Monday 10 December 2012

తెలంగాణకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు

న్యూఢిల్లీ: జంతర్ మంతర్లో తెలంగాణ విద్యార్థుల నిరాహారదీక్షకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ నేత మనీష్ సిసోడియా చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్రకు వేర్వేరుగా ఆమ్ ఆద్మీ పార్టీ శాఖలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. లోక్ పాల్, తెలంగాణ విషయాల్లో కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. అఖిలపక్షం పేరుతో కాలయాపన చేయడమే కాంగ్రెస్ ఎత్తుగడ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము కూడా పాలుపంచుకుంటామని చెప్పారు.

No comments:

Post a Comment

Your comment will be published after the approval.