర్వోన్నత న్యాయస్థాన మిచ్చిన తీర్పులను సమాధి చేయగల సమర్థులు సీమాంధ్ర కాంగ్రెస్ పాలకులు.

ఉదాహరణకు ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమేనని 3.10.1972న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దేశ సర్వోన్నత న్యాయస్థాన మిచ్చి న తీర్పుకు విరుద్ధంగా ఏర్పడ్డ, జై ఆంధ్ర ఉద్యమకారులు సీమాంధ్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గిన, నాటి కేంద్రంలోని కాంగ్రెస్ పాలకులు 1974లో 37వ రాజ్యాంగ సవరణ ద్వారా తెలంగాణ వారి రాజ్యాంగ బద్ధమైన ముల్కీ నియమాన్ని రద్దు చేయించారు.
సీమాంధ్ర పాలకుల పీడన పోవాలన్నా, దోపిడీలకు తెరపడాలన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. అప్పుడే ప్రాంత ప్రతి ఉద్యోగి, విద్యార్థులు, విద్యావంతులు, యువజనులు బతుకులు బాగుపడతాయి. ఈ సత్యాన్ని అన్ని వర్గా ల ప్రజలకు తెలిసేలా తెలంగాణ అంతటా చైతన్యయావూతలు నిర్వహించాలి. సీమాంధ్ర నాయకుల ఆధిపత్యంలో నడిచే రాజకీయపార్టీలకు తెలంగాణలో గోరికట్టాలి. రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఏర్పడ్డ పార్టీకి పట్టంకట్టాలి. 
డీ.ఎస్.రావు


No comments:

Post a Comment

Your comment will be published after the approval.