Tuesday 4 October 2011

ఆంధ్రరాష్ట్ర సాధనకై జరిగిన "శాంతియుత" ఉద్యమం - 1



మద్రాసు నుండి విడిపోవడం కోసం ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఎంతో "శాంతి"యుతంగా చేసిన ఉద్యమంలో జరిగిన హింస, లూటీల వివరాలు ఈ టపాలో చూడవచ్చు. పొట్టి శ్రీరాములు గాంధీమార్గంలో చేసిన దీక్షమూలంగా రాష్ట్రాన్ని సాధించుకున్నామని గొప్పగా చెప్పుకునేవారు తమ ఉద్యమం అసలు స్వరూపాన్ని ఒక్కసారి గుర్తుతెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పొట్టి శ్రీరాములు మరణం యొక్క నిజానిజాలు ఇంతకుముందే చెప్పుకున్నాం. వివరాలకు ఈటపా చూడవచ్చు.


మిషన్ తెలంగాణా సౌజన్యంతో.

**************

Seemandhra Brand Statehood Agitation – Part 1

When Telangana people stopped a few Andhra buses on NH-9 yesterday, the Seemandhra leaders were livid. So, we at Mission Telangana wanted to remind them a piece of their history.
We wanted to remind them about the orgy of violence that fetched them the Andhra state in 1953. The following newslips showcase the ugly side of the Andhra statehood movement. The death of one person – Potti Sriramulu triggered these violent incidents.
These newsclips also prove how peaceful the Telangana statehood movement is even after the death of over 600 Telanganites in the ongoing agitation.
The clips are in Telugu. If you want to read some news clips in English, you can visit this link: Andhra Leaks Part 6: When Violence Worked
Read on:
Courtesy: Andhra Patrika and Andhra Prabha

***
Mission Telangana does not encourage violence of any form against anyone. The article is just to put the current events in perspective. This is an attempt to remind history to those who don’t know.
***
Read previous parts of the sensational “Andhra Leaks” series exposing the lies propagated by Seemandhra leaders and media:
***


9 comments:

  1. what is the point? since there was violence 50 years back, you want to repeat the same?
    or people do not have right to say that they suffered due to the burning of buses?
    An eye for eye makes the whole world blind.

    ReplyDelete
  2. Gandhi quotes do not suite for lagadapatis and samaikyavadis. Point is to expose how you portray the agitation happened 50 years back and how you do it for the one now.

    ReplyDelete
  3. ఈ శాంతియుత ఉద్యమాలని చూస్తే నెల్సర్ మండేలా విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటాడు.

    ReplyDelete
  4. Pictures convey thousand words.
    The picture attached in the very topic indicates how the Telugu media on that day opposed to violence.
    Point 2 nobody denied that violence took place. But it lasted for just few days. Nor those are part of violence claimed innocence.

    Today every minute the media scares the people that SJS may take any turn anytime. People caught on camera while throwing stones claim peaceful agitation.

    Today students and lawyers threaten elected members in the name of 'muttadi'. Again it is claimed peaceful. Police requests to disperse is cried as brutality.

    ReplyDelete
  5. Dear విశ్వరూప్ I Perfectly agree. My point is why dont you make lagapatis suffer?
    what is the point in making common man suffer?

    ReplyDelete
  6. అచ్చమైన తెలంగాణా వాది అతి తెలివి అంటే ఇదే. యాభై ఎనిమిదేళ్ళ క్రితం గొడవలు చూపి ఇప్పుడూ అదే స్థాయి హింసకి పాల్పడతాం అంటారా? అలాగే కానీండి. కాకపోతే అప్పుడు పొట్టి శ్రీరాములు మరణించిన తర్వాత ఆ ఉద్రేకంలో జరిగిన గొడవలు ఇవి. మరి ఇప్పుడు క.ఛ.రా ని అలా ఆత్మత్యాగం చేయమనండి మరి. ఓ పనైపోతుంది. ఇలా చరిత్ర పునరావృతం చేసుకుంటూ చేసుకుంటూ సైనిక చర్య దగ్గరికి వద్దాము. అప్పుడు తిరిగి ఇక్కడి ఉద్యమాన్ని, నిరంకుశ తెవాదులని ఆర్మీ కర్కశంగా అణగదోక్కేస్తుంది. అప్పుడు ఎంచక్కా గొడవల్లేని విశాలాంధ్ర వస్తుంది. ఐడియా బానేఉంది. కానీండి మరి.

    ReplyDelete
  7. అవన్ని పొట్టి శ్రీరాములు మరణం తర్వాత జరిగినవి..మహా అయితే రెండు మూడు రోజులు..అంతే కాని ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లాగా 2 ఏళ్ళ పాటు ఆ తెలంగాణ జనమే అహహ్యించునేలా కాదు...పైగా ఆ ఆవేశం లో అర్థముంది..కొంతమంది కుహనా దీక్షల్లా night feeding,ముసుగు లో ఇడ్లీ లతో care లాంటి hospital లో ఆయన దీక్ష చేయలే.. పొట్టి శ్రీరాములు ప్రకృతి వైద్యాన్ని పాటించేవారు..అందుకే ఆ 58 రోజులైనా ఆయనకి సాధ్యమైంది.నిజంగా కడుపు మాడ్చుకొని అమరుడయ్యాడు కాబట్టి ఆ ఉద్రేకం రెండు రోజులు సహజం.ఇంతకీ, కష్టపడి..http://www.pressacademyarchives.ap.nic.in నుండి కట్టింగ్స్ తో ఒక ఆర్టికల్ రాసావుగాని దీన్ని ఖండించేవారు ఎవరూ లేరే..a.p.హిస్టరీ పుస్తకాలు అన్నింటిలో ఈ విషయం ఉంటది.ఒకసారి అకాడమీ బుక్స్ తిరగేయ్.దాన్ని సీమాంధ్రులు పూర్తిగా అంగీకరిస్తారు.

    ReplyDelete
  8. dear lie teller,

    ముందుగా ఈ ఆర్టికల్ మీఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని అత్యంత శాంతియుత ఉద్యమంగా చెప్పుకునే, చేసుకునే ప్రచారానికి సమాధానం, వాస్తవాలను ప్రపంచానికి చెప్పే ప్రయత్నం. ఇక చరిత్ర పుస్తకాల్లో ఈవిషయాలన్ని కాదుగదా, అసలు పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ కోసమే ఉద్యమనిచాడనే అర్ధం వచ్చేలా రాసినచోట్లు కోకొల్లలు, అవీ పాఠ్యపుస్తకాల్లో.

    ఇక పోట్టి శ్రీరాములు నిజంగా కడుపు మాడ్చుకుని చనిపోయాడా లేక అప్పటి మీ నాయకులు కావాలని చావనిచ్చారా అనేది చర్చనీయాంశం. చివరి పదిరోజులూ అసలు స్పృహలోనే లేనివ్యక్తి తనదీక్ష విరమణ గురించి తనకు తాను నిర్ణయం తీసుకోలేడు, పక్కవారే తీసుకోవాలి. మరి ఆయన ప్రాణాలకంటే పదవులమీదే ఎక్కువ ధ్యాస ఉన్న మీవారు ఎందుకో ఆప్రయత్నం చెయ్యలేదు. స్పృహకోల్పోవడానికి ముందు అతను తండిపెట్టండని బతిమాలినా పెట్టలేదని కూడా వినికిడి.

    ఇక ఉద్యమాల్లో హింస గురించి: రెండు ఏళ్ళలో తెలంగాణ ఉద్యమకారులు చేసిన హింసకంటే పదిహేను రోజుల్లో మీసమైక్యవాదులు చేసిన హింస చాలా ఎక్కువ. ఇంతకాలం ఇంత పెద్దమొత్తంలో జనం పాలుపంచుకున్న ఉద్యమంలో చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరగడం మామూలు. కానీ కేవలం నాయకులు తమ కిరాయి రౌడీలద్వారా నడిపించిన సమైక్య ఉద్యమం ఎంత హింసాయుతంగా జరిగిందో అందరికీ తెలుసు. అలాంటివాటిని సమర్ధించే మీబోటివారికి ప్రజాస్వామ్య ఉద్యమాల గురించి అవగాహన ఉంటుందనుకోను. తెలంగాణలో రెండేల్లలో సీమాంధ్ర ప్రభుత్వం చేసిన హింస కూడా మీకు కనిపిస్తుందని నేననుకోను. మీప్రొఫైల్ పేరు truth teller అని పెట్టుకున్నంతమాత్రాన మీరు రాసేవి నిజాలయిపోవని తెలుసుకోండి.

    ReplyDelete
  9. @విశ్వరూప్ గారు,
    1)మీకు ఇంత చెప్పినా అర్థం కాకపోతే దేవుడే బాగుచేయాలి.పొట్టి శ్రీరాములు మరణం తరువాత రెండు రోజులు అంటే నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ప్రకటన చేసేవరకు హింస చెలరేగిందని పాఠ్యపుస్తకాల్లోనే కాదు అన్ని ఆంధ్రప్రదేశ్ చరత్ర పుస్తకాలు మరియు అకాడమీ పుస్తకాల్లో విరచితం.నేను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను.2007 గ్రూప్-2 లో ap history lo 73/75 మార్కులు వచ్చాయి.చరిత్ర మీరు చెప్తే తెలుసుకోవాల్సిన పరస్థితి లో నేను లేను.
    పొట్టి శ్రీరాములు ని చావనిచ్చారు అని మీరు కొత్త వాదన లేపితే వినడానికి కుక్కలు కూడా ఇష్టపడవు..మీరు ఏదో వక్రభాష్యాలతో అప్పటి నిజాలను దాయ ప్రయత్నిస్తే వాటి గూర్చి ఎవరూ స్పందించముందుకు రారు."తిండి పెట్టమన్నా,పెట్టలేదు"...ఎందుకండీ! ఎక్కడైనా రాసి ఉందా ?...ఇలాంటి "వినికిడి" లు పరిశీలనార్హం అయితే ఇలాంటివి "వినికిడి" లు వంద చెప్పగలరు సమైక్య వాదులు తెవాదాన్ని కించపరిచేలా..
    2)/రెండు ఏళ్ళలో తెలంగాణ ఉద్యమకారులు చేసిన హింసకంటే పదిహేను రోజుల్లో మీసమైక్యవాదులు చేసిన హింస చాలా ఎక్కువ/..
    మీరేదో సింపుల్ గా చెప్తే నిజమైపోద్దాండీ?..కనీసం ఆ హింసలో ౦.౦౦౦౦1 percent కూడా ఉండదు సమైక్య హింస.అది ప్రపంచానికి తెల్సు.మీ ఒక్కరికీ తెలియకపోయినా ఎవడూ పట్టించుకోడు.
    3)/కానీ కేవలం నాయకులు తమ కిరాయి రౌడీలద్వారా నడిపించిన సమైక్య ఉద్యమం ఎంత హింసాయుతంగా జరిగిందో అందరికీ తెలుసు/...
    నిజంగానే కిరాయి రౌడీల ద్వారా సమైక్య ఉద్యమం జరిగితే dec9 న వచ్చిన తెలంగాణా ఇన్ని రోజులు ఆగిపోదు..అది అన్యాయమైన కోర్కె కాబట్టే ఆగిపోయింది.అది అన్యాయమైన కోర్కె అని కేంద్రం తెలుసుకోగలిగింది..సాక్షాత్తూ MLA లే అసెంబ్లీ లో రౌడీలైపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సంస్కృతి మీ తెలంగాణ నాయకులది.ఈ విషయం లో మీరు అనేటోల్లు.మేము పడేటోల్లమా?...ఎంత చిత్రం...ఈ దౌర్జన్యాలు చూసే(తెలంగాణ ఏర్పాటు పక్కనపెడితే) అసలు ఆ విషయమే పక్కన పెట్టేసినంత విసిగిపోయింది కేంద్రం..(సంవత్సరం క్రితం కనీసం చర్చలకైనా మొగ్గు చూపేది)..
    4)/తెలంగాణలో రెండేల్లలో సీమాంధ్ర ప్రభుత్వం చేసిన హింస కూడా మీకు కనిపిస్తుందని నేననుకోను/......
    ప్రభుత్వంలో తెలంగాణ మంత్రులు కూడా ఉన్నారు...నిజంగా హింస జరిగితే వాళ్ళాపరా? ఏమీ జరగలేదు కాబట్టే ఆపాల్సిన అవసరం లేకపోయే.
    5)/ఇంతకాలం ఇంత పెద్దమొత్తంలో జనం పాలుపంచుకున్న ఉద్యమంలో చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరగడం మామూలు/
    చెదురు మదురు ఘటనలా? బస్సులు తగలెట్టడం..రైలు పట్టాలు తొలగించడం..సీమాంధ్రులని తగిలేస్తాం అని బెదరించడం..ప్రయాణికులున్న బస్సులు పై రాళ్ళు వేయడం...అసెంబ్లీలో ఒక MLA మరో MLA ని "కొట్టండ్రా వాడ్ని" అని ప్రేరేపించడం,దానికి ఒక తెలంగాణ వాది రెచ్చిపోయి ఆ MLA ని కొట్టడం..ఇవన్నీ చెదురుమదురు ఘటనలాండీ? నాకు తెలీదే! నేనేదో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని తెగ ఇదైపోతున్నా సుమండీ!

    ReplyDelete

Your comment will be published after the approval.