Friday 13 July 2012

మరోసారి న్యాయం గెలిచింది





తెలంగాణ ప్రజలు తమ హక్కులకోసం చేస్తున్న పోరులో మరో విజయం లభించింది. ఇప్పటికే మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసి తక్కువ సీట్లు కేటాయింపులు జరపగా కొత్తగా అనుమంతించిన నూటయాభై సీట్లను పూర్తిగా ఆంధ్రా ప్రాంతంలో ఉన్న కాలేజీల్లోనే కేటాయించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పక్షపాత బుద్ధిని బయట పెట్టుకున్నాడు. అయితే ప్రభుత్వానికి చెంపపెట్టులాగా కోర్టు తన తీర్పుతో న్యాయాన్ని గెలిపించింది.

2011 జనాభా లెక్కలప్రకారం తెలంగాణ(OU లోకల్), AU లోకల్, SVU లోకల్ జనాభాలు 3.52 కోట్లు, 3.12 కోట్లు, 1.81 కోట్లు. ప్రభుత్వ కాలేజీల్లో మెడికల్ సీట్లు OU - 600, AU- - 650, SVU - 550. అంటే లక్ష జనాభాకి SVUలో 3.03 సీట్లు, AUలో 2.08 సీట్లు ఉండగా  OU (తెలంగాణ) లో మాత్రం 1.7 సీట్లు మాత్రమే ఉన్నాయి. గత ఇరవై ఏళ్ళుగా తెలంగాణలో ప్రభుత్వ కోటాలో కొత్తగా ఒక్క కాలేజీ మాత్రం స్థాపించగా ఆంధ్రాలో మూడు, రాయలసీమలో నాలుగు కొత్తగా వెలిశాయి. ఇప్పుడు కొత్తగా కేటాయించబడిన నూటయాభై సీట్లను మొత్తంగా ఆంధ్రా, రాయలసీమలోని కాలేజీలకు మాత్రమే కేటాయించారు.

మెడికల్ సీట్ల కేటాయింపు విషయంలో జరిగిన అన్యాయంపై తెలంగాణవాదులు గత రెండు వారాలుగా చేస్తున్న పోరాటం చివరికి గెలిచింది. హైకోర్టు యాభై సీట్లను ఉస్మానియా, కాకతీయా మెడికల్ కాలేజీల్లో కేటాయించాలని మెడికల్ కౌన్సిల్‌ను ఆదేశించింది.

1 comment:

  1. Even assuming this order will actually implemented before the academic year begins, revised MBBS seats in Govt. medical college are as per below.

    - Telangana: 700 (35.0%)
    - Andhra: 1,300 (65.0%)
    - TOTAL: 2,000

    While this is good news, it is still partial justice at best.

    Another 200 Govt. MBBS seats are required to take Telangana share upto 40%. This means TWO (not just one as planned) new Govt. colleges should be setup by the next academic year.

    ReplyDelete

Your comment will be published after the approval.