Monday 4 November 2013

తప్పించుకు తిరుగువాడె సీమాంధ్ర నేత సుమీ!

రాష్ట్రవిభజనపై మీ వైఖరి ఏమిటో చెప్పండి అన్న ప్రశ్నకు ఇన్నాళ్ళూ టీడీపీ, వైకాప, కాంగ్రేస్, లోక్‌సత్తా అనే తేడా లేకుండా అందరూ రకరకాలుగా సమాధానం దాటవేసి నెట్టుకొచ్చారు. ఒకరు ఇది కేంద్రప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఆపేశక్తి మాకు లేదు అంటే ఇంకొకలు నేను వ్యతిరేకం గాదు, మరొకరు సామరస్య పరిష్కారం వెదకాలి అంటూ పదాలతో పదనిసలు చేశారు తప్ప సమాధానాలు చెప్పలేదు.

తీరా కేంద్ర నిర్ణయం తీసుకున్న తరువాత మేమే ఎక్కువ గట్టిగా విభజనకు అడ్డుపడుతున్నమంటే మేమే నంటూ సమైక్యాంధ్ర ఛాంపియన్షిప్ కోసం ఈసీమాంధ్ర నేతలంతా పోటీలు పడుతున్నారు. అందరూ సమన్యాయం , సామరస్యపూరిత పరిష్కారం కావాలనేవారే, కానీ అదెలాగోమాత్రం ఎవరూ చెప్పరు.

చివరికి విభజిస్తే సీమాంధ్రకొచ్చే సమస్యలేంటొనయినా చెప్పండి వీలయితే పరిష్కరిస్తామంటూ కేంద్రం ఒక మంత్రుల కమిటీని వేస్తే దానికి ఒక నివేదిక ఇవ్వడానికి కూడా ఈసీమాంధ్ర నేతలకు ధైర్యం చాలట్లేదు. ఇస్తే గిస్తే ఇక్కడ సీమాంధ్రలో వోట్లు పోతాయనో తెలంగాణలో వోట్లు పోతాయనో తప్ప ప్రజల సమస్యలనెలా కేంద్రానికి తీసుకెళ్ళాలి అని మాత్రం ఈ స్వార్ధ సీమాంధ్ర నాయకులకు పట్టదు.

ఎప్పుడూ తమ వోట్లు, తమ పదవులూ, తమ ఆస్థులూ, తమ కబ్జా భూములు, తమ ఆర్ధిక రాజకీయ అవసరాలు తప్ప ప్రజల క్షేమం పట్టని ఈ నేతలు ఇలా తప్పించుకు తిరుగుతూ ఇన్నాళ్ళూ తెలంగాణ ప్రజలను వంచిస్తే ఇప్పుడు తమ సొంత ప్రాంతమయిన సీమాంధ్ర ప్రజలనే వంచిస్తున్నారు. సీమాంధ్ర ప్రజలారా ఆలోచించండి.. ఈ దగుల్బాజీ నేతలు మీకవసరమా? 

7 comments:

  1. @ సీమాంధ్ర ప్రజలారా ఆలోచించండి.. ఈ దగుల్బాజీ నేతలు మీకవసరమా?

    వాళ్ళు సీమాంధ్ర నేతల మోసపూరిత వాక్యాల్లో బందీలై, నిజ మేమిటో తెలుసుకోలేక, త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నారు. "మధు తిష్ఠతి జిహ్వాగ్రే, హృది హాలాహలం విషమ్" అనే సామెత ననుసరించి, మనస్సులో విషం ఉన్నా తేనెవంటి ఆ నేతల మాటలు, సంతోషంగా వినేవారికి, మీ మాటలు రుచిస్తాయా విశ్వరూప్ గారూ!

    ReplyDelete
  2. విశ్వరూప్ గారూ! మీరేమనుకోనంటే చిన్నసవరణ...
    మీ బ్లాగు వివరణ పద్యంలో..."నా కలానికి బలమునిచ్చి నడిపినట్టి"లో... "బలమునిచ్చి"కి బదులుగా "బలమిచ్చి"అని సవరించగలరు. అట్లే "జగమ్ము" అనుచోట "జవమ్ము" అని సవరించగలరు.

    సవరించిన పాఠం
    :
    మూగబోయిన కోటి తమ్ముల గళాల
    పాట పలికించి, కవితా జవమ్ము గూర్చి,
    నా కలానికి బలమిచ్చి, నడిపినట్టి,
    నా తెలంగాణ, కోటి రత్నాల వీణ!
    - దాశరథి

    అన్యథా భావింపవలదని మనవి.

    -గుండు మధుసూదన్

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా మధుసూదన్ గారూ. తప్పులు సవరించినందుకు మనసారా ధన్యవాదాలు.

      Delete
  3. సీమాంధ్ర నేతలు ప్రధానంగా పెట్టుబడిదారులు! వారికి హైదరాబాదే ప్రధానం!అక్కడ వారి పెట్టుబడుల రక్షణ వారి ఏకైక ధ్యేయం! సీమాంధ్ర లో రాజధానిని నిర్మించి అభివృద్ధి చేసుకోవడం వారికి ఇష్టం లేదు! తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ఆపలేకపోతున్నామని మల్లగుల్లాలు పడుతూ సరిగా నిద్ర కూడా పోవడం లేదు!

    ReplyDelete
    Replies
    1. Telangana netalu evaru ? KCR, ayana kutumbam, Venkataswamy, Dvendar Goud, Jaipal Reddy, Ponnala Lakshmaiah, Janardhan Reddy pettubadidarlo, doralo kakunda unnara ?

      Delete
    2. Telangana nayakulu induku bhinnam kaadu. Andolana perutho kotlu sampadincharu. Hyderabad, Warangal pranthallo kabzalu cheyani nayakulu endaru ? Venkataswami, Hygreevachari, Janardhan Reddy, Channa Reddyla lanchalu, kabzalu teliyava ? Idedo kevalam Kostha, Rayalaseema nayakule chestuntlu vanchana enduku ?

      Delete
  4. ఆంద్ర రాజకీయ దొంగలంతా నిఖార్సు ఐన తెలంగాణా సమర్ధకులు తమ్మి!!!!!!!!!!

    ReplyDelete

Your comment will be published after the approval.