Sunday 30 September 2012

నిరంకుశ పాలకులపై జనం కవాతు






ప్రజాస్వామ్యదేశంలో ప్రజలే ప్రభువులు. పాలకులు ప్రభువులు కాదు ప్రజాసేవకులు మాత్రమే. కానీ మనదేశంలో ఒకసారి వోటువేశి ఒక ప్రభుత్వాన్ని గెలిపించాక ఐదేళ్ళు వేచిచూడాల్సిన పరిస్థితే తప్ప ప్రభుత్వం తమ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయకపోతే ప్రభుత్వాన్ని "రీ-కాల్" చేసే అవకాశంలేదు. పాలకులు తమ ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రజలదగ్గర ఉన్న ఏకైక ఆయుధం "నిరసనలు". ఈ నిరసనలు ప్రజలు ర్యాలీలు, సభలు లాంటివి జరపడం ద్వారా  తెలియజేస్తారు.  
 
అయితే ప్రస్తుత సీమాంధ్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలన చేయడమే కాక,  కనీసం ప్రజల ప్రాధమిక హక్కైన నిరసనలను కూడా అణచివేస్తుంది. ఏచిన్న ర్యాలీ చేయాలని ప్రజలు తలపెట్టినా పెద్దఎత్తున పోలీసులను మొహరించడం, నిరశనకారులను చెదరగొట్టడం, లాఠీచార్జి, కాల్పులు జరపడం చేస్తూ వస్తుంది.

ఇలాగే ఇంతకుముందు తెలంగాణ ప్రజలు మిలియన్ మార్చ్‌ను తలపెట్టినప్పుడు  ప్రభుత్వం అనుమతి నిరాకరించడమే గాక లక్షలాది యువకులను అరెస్టులూ, నిర్భందాలతో నిలువరించి, హైదరాబాదుకు అన్ని రవాణా సౌకర్యాలనూ రద్దు చేసింది, అయినా సరే నిర్భంధాన్ని ఎదిరించి పెద్దఎత్తున ఉద్యమకారులు ట్యాంక్‌బండును చేరుకున్నారు. అయితే ప్రభుత్వ నిర్భంధంపై ప్రజలకు ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకోవడంతో వారు తమ ఆగ్రహాన్ని అక్కడున్న విగ్రహాలపై చూపించారు.

ఒకసారి చేసిన తప్పుతో కాస్త బుద్ధి వచ్చిందేమో..ఆలస్యంగానైనా ప్రభుత్వం మార్చ్‌కు ఈసారి అనుమతినిచ్చింది. అయితే అనుమతినిచ్చినట్లే ఇచ్చి మరోవైపు అరెస్టులు మాత్రం కొనసాగిస్తూనే ఉంది. పైగా సెప్టెంబరు ముప్పైన హైదరాబాదు వచ్చే అన్ని రైళ్ళనూ రద్దు చేసింది. ప్రజలహక్కులను కాలరాయాలని చూస్తే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు. ఇకనైనా ప్రభుత్వం, పోలీసులు ఓవర్యాక్షన్  తగ్గించి ప్రజల హక్కులను గౌరవించి మార్చిను శాంతియుతంగా జరగనిస్తారని ఆశిద్దాం.    


ఇక తెలంగాణా ఉద్యమకారులను అకారణంగా అపహాస్యం చేసి ఉద్యమకారులను దాడులు చేసేవారిలా చిత్రించే సీమాంధ్ర మీడియా మరియూ కొందరు తెలంగాణ వ్యతిరేకులు తెలుసుకోవాల్సింది: తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు శాంతికాముకులు కనుకనే ఇన్నిరోజులుగా ఇంత పెద్ద ఎత్తున సాగుతూ లక్షలమంది ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటున్నప్పటికీ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుంది.

ఫాక్షనిస్టులూ,బెజవాడ రౌడిలూ నడిపిన సీమాంధ్ర ఉద్యమంలో రెండువారాల్లోనే విపరీతమైన హింస జరిగింది, అదే రెండు మూడు సంవత్సరాలు జరిగి ఉంటే బహుషా ఇప్పటికి ఏమీ మిగిలేది కాదేమో. ఒక్క రౌడీలీడరు చస్తే బెజవాడ బీసెంటు రోడ్డు మొత్తం తగలబెట్టి దుకాణాలమీదపడి దోచుకున్న విషయం, ఒక్క ఫాక్షనిస్టు చస్తే అనంతపూర్లో వందల బస్సులు తగలబడ్డ విషయం మరిచిపోవద్దు.

ప్రజల ఆకాంక్షలను గౌరవిద్దాం. కలిసి ఉండడమంటే బలవంతంగా కట్టిపడేసి ఉండడం కాదు. బలవంతపు పెళ్ళిల్లు, బలవంతపు సమైక్య రాష్ట్రాలు ఎప్పటికైనా విడిపోవాల్సిందేననే సత్యాన్ని తెలంగాణ వ్యతిరేకులు ఇప్పటికైనా తెలుసుకుని తెలంగాణా ప్రజల ఆకాంక్షకు మద్దతు ఇస్తే మంచిది.

4 comments:

  1. Telugu Desam activists even burned busses in Rajamundry after Paritala Ravi's death.

    ReplyDelete
  2. artipamdu tokkemi kaadu state naasanam chesidobbaru

    ReplyDelete
    Replies
    1. Please see my latest post "Telangana march- a first hand account" at http://jaigottimukkala.blogspot.in

      Delete
  3. Viswaroop, read this discussion in GPlus: https://plus.google.com/117247964787230784550/posts/APdg1pPYe6U

    ReplyDelete

Your comment will be published after the approval.