Friday 11 May 2012

ఒక సగటు సమైక్యవాది మనోగతం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందుకు వ్యతిరేకమో ఒక సగటు సమైక్యవాదికి గల కారణాలు:

1) హైదరాబాదులొ నేను ఇల్లస్థలాలూ, ఫ్లాట్సూ కొనుక్కున్నాను. ఇప్పుడు విడిపోతే నా ప్రాపర్టీ ధరలు పడిపోతే? వామ్మో వాయ్యో... ( అంతా నా స్వార్ధమే... సామాన్య జనం ఎటుపోతే నాకేం).

2) ఇప్పటిదాకా మాకు తేరగా క్రిష్ణా జలాలు వస్తున్నాయి మాకు న్యాయమయిన వాటాలేకపోయినా. ఇప్పుడు మీరాష్ట్రం ఏర్పడితే మరి రాష్ట్రాల మధ్య నీల్లవాటా బోర్డు నిర్ణయిస్తుంది కదా. అప్పుడు ఇప్పటిలాగా మాకు తేరగా నీల్ల రావుకదా ఎలా, అమ్మో?(ఇప్పుడు మాకు దక్కాల్సినదానికంటే ఎక్కువ దక్కుతుందనేది నిజమేననుకోండి).

3) ఇప్పుడంటే  అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో అన్నిచోట్ల పై అధికారులు మావారే కాబట్టి మావాల్లు మెల్లగ దొడ్డిదారిలో దూరిపోతారు. లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎలాగూ ఉంది మావారికి ఉద్యోగాలు ఇప్పించడానికి. ఇవన్నీ కాకపోతే దొంగ సర్టిఫికెట్ పెట్టి తెలంగాణ కోటాలో ఉద్యోగం తెచ్చుకోవచ్చు.

రేపు రాష్ట్రం ఏర్పడితే మాప్రాంతంలోని ఉద్యోగాల్లోనే మాలో మేమే పోటీపడాలికదా, ఎలా మరి?

4) ఇప్పుడంటే తెలంగాణ మాతో ఉంది కాబట్టి అందరం కలిసి ఇక్కడ తినేస్తాం కానీ రేపు విడిపోతే మాలో మేమే (సీమ, ఆంధ్రా వాల్లం) మీరు దోచుకుంటున్నారంటే మీరని కొట్టుకుంటాం, అలా మేం కొట్ట్కోవడం అవసరమా?

5) ఇప్పుడంటే తెలంగాణాకు చెందాల్సిన ఫండ్సన్నీ మాకు వచ్చేస్తున్నాయి, విడిపోతే మాప్రాంతంలోని ఆదాయంపై మాత్రమే మేము ఆధారపడాలి, అలా అయితే ఎలా?

6) ఇప్పుడంటే సమైక్య రాష్ట్రంలో మాకులం వాల్లు బలమయిన స్థానంలో ఉన్నారు. అధికారం మాకులానికి లేక ఫలానా కులం వారికే ఎప్పుడూ దక్కుతుంది. రేపు రాష్ట్రాలు విడిపోయి చిన్న రాష్ట్రం అయితే బడుగు వర్గాలు మమ్మల్ని వెనక్కి నెట్టేసి అధికారం చేజిక్కించుకుంటే, అమ్మో ఎలా?

7) మాకు సొంత గుండెకాయ లేదే? ఇంతకుముందు మద్రాసే మాగుండె అనుకున్నాం. అది అందకపొయ్యేసరికి హైదరాబాదే మాగుండె అని ఇప్పుడనుకుంటున్నాం. ఇప్పుడు విడిపోతే మాగుండెకాయ వెతుక్కోవాలి, ఎక్కడుందో ఏమో?

66 comments:

  1. సమైక్య రాష్ట్రంలో ఒక కులంవాళ్ళు బలమైన స్థానంలో ఉండడం అంటే ఏమిటి? కమ్మవాళ్ళు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో కూడా ఉన్నారు. కానీ సమైక్యవాదులు తమకి కరీంనగరో, నిజామాబాదో కావాలనడం లేదు. మేడి పండు లాంటి హైదరాబాద్ మాత్రమే కావాలంటున్నారు.

    ReplyDelete
  2. > .....నీల్లవాటా....తేరగా నీల్ల రావుకదా
    >.... మాకులం వాల్లు .....
    > ఇప్పుడంటే APSEBలోనూ,......

    నీల్లు,వాల్లు! మీకు తెలుగు అక్షరాలు సరిగా రావా? తెలిసీ తెలియని భాషాపరిజ్ఞానంతో వ్రాయటమేనా?
    ఎక్కడుంది APSEB? ఏనాటి సంస్థ అది? తెలిసీ తెలియని విషయపరిజ్ఞానంతో వ్రాయటమేనా?
    అదీకాక మీపాటి గిలికే పాండిత్యం సమైక్యవాదులకు ఉండదని మీ తెలిసీ తెలియని ఆలోచనా?

    ReplyDelete
    Replies
    1. @శ్యామలీయం

      ఆర్యా,

      మీకు విషయం కంటే కూడా అచ్చుతప్పులు ముఖ్యంలాగున్నాయి. బ్లాగుల్లో బెత్తం పుచ్చుకొని తప్పులు సరిచేస్తామంటే ఎలా? APSEB కాకపోతే దానీ పిల్ల సంస్థలేవో ఉంటాయి. పేరు కాదు, విషయం ముఖ్యం అని మీరు గమనించాలి.

      ఇంతకుముందెప్పుడో మరో బ్ల్లగులో ఈపాటి కవిత్వం సమైక్యవాదులకు రాదా అంటూ పాండిత్యాన్ని చూపినట్టున్నారు!! పైగా గతంలో ఆంగ్లంలో కామెంట్లు రాసినందుకు పెద్ద లెక్చరే ఇచ్చారు. ఎంతైనా పెద్దలు.

      Delete
    2. మీకు నొవ్వు కలిగించినందుకు క్షంతవ్యుడను.
      విషయం ప్రధానమే, విప్రతిపత్తి లేదు.
      విషయం చెప్పేందుకు వాడే భాషపట్ల కూడా శ్రధ్ధవహించమని కోరటమే నా ఉద్దేశం.
      ఆహారం అంటే కావలసిన పోషకపదార్థాలను అందించే సాధనం మాత్రమే, పోషకాలే కదా ముఖ్యం అనుకొని యెలా వండినా సరే అనుకుంటున్నామా? కంటికి, జిహ్వకు హితవుగా ఉండాలని కోరుకుంటున్నాము కదా? అలాగే, విషయాన్ని అందించే సాధనమైన భాషపట్ల తగిన ఆదరమూ శ్రధ్ధా చూపాలని బ్లాగుజనులను నేను వేడుకొనేది. నేను బెత్తంపుచ్చుకుంటున్నాను అని మీరు అనుకోకుండా, తల్లి భాష కూడా సాక్షాత్తు తల్లి అనే భావించి శ్రధ్ధవహించాలని విజ్ఞప్తి. ఆపైన మీ యిష్టం. చదివే సందర్భంలో యిబ్బందికరంగా ఉన్న వాటిని ప్రస్తావించటం కేవలం మీకు ఉపయోగంగా ఉంఉందన్న భావన తోటే.

      నేను పండితుడను కాను. లెక్చరరునూ కాను. పదిమందికీ హెచ్చరిక చేసేంత పెద్దవాడనూ కాను. కేవలం నా అభిప్రాయాలు మీతో పంచుకుంటున్నాను - అంతే.

      Delete
    3. @శ్యామలీయం:

      ఇవే రకం అప్పుతచ్చులు రాసే సమై"ఖ్య"వాదులను తమరు సమానంగా విమర్శించి ఉంటె బాగుండేది. అలాగే తెలుగు జాతిని ఏకం చేద్దామని ఆంగ్ల పాండిత్యం చూపిస్తున్న చక్రవర్తి గారిని తెలుగులో ఎందుకు బ్లాగడం లేదో నిలదీస్తే చూడ ముచ్చటగా ఉంటుందని మీ అభిమానిగా నా కోరిక.

      మీలాంటి పెద్దలు ఈ విషయం పై దృష్టి పెడితే బాగుంటుందని అంటున్నాను తప్ప మీకు చెప్పేటంతటి వాడిని కాను.

      PS: ఇటీవల మీ షష్టిపూర్తి జరిగినట్టు తెలిసింది. Congratulations & wish you many more happy returns!

      Delete
    4. విశ్వరూప్ గారూ మే ౩న నా షష్టిపూర్తి జరిగింది. మీ అభిమానానికి కృతజ్ఞుడను. ధన్యవాదాలు.

      తెలుగు బ్లాగర్లు తెలుగును అందంగా వ్రాయాలని నా కోరిక. నా దృష్టికి వచ్చిన సందర్భాలను యెత్తి చూపుతున్నానే కాని సమైక్యవాదం విభజనవాదం అంటూ వివక్ష యేమీలేదు నాకు. ఈ చక్రవర్తిగారి బ్లాగు బహుశః నాకు పరిచయం లేదేమో. అయినా మనవాళ్ళు ఆంగ్లం చాలా జాగ్రత్తగానే వ్రాస్తారుగా తప్పులు సరిజూసుకుంటూ. తెలుగు దగ్గరే నిర్లక్ష్యం - అదే నా బాధ. మీ ముచ్చట యెందుకు కాదనాలి? చక్రవర్తిగారి బ్లాగు చిరునామా యివ్వండి. చదివి చూస్తాను.

      Delete
    5. @శ్యామలీయం గారు

      తప్పు రాస్తే తప్పు ఎత్తిచూపడం మంచిదే. కానీ ఆఎత్తు చూపడం సీమాంధ్ర తమ్ముళ్ళకు విసనకర్రతోనూ తెలంగాణ సవతి తమ్ముళ్ళకు విసుర్రాయితోనూ చెయ్యడం బాగోలేదు.

      మీకు విషెస్ చెప్పింది జై గారు. Congratulations from my side too.

      Delete
    6. @శ్యామలీయం:

      నలమోతు చక్రవర్తి గారి బ్లాగు: myteluguroots.com
      పరకాల ప్రభాకర్ గారి బ్లాగు: parakala.org

      వీరిద్దరూ తెలుగు జాతి సమై"ఖ్య"తను "కాపాడుదామని" కంకణం కట్టుకున్న యోధులు. అయితే బ్లాగులు మాత్రం ఆంగ్లంలోనే రాస్తారెందుకో.

      Delete
  3. vihajana jarigite aa rendu kulalaku kakunda badugulu ashikaram loki vacche pramadam undi. adi mottham jathike pramada karam .

    ReplyDelete
  4. vibhajana jarigite rendu kulalu kakunda badugulu adhikaram loki vacche pramadam undi. adi mottham jathike pramadam .

    ReplyDelete
  5. అబ్బ.. ఇరగదీసావ్ బాసు.. నీ ఊహాశక్తి కి హ్యాట్సాఫ్.. 4 కోట్ల మంది ఆలోచనల్ని 7 ముక్కలో చెప్పావ్.. ఇంత ఙ్ఞానం ఆనాడు దాశరధి, రావి నారాయణరెడ్డి, బూర్గుల గారికి ఉండుంటే విశాలాంధ్ర అంటూ కారుకూతలు కూసేవాళ్ళు కాదు.

    ReplyDelete
    Replies
    1. @satya

      అలాగా! ఇంతకూ నాలుగు కోట్లమంది ఎవరు? సమైక్యవాదులు నాలుగుకోట్లమంది ఉన్నారంటారా కొంపదీసి? అన్నా అంటారు మహానుభావులు...

      మాటిమాటికి ఈ విషాంధ మహాసభవారు దాశరధి, రావి నారాయణ రెడ్డి, బూర్గుల అంటూ దండకం చదువుతారెందుకో? ఇప్పటోల్లపేర్లు చెబితే నమ్మరనా?
      1) బూర్గుల చివర్లో విశాలాంధ్రకు అనుకూలంగా ప్రకటన చేసినా అది ఆయన సొంత అభిప్రాయం కాదు..మొదటినుండీ బూర్గుల విశాలంధ్రకు వ్యతిరేకం. సీమాంధ్ర నాయకుల లాబీయింగ్ వల్ల అధిష్టాణం విశాలాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ఒక కాంగ్రేస్ పార్టీకి చెందిన నేతగా అధిష్టాణం నిర్ణయాన్ని అమలు చెయ్యడానికి అలా చెప్పాడు.

      2) దాశరధి, రావి నారాయణరెడ్డి లకు మీనాయకులపాలన చూసిన అనుభవం లేదు కదా.. తెలుగు వారంతా కలిసే బాగుంటుందని కలలు గని ఉంటారు. బహుషా అప్పుడు పుట్టి ఉంటే నేను కూడా అదే చెప్పే వాడినేమో..కానీ ఇప్పుడు మేము యాభై ఏళ్ళుగా సీమాంధ్రనేతల పాలనలోని కష్టాలను అనుభవించినతరువాత వద్దంటున్నాము. ఎవరి మాట రైటంటారు? అనుభవంటొ చెప్పే ఇప్పటివారిమాటా, ఆశావహంతో చెప్పిన అప్పటి అతికొద్దిమంది మాటా (వేళ్ళతో లెక్కబెట్టగలిగేవాల్లు..అందుకే పదేపదే పేర్లు వల్లె వేస్తున్నారు) ?

      by the way మొన్న సెలవుల్లో నల్లగొండకి వెల్లినప్పుడు మాఊళ్ళో ఇక్కడ పదేళ్ళకిందే క్రిష్ణా నది పైపు లైను ప్రతిఊరికీ వేశారటగా, క్రిష్ణా నది నీళ్ళు తాగడానికి అన్ని ఊళ్ళలోనూ ఎప్పటినుంచో ఇస్తున్నారట గదా.. ఒక పెద్దమనిషి బ్లాగుల్లో చెప్పాడు అని చెప్పి పైపులకోసం వెతికితే ఎక్కడా కనపడలేదు. ఈసారి వచ్చినపుడూ కాస్త మీరు తోడువచ్చి పైపులైను వెతికి పెడతారా?

      Delete
    2. యావరేజ్ గా రోజు కు ఇద్దరు చొప్పున అమరులవుతున్న కూడా ఇంకా 4.5 కోట్ల మంది ఉన్నప్పుడు, ఉన్నచోట హాయిగా ఉన్నవాళ్ళు 4 కోట్ల మంది ఉండరా?

      //ఇప్పటోల్లపేర్లు చెబితే నమ్మరనా?
      ఇప్పటోళ్ళ పేర్లు చెప్పారు.. కచర వర్యులు 96 లో అసెంబ్లీ లో ఏం కూసింది, ఆగం గారు తాను ఎంతటి ఘాట్టి సమైక్యవాదో ప్రకటనలిచ్చింది, చెన్నా రెడ్డి గారు ఎలా చెయ్యిచ్చింది, కొండా బాపుజి కూసిన "సమ్మెకుడు" కూతలు అన్ని ఉన్నాయి..

      // దాశరధి, రావి నారాయణరెడ్డి లకు మీనాయకులపాలన చూసిన అనుభవం లేదు కదా.. తెలుగు వారంతా కలిసే బాగుంటుందని కలలు గని ఉంటారు.

      నీకు తెలిసిన చరిత్ర అది మరి.. పాపం వాళ్ళు అమాయకులై నమ్మారు.. జయశంకర్ అనే మేధావి బయలుదేరి ఆయన కన్ను మూసే లొపల మీ కళ్ళు తెరిపించాడు. రావి నారాయణ రెడ్డి వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ కాదు అన్నది 69 ఉద్యమం అప్పుడు... కమ్మని నా తెలంగాణ తెలంగాణ 9 జిల్లాలేనా, బహుళాంధ్ర కి తెలంగాణ మారుపేరు కాదా అని మీ ముందుతరం వేర్పాటు వాదుల్ని దాశరధి ప్రశ్నించింది అప్పుడే..

      వాళ్ళు చూసింది మా నాయకుల పాలనే.. మీ నాయకుల పాలన చూసే అదృష్టం చేసుకోలేదు..

      ఈ సారి సెలవులకు మా ఊరు వెళ్ళి చూస్తాను.. ప్రతి ఇంటికి కృష్ణా నది నించి డైరెక్ట్ గా కాలువ ఉందిట.. ప్రతి ఇంటి నించి ఒకడు APSEB లేక ఇంకో పిల్ల సంస్థ ద్వారా తెలంగాణ లో ఉద్యోగాలు చేస్తున్నారుట..

      ఒకసారి ఉద్యోగాళ్ళో లెక్కలు అడిగితే పెద్దమనిషి "నేను మడి.. వేరే వాళ్ళ బ్లాగులో చర్చించను అని పారిపోయాడు". మళ్ళీ అవే సొల్లు.. ఏం చేస్తాం.. అబద్దాల సృష్టికర్త అన్యాయం చేసి వెళ్ళిపోయాడు..

      Delete
    3. @satya

      చనిపోయినవారిగురించి వెటకారాలు చేస్తే పురుగులు పడిచస్తావు జాగర్త. సమైక్యవాదులు నాలుగు కోట్లమంది ఉన్నారని చెప్పడం అబద్ధాలకోర్లకే చెల్లింది.. మీ పరకాలను సమైక్యవాదానికి అనుకూలంగా ఒక పార్టీ పెట్టమను , ఎన్ని వోట్లొస్తాయో చూద్దాం. మర్యాదగా సమాధానం ఇచ్చినప్పుడు మర్యాదగా బదులు ఇవ్వడం కూడా మన వెధవబుద్ధులకు చేతకాదు.

      పార్టీ అధినేతలే గంటల్లో మాటలు మార్చగా ఒక మనిషి వేర్వేరు పార్టీల్లో వేర్వేరు మాటలు మాట్లాడడం పెద్ద విషయమా? కచరా సీమాంధ్రబాబు పార్టీలో ఉన్నప్పుడు సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడితే మీ పరకాల ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదా? పార్టీ స్టాండును మాట్లాడితే దాన్ని వ్యక్తులకు (రావి నారాయణ రెడ్డి, ఒండా లక్ష్మణ్, కచరా, బూర్గుల) ఆపాదించడం విషాంధులకే చెల్లింది. సమైక్యాంధ్ర ఎందుకో సొంతంగా నాలుగు ముక్కలు చెప్పడ చేతగాక దానికి రావినారాయణ రెడ్డి, దాశరధిల మద్దతు అరువు తెచ్చుకుంటారా!!

      నాది గాకపోతే ఢిల్లీదాకా దేకమన్నాడట ఎవడో. అలాగే కొందరు అబద్దాలకోర్లమాటలు ఇలా ఉంటాయి..

      విషయం తెలంగాణ గురించి అయితే: " క్రిష్ణా నీళ్ళు లేకపోటే వ్యవసాయం కుదరదా? చమ్మతో కూడా వ్యవసాయం చేసుకోవచ్చు..ఇజ్రాయెల్లో అలాగే చేస్తారుట!!"
      విషయం కోస్తాంధ్ర గురించి అయితే: "వ్యవసాయం లాభసాటి అని ఎవరు చెప్పారు? డెల్టాలో అందరూ క్రాప్ హాలిడేస్ ప్రకటిస్తుంటేనూ".

      అబద్దాలకోర్లు ఏమయినా చెబుతారు. ఎంతయినా మహానుభావులు.

      సీమాంధ్రలో ఇంటింటికీ ఒకడు APSEBlO ఉద్యోగం చేస్తున్నాడు, ప్రతి ఊరికీ కాలువ వస్తుంది అని నేను చెప్పలేదు, నల్లగొండలో ప్రతి ఊరికీ పదేళ్ళకిందే క్రిష్ణానుండి తాగునీల్లొస్తున్నాయని చెప్పింది నువ్వే..ఇక్కడ ఎవరు అబద్దాలకోరులు? ఇలాంటి అబద్దాలకోరులతో చర్చలు కూడానా? చర్చిస్తే నువ్వు ఒప్పుకుంటావా, నేను చెప్పనివాటిని నాకు అంటగట్టడం తప్ప? ఎలాగూ విషాంధమహాసభలో విషం గక్కుతున్నావు కదా, ఇంకా ఇక్కడెందుకు? బై.

      Delete
    4. >> చనిపోయినవారిగురించి వెటకారాలు చేస్తే పురుగులు పడిచస్తావు జాగర్త.

      అబ్బ ఛ!! నీ పిల్లి శాపనార్దాలకు ఇక్కడెవ్వరూ భయపడరులె.. Anyways...To Clarify, నాకు చనిపోయిన వాళ్ళ మీద ఏ మాత్రం ద్వేషం లేదు.. కాని వాటిని తెలంగాణ ఖాతా లోకి మళ్ళించే చావు తెలివితేటలు చూపించే వాళ్ళకోసం చేసిన వ్యాఖ్య అది. అసలకు ఆంధ్ర వాళ్ళేదో గుంపగుత్త గా మీ సొమ్మేదో దోచుకున్నట్లు "సగటు" సమైక్యవాదిని నువ్వు ఊహించినప్పుడే నీ వెధవ బుద్ది బయటేసుకున్నావ్..

      బూర్గుల విశాలంధ్ర కి "మొదటినించి వ్యతిరేకమా"? నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు ఉంది.. ఒక్క బూర్గులే కాదు.. మొదటినించి కేవీ రంగారెడ్డి, నర్సింగ రావు, చెన్నారెడ్డిలు కూడా విశాలంధ్ర కి అనుకూలురే.. వట్టికోట ఆళ్వారు స్వామి కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు 1950 లోనే వీళ్ళు అంతా విశాలాంధ్ర కి మద్దతు పలికినవాళ్ళే.. కేవలం ఫజలాలి కమీషన్ తర్వాతే "ప్రత్యేక" వాదం వినిపించింది.

      ఒహో.. తెగ పార్టీ విధేయులు మరి.. మంత్రి పదవి ఇస్తే పార్టీ స్టాండు.. డిప్యూటి స్పీకర్ అయితే సొంత స్టాండు.. అవసరాల్ని బట్టి స్టాండులు మారుతుంటాయి. (కొండా లక్ష్మణ్, కచర, నాగం, దేవేందర్ గౌడ్)

      //రావినారాయణ రెడ్డి, దాశరధిల మద్దతు అరువు తెచ్చుకుంటారా!
      మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుల మాటలు కోట్ చేస్తే అరువు తెచ్చుకున్నట్లా? మరి ఎందుకూ పనికిరాని కత్తి పద్మారావులు, ఇంకెవరో రాయలసీమ రెడ్డి, హర్ష వర్ధన్ లాంటి వాళ్ళ మాటలు పట్టుకొచ్చి సీమాంధ్ర లో సమైక్యవాదం లేదని చెప్పే దేబిరింపు ఎందుకు? అంత లేనప్పుడు విజయవాడ వస్తా అని పత్తా లేకుండా పారిపోవటం ఎందుకు?

      అబద్దాల కోర్లు ఎలా ఉంటారో ఇంకో ఉదాహరణ.. పంటకి మార్కెటింగ్ ముఖ్యమని చెప్తే తెలంగాణ కి నీళ్ళు వద్దన్నా అని ప్రచారం చేసుకుంటారు.

      సిగ్గులేకుండ ఇచ్చిన రిఫరెన్సుల్ని కూడా డిలీట్ చేసి మా వాదనే కరక్ట్ అని చంకలు గుద్దుకునే మీ బ్లాగుల్లో చర్చ అని మాట్లాడటం కన్నా కామిడి ఇంకోటి లేదు.

      >> చర్చిస్తే నువ్వు ఒప్పుకుంటావా, నేను చెప్పనివాటిని నాకు అంటగట్టడం తప్ప

      అంటగట్టే బుద్దులు ఎవరివి? నేను ఫ్లోరైడ్ గ్రామల సంగతి మాట్లడితే "ప్రతి ఊరు" కి కృష్ణా నీళ్ళొస్తున్నాయని చెప్పానని నీ అబద్దాల కోర్ల బుద్ధి బయటపెట్టుకోలేదా?

      >> ఎలాగూ విషాంధమహాసభలో విషం గక్కుతున్నావు కదా, ఇంకా ఇక్కడెందుకు? బై.

      ఈ మధ్య నువ్వు నీ మడి వదిలేసి విశాలంధ్ర బ్లాగులో నీ పరిఙ్ఞానం ప్రదర్సిస్తుంటేనూ, పోనీలే చర్చించే ధైర్యం వచ్చిందేమో అనుకున్నా.. రెండు వ్యాఖ్యాల్లో నీ ఉద్దేశ్యం బయటపెట్టావ్.

      Delete
    5. >>> మీ పరకాలను సమైక్యవాదానికి అనుకూలంగా ఒక పార్టీ పెట్టమను , ఎన్ని వోట్లొస్తాయో చూద్దాం.

      సరే ప్రస్తుత రాజకీయాలకే వద్దాము!
      రాబోయే పరకాల ఉపఎన్నికలో ఎవరు గెలిస్తే తెలంగాణ వాదం గెలిచినట్టు?
      లేదా ఎవరు గెలిస్తే తెలంగాణ వాదం ఓడినట్టు?
      సూటిగా ఇప్పుడే చెప్పండి.

      కోట శ్రీనివాసరావు జోకు ఒకటి ఉంది. "బందరు పిల్లలు బందరులోనే పుడతారు. ఇంకెక్కడా పుట్టారు!"
      అలాగా "ఎవరు గెలిచినా తెలంగాణ వాదమే గెలిచింది" అనొద్దు.
      జాక్ పెద్దలు సమైక్యవాద పార్టీలకు బుద్ది చెప్పాలి అంటున్నారు.
      అంటే సమైక్యవాద పార్టీలు ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి అనే కదా.

      కావున నా ప్రశ్న మరొక్క సారి.
      ఎవరు గెలిస్తే తెలంగాణ వాదం ఓడినట్టు?

      Delete
    6. @satya

      1) ఒకరితో ఏదయినా చర్చించాలంటే కనీసం ముందు ఎదుటి వ్యక్తిని గౌరవించి, వాదన చెయ్యాలి. ఇక్కడ ఎదుటివ్యక్తిని "మీరు" అనడం మర్యాద. నేణు ఇంతకుముందు పోస్టులో నువ్వు, ఎవ్ధవ బుద్ధి అనడానికి కారణం నేణు మర్యాదపూర్వకంగా సమాధానం ఇచ్చినప్పటికీ మీరు బదులులో ఆమర్యాద నిలుపుకోకపోవడం వల్లే. ఇలాంటి భాష ఉపయోగిస్తే ఎవరైనా మీకామెంటును ప్రచురించరు. అందులో పెద్ద ఆశ్చర్యం లేదు.

      2) మీ దేవందర్ గౌడ్ సమైక్యాంధ్రకు మద్ధతు ఇచ్చాడు, మీకడియం, రేవంత్ రెడ్డి, మరో ఎల్లయ్య, పుల్లయ్య మద్దతు ఇచ్చాడు లాంటి వాదనలతో టైం వేస్ట్ చెయ్యవద్దు. అసలు దేవేందర్ గౌడ్, కడియంల రిఫరెన్స్ అవసరమా? వారిని ఎవరైనా తెలంగాణ వాదులుగా గౌరవిస్తున్నారా? ఎవరో ఎల్లయ్య చెప్పాడని ఇక్కడెవరూ తెలంగాణ కావాలనడంలేదు. మీ విషాంధ మహాసభ ఓనరే మరో పార్టీలో ఉండగా తెలంగాణకు మద్దతివ్వగా లేనిది ఈరాజకీయ నాయకులు పార్టీ మాట చెబితే అది పెద్ద విషయమా? సమైక్యాంధ్ర ఎందుకు కావాలో ఇంతవరకూ విషాంధ మహాసభ ఒక్క కారణం చెప్పలేకపోయింది, ఎల్లయ్య, పుల్లయ్య ఇలా చెప్పారు అనడం తప్ప. అది చెప్పలేనంతవరకూ సగటు సమైక్యవాది మనోగతం పైనచెప్పిందే.



      3) /* మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుల మాటలు కోట్ చేస్తే అరువు తెచ్చుకున్నట్లా? మరి ఎందుకూ పనికిరాని కత్తి పద్మారావులు, ఇంకెవరో రాయలసీమ రెడ్డి, హర్ష వర్ధన్ లాంటి వాళ్ళ మాటలు పట్టుకొచ్చి సీమాంధ్ర లో సమైక్యవాదం లేదని చెప్పే దేబిరింపు ఎందుకు? */

      కత్తి పద్మారావు వ్యక్తిగత హోదాలో తెలంగాణకు మద్దతివ్వలేదు. కత్తి పద్మారావు ఒక పార్టీ తరఫున పార్టీ స్టాండును తనమాటగా చెప్పలేదు. దళిత మహాసభ అధ్యక్షునిగా దళితమహాసభలో ఆతీర్మానం చేశాడు. అది మెజారిటీ సీమాంధ్ర దళితుల అభిప్రాయాన్ని సూచిస్తుంది. పైగా అది ఇప్పటిమాట. కత్తి పద్మారావు తెలంగాణకు మద్దతిస్తున్నాడు గనక మీరూ ఇవ్వాలని ఎవ్వరూఒ చెప్పలేదు, సీమాంధ్రలో దళితులు తెలంగాణకు అనుకూలం అని చెప్పడం కోసం దళితమహాసభ చేసిన తీర్మానాన్ని ఉటంకించారు. తేడా తెలుసుకోండి.

      అప్పటి రాజకీయనాయకులు పార్టీలో కొనసాగినంతకాలం పార్టీ స్టాండునే బయటికి చెప్పారు. same goes with KCR. పార్టీ స్టాండును వ్యతిరేకించినపుడు పార్టీకి, ప్రభుత్వానికి రాజీనామా చేశారు. వాల్లు ఇప్పటివారిలా ప్రభుత్వంలో మంత్రుల్లా ఉంటూ సొంతపాట పాడలేదు.. రెండు కల్ల సిద్ధాంతాలు చెప్పలేదు, పూటల్లోనే మాతలు మార్చలేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు జై తెలంగాణా అని ఏపార్టీ ఇప్పుడు దగ్గరికి రానీకపోవడంతో విషాంధ మహాసభ పెట్టినట్టు ఆత్మవంచన చేసుకోలేదు.

      Any way thanks for discussion and sharing your opinions. I cannot continue further and waste my time. I have no interest in wasting my time answering to some individuals.

      Delete
    7. గౌరవించటాలు గురించి తెలంగాణ వాదుల వద్ద నేర్చుకోవాలా? అయినా తెలంగాణ లో "మీ", "మీరు" బదులు "నీ", "నువ్వు" అనే వాడకం ఎక్కువ కదా.. అందుకే మీ బాష లో చెప్పాను.. అయినా మీరు ఇలాంటి పోస్టులు వేస్తే సమాధానాలు అలానే ఉంటాయి మరి..

      Btw.. I can give u the link of vasavya blog where u got away from discussion when I asked u for the proof in injustice in employment though i haven't used a single abusive word against u. You can't answer to an individual and feels urself as if u can answer to groups.

      >>ఎల్లయ్య, పుల్లయ్య ఇలా చెప్పారు అనడం తప్ప.
      Thanks for showing ur respect towards ppl like Dasarathi and raavi.. mind u.. kaloji is also another malliah with a different stand.

      అసలు చెప్పాల్సింది సమైక్యాంద్ర ఎందుకని కాదు.. తెలంగాణ ఎందుకని? పాత చింతకాయపచ్చడి లాగా అవే ఆధారాల్లేని ఆరోపణలు చేస్తూ పొద్దు పుచ్చేకన్నా ఏ చర్చ లో అయినా నిలిచారా?

      >>దళిత మహాసభ అధ్యక్షునిగా దళితమహాసభలో ఆతీర్మానం చేశాడు.

      ఘంటా చక్రపాణి ఇంటర్వ్యు లో తన వాదం తో సీమాంధ్ర లోని తన దళిత సోదరులు కన్విన్స్ కాలేదని ఆ కత్తి పద్మారావే చెప్పాడు.. Also he himself clarified majority in kosta and seema are favouring samaikya andhra.

      అయిన అంతెందుకు.. మరి ఇదే కత్తి పద్మా రావు ని ప్రత్యేకాంధ్ర వాదం తో పోటి చేసి గెలిచి నిరూపించచ్చు కదా.. అప్పుడు అది మజారిటీ దళితుల అభిప్రాయమో కాదో తేలిపోతుంది.

      >>పార్టీ స్టాండును వ్యతిరేకించినపుడు పార్టీకి, ప్రభుత్వానికి రాజీనామా చేశారు.
      పార్టీ లో తమ ప్రాపకానికి, పదవులకి, రాజకీయ భవిష్యత్తు కి ఏ లోటు లేనంత కాలం పార్టీ పాట పాడారు.. అది అవసరం లేకపోతే రంగులు మార్చారు.

      రెండు కళ్ళ సిద్దాంతమా? పాలమూర్ లో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలీక తమ జాక్ చెప్పిన సిద్దాంతం ఏంటో?

      >> I have no interest in wasting my time answering to some individuals.
      same here.. bye

      Delete
    8. @satya

      @సత్య

      /**గౌరవించటాలు గురించి తెలంగాణ వాదుల వద్ద నేర్చుకోవాలా?**/

      ఏం, నేర్చుకోకూడదా? నేర్చ్కుంటే మీకిరీటం పడిపోతుందా, మీపెద్దరికం తగ్గిపోతుందా? ఇలాంటి అహంకారపు ప్రవర్తన వల్లే తెలంగాణ ప్రజలను దూరం చేసుకున్నారు. తెలంగాణ వాదులైనా, సమైక్యవాదులైనా వారి వారి వాదనలు, ప్రవర్తనలూ వేర్వేరు అంశాలు.

      ఎవరు ఎవరిని గౌరవిస్తున్నారో ఇక్కడ తెలియట్లేదా? నాబ్లాగులో నామీదే దాడి చేస్తూ, పక్క బ్లాగుల్లో వాడు, వీడు అంటూ కూతలు కూస్తూ? రోజూ తెలబాన్లూ అంటూ తిట్టిపోసేప్పుడు ఎక్కడికి పోయింది ఈఅహంకారం? ఎనత్మంది తెలంగాణవాదులు సమైక్యవాదులను కట్టగలిపి తిడుతున్నారు? తెలంగాణవాదులు ఎవరైనా విషయం మీదే విమర్శలు చేశారు తప్ప సమైక్యవాదులను తిట్టిపొయ్యలేదు ఎవరు ఎవరిదగ్గర నేర్చుకోవాలి గౌరవం?

      /**I can give u the link of vasavya blog where u got away from discussion when I asked u for the proof in injustice in employment though i haven't used a single abusive word against u. **/

      Thanks for the discussion, it was good. The problem with samaikyavada blogs is that even if you don't use abusive words there will be several others like raktacharitra, achamga, Snkr who use abusive words. You can check the same place. It is always we who take the pain just because we are less in number and samaikyavaadis overpower with their numbers everywhere..whether in assembly or in blogs.

      Regarding the discussion, I did give you enough proof about injustice in irrigation for which you didn't give reply. I cannot spend days just to convince you. Employment data given by you is of only two departments and there are several other cases that won't come into record.

      By the way there is no need to be anonymous to discuss with me. It does not change anything. My blog is not like achamgaa's blog. Sevaral samaikyavadi's come and comment here. If I have time I reply otherwise I won't. We don't brand samaikyavadis like some samaikyavadis call us telabans. Here there are no snkrs and raktacharitras to use abusive words.

      /**అసలు చెప్పాల్సింది సమైక్యాంద్ర ఎందుకని కాదు.. తెలంగాణ ఎందుకని? **/

      పొరపాటు. తెలంగాణ మాహక్కు. తెలంగాణకు సమైక్యాంధ్రలో అన్యాయం జరిగిందని చిదంబరం ప్రకతన తరువాత హో మినిష్టీనే చెప్పింది. శ్రీక్రిష్ణ కమీషన్ తన డ్యూటీ చెయ్యలేదు అని చిదంబరం, జేపీ తో సహా అందరూ చెప్పారు. మేం విడిపోగూడదని మీరనుకుంటే అందుకు మీరు కన్విన్స్ చెయ్యాలి, ఎందుకు విడిపోగూడదో చెప్పాలి. అంతవరకూ పైన చెప్పిన ఏడు ముక్కలే మీ విశాలాంధ్ర ఉద్యమానికి అసలు కారణాలు.

      /**అయిన అంతెందుకు.. మరి ఇదే కత్తి పద్మా రావు ని ప్రత్యేకాంధ్ర వాదం తో పోటి చేసి గెలిచి నిరూపించచ్చు కదా.. అప్పుడు అది మజారిటీ దళితుల అభిప్రాయమో కాదో తేలిపోతుంది. **/
      చెయ్యొచ్చు. అలాగే పరకాల సమైక్యవాదం ద్వారా గెలిచి చూపించొచ్చు. అదికూడా తెలంగాణలో ఎలాగూ సాధ్యంకాదు కాబట్టి సీమాంధ్రలో చూపెడితే చాలు.

      /**రెండు కళ్ళ సిద్దాంతమా? పాలమూర్ లో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలీక తమ జాక్ చెప్పిన సిద్దాంతం ఏంటో?**/

      అసలు ఈరెంటికీ ఏదైనా పోలిక ఉందని కనీసం మీరు నమ్ముతున్నారా? ఒకేవాదానికి కట్టుబడిన రెండు పక్షాలు పోటీలో ఉంటే ఆవాదానికి మద్దతిచ్చే జాక్ ఎటూ తేల్చుకోలేదు. ఇందులో తప్పేమన్నా ఉందా? ఉంటే ఏమిటి?


      ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నవారొ మేము రెండువైపులా ఉద్యమం చేస్తాము అంటే దాని అర్ధం ఏమిటి? రెండు వైపులా ఉద్యమాలు చేసి ఎవరిని మోసగిస్తారు?

      Delete
    9. Sorry.. This is not reply to ur post.. but for ur following claim..

      " I did give you enough proof about injustice in irrigation for which you didn't give reply."

      Here is the link of the blog..

      http://vasavya.blogspot.com/2011/07/blog-post_26.html

      Can you please point out where u have given ENOUGH information regarding injustice in irrigation

      Delete
  6. "వీర తెలంగాణా నాది, వేరు తెలంగాణా నాది, వేరయినా వీర తెలంగాణే ముమ్మాటికీ" అంటూ కాళోజీ ఎప్పుడో రావి నారాయణ రెడ్డికి సమాధానం ఇచ్చాడు. ఇంకా రావి పాత పాట ఎందుకు?

    బూర్గుల రామకిషన్ రావు "త్యాగాన్ని" గురించి ఆయన పేరు కూడా సరిగ్గా తెలియని వారు ఇటీవల తెగ పొగిడేస్తున్నారు. కేవలం ఒక్క సంవత్సరం పదవిని అనుభవించి AP రాష్ట్రం కోసం దాన్ని వదులుకున్న బెజవాడ గోపాల్ రెడ్డి ముందు నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాక ఒక్క ఏడాది మాత్రమె "త్యాగం" చేసిన బూర్గుల దిగదుడుపే. అయితే బూర్గులను భుజానికి ఎత్తుకుంటే వచ్చే ప్రచారం బెజవాడ పేరుతొ రాదు మరి. అందుకే బూర్గుల భజన మండలి మొదలయింది.

    ReplyDelete
    Replies
    1. >> ఇంకా రావి పాత పాట ఎందుకు?

      మరి తాను సమైక్యవాదిగా మారానని చెన్నారెడ్డి చెప్పుకున్న తర్వాత కూడా మీరు ఆయన నడిపించిన 69 పాట అరిగిపొయిన రికార్డులా పాడటం లేదా? అయినా పాపం, అంతటి వేరు తెలంగాణ వాది అయినా కాళోజి పాపం వలస వాది (తెలంగాణ వాదుల లెక్కలకోసం) అయిన జలగం వెంగళ్రావ్ చేతిలో డిపాజిట్టు కోల్పోయాక ఇంక ఆయన పాటెందుకు..

      >> AP రాష్ట్రం కోసం దాన్ని వదులుకున్న బెజవాడ గోపాల్ రెడ్డి ముందు నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాక ఒక్క ఏడాది మాత్రమె "త్యాగం" చేసిన బూర్గుల దిగదుడుపే.

      Sorry..Bezawada is a contender for chief minister post, but not burgula.

      Delete
    2. చన్నా(చందా)రెడ్డి గారి పాటలు మేము పాడడం లేదు. ఆయనే "మా పాట" కొద్ది రోజులు పాడాడు.

      తెలంగాణా వాదం ఎవరి సొత్తూ కాదు. వ్యక్తులకు, వారివారి ఒకప్పటి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వడం తమబోటి వారికే చెల్లింది.

      BTW, both Ramkishenrao & Gopal Reddy were "adequately copensated" for their "sacrifice".

      Delete
    3. ఎక్కడుంది తెలంగాణ వాదం? 1972 లో 40 స్థానాల్లో పోటి చేసి 28 స్థానాల్లో దిపాజిట్టు కోల్పోయినప్పుడు ఏమైంది తమరి వాదం? బల్దియా ఎన్నికలనుంచి పారిపోయినప్పుడు ఎమైంది ఈ తెలంగాణ వాదం? గెలిపిస్తే 100 రోజుల్లో తెలంగాణ తెస్తామన్నా ఒక్క సీట్ కూడా దక్కనప్పుడు ఎక్కడికెళ్ళింది ఈ తె వాదం? ఊరికూరికే మనోభావాలు దెబ్బతగిలించుకుంటున్న ఈ రోజుల్లో, తెలంగాణ వస్తే వీసాలు కావలన్నప్పుడు ఒక్కరూ హర్ట్ కాలెదెందుకో?

      ఫజలాలి చెప్పిన సగం వ్యాఖ్యాలు, నెహ్రూ చెయ్యని ప్రసంగాలు లాంటివి చెప్పి మీ పండితుడు జనాన్ని రెచ్చగొట్టలేదా? మీరు చెప్పినట్లు 50 సంవత్సరాల క్రితం SRC ఎందుకు? కొత్తగా వేసిన SKC" ఉండగా..

      అసలు మీకు పాట అనేది ఉంటేగా? రాజకీయనాయకులు ఆడించినట్లు ఆటలు ఆడటం తప్ప? అవును.. తెలంగాణ వాదం ఎవడి సొత్తూ కాదు.. ఎవడికి అవసరమైనప్పుడు వాడు వాడుకొనే......

      Delete
    4. @satya

      /**ఎక్కడుంది తెలంగాణ వాదం? 1972 లో 40 స్థానాల్లో పోటి చేసి 28 స్థానాల్లో దిపాజిట్టు కోల్పోయినప్పుడు ఏమైంది తమరి వాదం? **/

      /**తెలంగాణ వస్తే వీసాలు కావలన్నప్పుడు ఒక్కరూ హర్ట్ కాలెదెందుకో? **/

      ఒక క్రికెట్ మాచ్ జరుగుతుంటే ప్రేక్షకులకు తమటీం ఓడిపోతున్నప్పుడూ, గెలుస్తున్నప్పూడూ కూడా గెలవాలనే ఉంటుంది. కానీ దగ్గరిదాకా వచ్చి ఓడిపోతే ఉండే బాధ వేరు. అది చూసి అనుభవించినవాడికే తెలుస్తుంది. అలాగే తెలంగాణ వాదం అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది, తేడా ఇప్పుడు దగ్గరిదాకా వచ్చి కొందరు మోసగాళ్ళు, నయవంచకుల కుట్రపూరిత మోసపు నాటకాలవల్ల జారిపోయింది. మీప్రశ్నకు సమాధానం ఈతేడాలోనే ఉంది. ఇది నేణు చెప్పినా మీకర్ధమవుతుందనుకోను. చస్తుంటే కండ్లల్ల వేల్లుబెట్టి జూసే వారికి పక్కోడు చస్తోంటే అందులో కూడా ఈచావుద్వారా ఎక్కడ తెలంగాణవాదం బలపడుతుందో అనే కుళ్ళే కనిపిస్తున్నప్పుడు అలాంటివారికి ఎన్ని చెప్పినా వేష్టు.

      /**నాకు చనిపోయిన వాళ్ళ మీద ఏ మాత్రం ద్వేషం లేదు.. కాని వాటిని తెలంగాణ ఖాతా లోకి మళ్ళించే చావు తెలివితేటలు చూపించే వాళ్ళకోసం చేసిన వ్యాఖ్య అది. **/

      అసలు చనిపోయినవారిమీద ఎవరికైనా ద్వేషం ఉంటుందా, ఉండాల్సింది జాళి, అది మీకూ, మీలాంటి ఇతరులకు ఎంతమాత్రమూ లేదన్నది జగమెరిగిన సత్యము. చచ్చి ఒకడేడుస్తుంటే అందులో ఎక్కడ తెలంగాణ వాదం పెరుగుతుందో అని నీచమయిన పోస్టులు రాయడం ఒక్క విషాంధ మహాసభకే చెల్లింది.

      తెలంగాణకోసం పార్లమెంటుముందు ఉరేసుకుని చస్తే దాన్ని తీసుకేళ్ళి సమైక్యాంధ్ర ఖాతాలో వెయ్యాలా లేక విశాలాంధ్ర ఖాతాలో వెయ్యాలా? పార్లమెంటుముందు ఒక వ్యక్తి చనిపోతే అందరూ బాధగా ఉన్న సమయంలో చావులను వెక్కిరిస్తూ రాసింది ఎవరు? ఒక పక్క సమ్నైక్యత మరోపక్క ద్వేషం, ఎవరిబాగుకోసం ఈసమైక్యనాటకాలు?


      రోజూ పొద్దున లేస్తే మీవిషాంధమహాసభలో ప్రొఫెసర్ జయశంకర్‌ను ఆడిపోసుకుంటారు. కానీ అసలు ఈరోజు తెలంగాణవాదం ఇంతబలపడడానికి కారణం ప్రొఫెసర్ జయశంకర్,కేసీఆర్ కాదు. యాభై ఏళ్ళనుంచీ జయశంకర్, పదేళ్ళనుంచీ కేసీఆర్ అదే చెబుతున్నారు, అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో పిల్లవాడు సైతం ఆంధ్రోలు దోచుకుంటున్నారని అంటే అందుకు కారణం వాళ్ళు కాదు, మీదొంగ ఉద్యమం, నయవంచన, పూటల్లో మాటలు మార్చిన నాయకులు.

      అవును తెలంగాణవాదం ముందు ఇంతగా లేదు, గ్రేటర్ ఎలక్షన్లలో టీఆరెస్కు దిక్కు లేదు. కానీ ఇప్పుడు మీదొంగ ఉద్యమంతో తెలిసింది. మీకు ఈపొత్తులో ఎంత లాభం లేకుంటే ఇలా దొంగనాటకం ఆడుతారు? చక్కగా చిదంబరం ప్రకటనతరువాత అన్నదమ్ముల్లా విడిపోయి ఉంటే ఇద్దరికీ బాగుండేది, మిమ్మల్ని ప్రజలు అసహ్యించుకునేలా చేసుకుంది మీరే.

      నాబ్లాగులో మీకోటా అయిపోయింది, దయచేయండి.

      Delete
  7. @విశ్వరూప్:

    "మీ పరకాలను సమైక్యవాదానికి అనుకూలంగా ఒక పార్టీ పెట్టమను , ఎన్ని వోట్లొస్తాయో చూద్దాం."

    పరకాల మిత్రుడు ఒకాయన సమై"ఖ్యాం"ధ్ర సమితి అనే పార్టీ పెట్టినప్పుడు ఏమయింది? మళ్ళీ ఇప్పుడు మీరు ఇట్ల చాలెంజి చేస్తే ఎట్ల?

    ReplyDelete
    Replies
    1. జై గారు, సమైక్యవాదులు అంత అమాయకులు కాదు. "తెలంగాణా కోసం ఏడు వందల మంది కాదు, ఏడు వేల మంది ఆత్మహత్య చేసుకున్నా తెలంగాణా రాదు కానీ సమైక్యాంధ్ర కోసం ఒక్కడు కూడా ఆత్మహత్య చేసుకోకపోయినా రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది" అని అంటారు. వాళ్ళు పి"చ్చిదంబరం"తో చేసిన లాబీ మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది. ఖమ్మం జిల్లాకి చెందిన నామా నాగేశ్వరరావు అనే కమ్మ ఎం.పి. తెలంగాణా రాకుండా ఉండేందుకు చిదంబరంతో మాట్లాడాడు. ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో ఉండే కమ్మవాళ్ళకి చంద్రబాబుతో ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకిస్తున్నారు. అయితే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో ఉన్న కమ్మవాళ్ళు మాత్రం తెలంగాణాకి అనుకూలంగా ఉన్నారు.

      Delete
  8. నేనేమీ కమ్మవాళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చెయ్యడం లేదు. గూగుల్ ప్లస్‌లో పల్లా కొండలరావు అనే ఒకాయన తెలంగాణావాదం విషయంలో నా మీద వ్యక్తిగత విమర్శలు చేసి మా ఉత్తరాంధ్ర ప్రాంతంవాళ్ళని కించపరిచే భాష ఉపయోగించాడు. ఆయన తాను ఖమ్మం జిల్లాకి చెందిన వ్యక్తినని చెప్పుకున్నాడు. నిజంగా ఒక వెనుకబడిన ప్రాంతంవాళ్ళు ఇంకో వెనుకబడిన ప్రాంతంవాళ్ళని కించపరిచే భాష ఉపయోగిస్తారా అనే సందేహం వచ్చి అసలు పల్లా అనే ఇంటి పేరు ఉన్నవాళ్ళు ఖమ్మం జిల్లాలో ఉన్నారో, లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. గూగుల్ సెర్చ్‌లో పల్లా అని వెతికితే ఆ ఇంటి పేరు ఉన్నవాళ్ళు కమ్మవాళ్ళని తెలిసింది. కమ్మవాళ్ళు చంద్రబాబుతో ఉన్న అనుబంధం కారణంగా రాష్ట్ర విభజనని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారని నాకు తెలుసు. ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో కూడా కులం కారణంగా రాష్ట్ర విభజనని వ్యతిరేకించేవాళ్ళు ఉన్నారనడానికి నలమోతు చక్రవర్తి, పల్లా కొండలరావు వంటివారే నిదర్శనాలు. నలమోతు అనే ఇంటి పేరు గలవారు కూడా కమ్మవారే. ప్రాంతీయతత్వానికే కాకుండా కులతత్వానికి కూడా సమైక్యవాదం ముసుగు వేస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. ప్రవీణ్ గారూ !

      ఎన్ని సార్లు చెపుతావీ అసత్యాన్ని. నేను ఏ ప్రాంతం వారిని ఎప్పుడూ దూషించలేదు. వెనుకబడిన ప్రాంతం వాళ్లే కాదు ప్రవీణూ, ఎవరూ ఎవరిని ఎప్పుడూ కించపరచకూడదు.

      మీతో వాదిస్తే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమంటే కొంచేం కష్టమే అని ఖచ్చితంగా చెప్పగలను. కులాలతో ఉద్యమాలకు,అదీ కమ్యూనిస్టునని చెప్పుకునేవాడికి ఏం పని?

      తెలంగాణా ఉద్యమం లోనూ, ప్రస్తుతం సమైఖ్యవాదులమని నాటకాలాడుతున్న వారిలోనూ అన్ని కులాలవారున్నారు. ఎక్కడైనా సినిమా అభిమానులతో సహా అన్ని కులాల వాళ్లు ఉంటారు. కులాలను రెచ్చగొట్టడం - ఇంటర్నెట్లో వెతకడం అజ్ఞానం తప్ప మరోటి కాదు.

      పల్లా అని వెతికితే కమ్మ అని తేలిందా? ఆహా!మీ బుర్రని మ్యూజియంలో పెట్టాలి. మా మండలం లోనే పల్లా అనే ఇంటి పేరుతో కేవలం 2 కొలోమీటరల దూరంలో కమ్మ-పెరిక కులాలకు చెందిన వారు ఉన్నారు. మా వూల్లోనే బండి అనే ఇంటి పేరుతో కమ్మ-గౌడ కులస్తులు ఉన్నారు.

      అసలు మీకెందుకీ కుల పైత్యం? ఎన్నిసార్లైనా మీ వితండవాదం మీదేగానీ మారరా? ఇంటర్నెట్లో వెతికి కనుక్కుంటారా? కులం దూల తీర్చుకోవడానికి ఇంటర్నెట్ దాకా ఎందుకు? కులపిచ్చ ఉన్నోళ్లు-తమ వాదన నెగ్గించుకోవడానికి దానిని రెచ్చగొట్టి పబ్బం గడపుకునే మేధావులు మన రాష్ట్రంలో వీధికొకడు ఉన్నాడు.

      మరో విషయం ఖమ్మం జిల్లా బోనకల్ అని 'చెప్పుకున్నాడు' ఏమిటి మీ భావ దారిద్యం కాకుంటే? దక్షిణ మధ్య రైల్వే రూటులోనే ఉంది బోనకల్.మీకు ఓపిక ఉంటే కెమేరా తీసుకుని రండి. అక్కడనుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా వూరు.మన వాదనలు పక్కనబెట్టి మీకు మంచి విందు భోజనం ఏర్పాటు చేస్తా. నా గురించి-నా కులం-నాకేమైనా కులపిచ్చ గానీ-వాదనలు అడ్డగోలుగా నెగ్గించుకునేందుకు కులపిచ్చను రెచ్చగొట్టే పైత్యం ఏమైనా ఉందా? సవివరంగా తేల్చుకుని వెళుదురు గానీ.

      నా మీద ఇంకా ప్రేమ తగ్గలేదా మీకు? కులం కారణంగా రాష్ట్రవిభజనను నేను వ్యతిరేకిస్తున్నాని మీకు ఎవరు చెప్పారు? ఇంటర్నెట్ చెప్పిందా? ఇలాంటి పిచ్చ వాదనలు - వింత పైత్యాలు మానుకోరా మీరు? అసలు ఎందుకు ఈ పిచ్చవాదనలు చేస్తావు మహానుభావా? మా మండల టీ.ఆర్.ఎస్ అధ్యక్షుడిది మావూరే.అతని కులమూ కమ్మే. తెలంగాణా వాదానికి కులానికి లింకులు మీలా వింత పైత్యంతో చూసేవాళ్లని నేను ఎక్కడా చూడలేదు. ఇతరుల మీద నిరాధారమైన అభాండాలు వేస్తూ పిచ్చి కూతలు కూయడం మానుకుంటే మంచిది.

      నేను సమైఖ్యవాదిని.లగడపాటి లాగానో - పరకాలలాగానో హైదరాబాద్ కోసం నకిలీ సమైఖ్యవాదం చేసేవాడిని కాదు. మొదటినుండీ సమైఖ్యవాదిని. మా మండలంలో టీ.ఆర్.ఎస్ వాళ్లకి తెలుసు నేనేంటో. ఎవరో పైత్యపు అసత్య ప్రచారం చేస్తే అభిప్రాయం మార్చుకోవలసిన అవసరం లేదుగా ప్రవీణ్ గారూ! తెలంగాణా పట్ల దోపిడీని రాష్ట్రం విభజించి అరికడతారా? మరో విధంగానా అనేది తేల్చాల్సింది కేంద్రం. ఎలా చేసినా నాకు అభ్యంతరం లేదు. నా అభిప్రాయానికి మీ స్వంత కులపైత్యం - ఇంటర్నెట్ వింత విస్లేషణలు చేయడం చూస్తుంటే జాలేస్తుంది.

      రాష్ట్రంలో తెలంగాణా ఉద్యమం మాత్రమే నడుస్తుంది. సమైఖ్యవాద ఉద్యమమే లేదు. తెలంగాణా ఉద్యమాన్ని సమర్ధించాలా? వద్దా? అనేది నా వ్యక్తిగతం. నా అభిప్రాయం నాకుంటుంది.దానికి కుల పిచ్చను రెచ్చగొట్టడం మూర్ఖులు చేసే పనే.

      నేను చంద్రబాబు కంటే రాజశేఖర రెడ్డినే సమర్ధిస్తాను వారిద్దరి నాయకత్వం వరకూ - విశ్వసనీయత వరకూ అయితే. అది మీకూ తెలుసు. సాక్షి కి ప్రకటనలు నిలిపివేయడాన్ని నేను వ్యతిరేకిస్తుంటే మీరు సమర్ధిస్తున్నారు. దానికేమంటారు? వాదనలో పైత్యాలుండడం , ఎదుటివాడికి లేని దూలను అంటగట్టడం మీకు వెన్నతో పెట్టిన విద్యలా కనిపిస్తుంది. అది రోగమా? కావాలనే చేస్తారా మీరు?

      Delete
    2. విశ్వరూప్ గారూ !
      నమస్తే. నేను మీ బ్లాగు చూడడం బహుశా ఇదే ప్రధమం అనుకుంటా. ఇపుడు కూడా మితృలు చెపితే చూశానండీ. నేను తెలంగాణా వాడిని - రాష్ట్రం సమైఖ్యం గా ఉండాలని కోరుకునే వాడిని అని గతం లో ప్రవీణ్ కు నాకు మధ్య ఒక చర్చ సందర్భంగా తెలుపడం జరిగింది. దానికి చంద్రబాబుతో సంబంధం ఉన్న కమ్మవాళ్లు అంటూ ... వ్యాఖ్యానిచడం సరయినది కాదు. దానికి మీరు బాధ్యులు కాదులేండి. ప్రవీణ్ కు ఇది అలవాటే. మనిషి మంచోడే కానీ తన వాదనను ఎలా అయినా సమర్ధించుకోవాలనే విపరీత మైన ప్రస్టేషన్ లో ఇలా విచిత్ర వాదనలు , ఎదుటివాడికి లేని అభిప్రాయాలూ అంటగడుతుంటారు.తెలంగాణా ఉద్యమానికీ - ప్రస్తుతం జరుగుతున్న రెడీమేడ్ సమైఖ్య వాద ఉద్యమానికి సంబంధం లేదని గతం లోనే చెప్పానండీ. తెలుగు వారంతా ఒక్కటిగా ఉండాలనే మాలాంటి వాళ్ల భావన ఇప్పుడున్న పరిస్థితిలో కుదరదనీ కేంద్రం పరిష్కరించాల్సిన ఈ సమస్యను ఎలా పరిష్కరించినా అభ్యంతరం లేదనీ గతం లోనే చెప్పాను. మీ విజ్ఞతకు ధన్యవాదాలు.

      Delete
    3. నీలం సంజీవరెడ్డి కాలం నుంచి ఇప్పటి వరకు సమైక్యవాదం అనేది రెడీమేడే. రెండు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే సమైక్యవాదాన్ని నమ్మేవాడు ఒక్కడు కూడా లేడు. నిజంగా సమైక్యవాది అయినవాణ్ణి చూపిస్తే నేను చెవిలో పువ్వు పెట్టుకుని నేను అమాయకుణ్ణని ఒప్పుకుంటాను. నిజ జీవితంలో తెలుగులో ఒక్క ఇంగ్లిష్ పదం కూడా కలపకుండా మాట్లాడితే అతన్ని ఎర్ర బస్సు ఎక్కేవానిగా (పల్లెటూరివానిగా) చూస్తారు కానీ హైదరాబాద్ విషయానికొచ్చినప్పుడే లేని భాషాభిమానం గుర్తొస్తుంది.

      Delete
  9. "మీ పరకాలను సమైక్యవాదానికి అనుకూలంగా ఒక పార్టీ పెట్టమను , ఎన్ని వోట్లొస్తాయో చూద్దాం."

    మీ ప్రియ తమ నాయకుదు కచర గారు కొవ్వురు లొ తెరాస ఫోటీ చెస్తుంధని చెప్పి తోక ముదిచాడు ముంధు మీ కఛర గారిని తెలంగాణ వాదం మీధ సీమంధ్రా లొ పొటీ చెయమనడీ అప్పుడు పరకల గారి గురించి అలొచిద్దాం

    ReplyDelete
    Replies
    1. @ANIL

      తెలంగాణవాదం మీద సీమంధ్రలో గెలవాల్సిన అవసరం లేదు, తెలంగాణలో గెలిస్తేచాలు. సమైక్య్పాఠాలు చెప్పేవారు మాత్రమే రెండుచోట్లా గెలవాల్సి ఉంటుంది. అయినా మేమేం సమైక్యవాద పార్టీ పెట్టి పరకాలను పరాకాలలో పోటీ చెయ్యమనడంలేదు, కనీసం సీమాంధ్రలో గెలిచి చూపించమంటున్నాం.

      " I explained this a 1000 times to several people and you are 1001st one! Still people can't get such simple thing and keep on asking again".

      Delete
  10. Satya,

    viswaroop is very much right in waste of time in continuing this discussion.
    They never accept change of stand by leaders during merger.
    Who is Telangana vaadi in present situation? Jai G, Viswaroop etc will decide time to time like weekly chart busters.
    I appreciate their attitude. This is a typical personality development technique. Do not see or hear things you do not like, which will have negative impact on you.

    ReplyDelete
    Replies
    1. @PPR

      We, ordinary mortals cannot see king's divine clothes. Only VMS and Parakala can see lakhs of supporters for Samaikyandhra in Telangana, with just handful of numbers in their meetings.

      పేరుకేమొ మహాసభ, గుంపు చూడ పదిమంది!!

      Delete
  11. "ఎందుకూ పనికిరాని కత్తి పద్మారావులు"

    కారంచేడు దమనకాండకు వ్యతిరేకంగా పోరాడి దళితులకు ఆదర్శంగా నిలిచిన పద్మారావు గారు పనికి రాని వారా? భేష్ భేష్!

    ReplyDelete
    Replies
    1. Jai, I explained u the facts behind Karamchedu incident in Nalamotu blog.. But as PPR said, u guys have a syndrome to repeat the same crap hoping one day people may believe"..

      Besides that, Gone are the days of Karamchedu.. In the present political scenario he is still a nobody.
      KPR himself told, the dalit empowerment in seema andhra is far superior and they have atleast one Post graduate per house. His reason for Jai andhra is not on the lines of "allegations" made by T seperatists. If u r supporting what DMS is saying, u better should accept the reasons behind its resolution. Katti is aspiring for political empowerment for dalits and believing it can only be achieved thru bifurcation, reasons best known to him. Where as his DMS working closely with BSP had won the political stage in the biggest state of India, katti beliefs are on the contrary. May be because he lost twice (once forfeited deposit) in elections in united AP.

      Delete
    2. satya, your views on Karamchedu massacre ("incident" according to you), KPR's Jai Andhra stance or electoral fortunes etc. are immaterial to the context. The fact remains KPR was instrumental in the movement that resulted in the criminals being booked. This is the reason why no one can dismiss him as "ఎందుకూ పనికిరాని".

      Delete
    3. /*"ఎందుకూ పనికిరాని".*/

      The phrase is apt for Parakala Prabhakar who has changed three parties but couldn't even manage to get a ticket from another "పనికిరాని పార్టి", now starts his own outfit called "విషాంధ మహాసభ" just to get his name float in the media.

      Delete
  12. "కత్తి పద్మారావు ఒక పార్టీ తరఫున పార్టీ స్టాండును తనమాటగా చెప్పలేదు. దళిత మహాసభ అధ్యక్షునిగా దళితమహాసభలో ఆతీర్మానం చేశాడు. అది మెజారిటీ సీమాంధ్ర దళితుల అభిప్రాయాన్ని సూచిస్తుంది." - అద్భుతమైన వాదన! మరి "విశాలాంధ్ర మహాసభ" సమైక్యరాష్ట్రాన్ని కోరుతున్నది గదా.. అంటే యావదాంధ్ర జాతీ సమైక్యత కోరుకుంటున్నట్టేగా! కత్తి గారిది ఉత్త దళిత మహాసభ, ఇది ’విశాలాంధ్ర’ మహాసభ - అంటే దళితులూ దళితేతరులూ కూడా కలగలిసిన మహాసభ. మీరు చెబుతున్న తర్కం ప్రకారమే చూస్తే, మెజారిటీ కాదు ఆంధ్రులందరూ కూడా సమైక్యత కోరుతున్నట్టే!

    ReplyDelete
    Replies
    1. @తుమ్మల శిరీష్ కుమార్

      లాజిక్ బాగానే ఉంది కనీ విశాలాంధ్ర మహాసభలో పట్టుమని పదిమంది కూడా ఉన్నట్టు లేరే? ఎప్పుడు సభ పెట్టినా సభ్యులకంటే విలేఖర్లే ఎక్కువమంది ఉంటారు. అందులో తెలంగాణ నుండి ఎందరు? ముగ్గురా, నలుగురా?

      దళితమహాసభ గురించి చివరిసారి విన్నప్పుడు మరీ పదిమంది కాదు, బాగానే జనం ఉన్నట్లు వినికిడి. పోనీ సీమాంధ్రలో దళితనాయకులెందరు సమైక్యాంధ్రకు మద్దతిస్తున్నారు? వారి వివరాలేమిటి చెబుతారా?

      అసలు తెలంగాణ రావడానికి సీమాంధ్ర ప్రజల మద్దతు అవసరం లేదు, సమైక్యంగా ఉండాలంటే అందుకు తెలంగాణ ప్రజల ఆమోదం కావాలి. కానీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి.

      Delete
    2. దళిత మహాసభ చెబితే మెజారిటీ ప్రజలు చెప్పినట్టే అనే వాదనలోని డొల్లతనాన్ని చెప్పానే తప్ప, విశాలాంధ్ర మహాసభలో ఎంతమంది ఉన్నారనేది చర్చించడం నా గతవ్యాఖ్యలోని ఉద్దేశం కాదు.

      సరే, విశాలాంధ్ర మహాసభలో పదిమంది కూడా లేరండి.. అయితే ఏంటి? ఆ పదిమందిలోని ఒక్కడు ఒక పుస్తకం రాసి విడుదల చెయ్యబోతే, తెవాదులు రభస చేసి, కొట్టి, బీభత్సం చెయ్యలా? అది విశాలాంధ్ర మహాసభకు ఇచ్చిన గుర్తింపు కాదూ? లోక్ సత్తాకు వచ్చింది ఒకటో అరో శాతం ఓట్లేనండి, జయప్రకాశ్ నారాయణ ఒక్కడే సభలో ఆ పార్టీ సభ్యుడండి.. అంత మాత్రాన ఆయన మాటకు విలువ ఇవ్వకుండా పోయారా తెవాదులు? బండబూతులు తిట్టలా? సభ బైట కెమెరాలు చూస్తూండగా కొట్టలా?

      సభ్యులు తక్కువంటూ మీరు చిన్నచూపు చూస్తున్నారుగానీ, తెవాదులు చూట్టం లేదు.

      Delete
    3. "అసలు తెలంగాణ రావడానికి సీమాంధ్ర ప్రజల మద్దతు అవసరం లేదు": Exactly, they have no locus standi.

      Andhra dalit opinion is significant only because of their opinion that the "integrationist" cause is fuelled by caste supremacist elements. This suspicion is strengthened by the VMS crowd calling Dr. Katti Padmarao "ఎందుకూ పనికిరాని".

      Delete
  13. >>> We, ordinary mortals cannot see king's divine clothes

    I could not make out whether this is reaction or response or something else to my comments.

    Anyways,
    Agreeing that పేరుకేమొ మహాసభ, గుంపు చూడ పదిమంది!! is correct, why so many T-intellectuals target this పదిమంది? Why they are so much scared? Obviously this is a minority voice compared to claims of 4 (or 4.5?) crore people support. Then why do you engage them in debates? Why even journalists obstruct their meetings?

    ReplyDelete
    Replies
    1. @PPR
      First thing you are assuming so much about your group. Nobody pays attention to attention seeker Parakala and his group. neither when he was in PRP, when he left it and now..no one cares.

      Secondly strength does not come always from the support of people. At the moment samaikyavadi forces are at upper hand even though they lack people's support as they draw their power from the ruling class, money power and media power. That is how they stage managed samaikyandhra agitation. That is how VMS gets strength from their 10 people group.

      Delete
  14. పది తెలంగాణా జిల్లాలకు పది మంది తారా చౌదిరిలను పంపిస్తే ఉద్యమం ఉంటుందా ?

    ReplyDelete
    Replies
    1. ఆవిడేమీ మేనక కాదు, తెలంగాణా వారు విశ్వామిత్రులు కాదు. Please stop living in dreams and acknowledge the reality.

      Delete
  15. 1) "హైదరాబాదులొ నేను ఇల్లస్థలాలూ, ఫ్లాట్సూ కొనుక్కున్నాను. ఇప్పుడు విడిపోతే నా ప్రాపర్టీ ధరలు పడిపోతే? వామ్మో వాయ్యో... ( అంతా నా స్వార్ధమే... సామాన్య జనం ఎటుపోతే నాకేం)."
    ఇప్పుడేదో దరలు తెగ పెరిగిపోతున్నట్టు!!! తెవాదుల అబద్దాల ఉజ్జమం కారనంగా హై. ఎప్పుడో సతికిల బడింది. దరలు అదరగొట్టేట్టేమీ లేవులే ఇప్పుడు. ఇక ఇంతకంటే తగ్గేదేమీ లేదులే, మీరు బాద పడబాకండి!

    2) "ఇప్పటిదాకా మాకు తేరగా క్రిష్ణా జలాలు వస్తున్నాయి మాకు న్యాయమయిన వాటాలేకపోయినా. ఇప్పుడు మీరాష్ట్రం ఏర్పడితే మరి రాష్ట్రాల మధ్య నీల్లవాటా బోర్డు నిర్ణయిస్తుంది కదా. అప్పుడు ఇప్పటిలాగా మాకు తేరగా నీల్ల రావుకదా ఎలా, అమ్మో?(ఇప్పుడు మాకు దక్కాల్సినదానికంటే ఎక్కువ దక్కుతుందనేది నిజమేననుకోండి)."
    రాస్ట్రం ఇడిపోతే - ఇసిత్రాలేమైనా జరిగి, ఒకేల ఇడిపోతే.. - నీల్లని పట్టేసుకోవచ్చు, తేరగా దాసేసుకోవచ్చు అని ఎవురైనా అనుకుంటే అది పిచ్చి ఆలోసెనవుద్ది. నీల్లని వాటాలేసి చాన్నాల్లైపోయింది. ఇప్పుడు వాటాలు పెరగాలంటే కొత్తగా ఎగష్ట్రాగా యాడనుంచైనా నీల్లు రావాల్సిందే! ఈ తెవాదులు ఇట్టాంటి అబద్దాల సిటికెల పందిల్లు చాలానే ఏస్తన్నారు. మీరు పట్టించుకోబాకండి.

    3) "ఇప్పుడంటే అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో అన్నిచోట్ల పై అధికారులు మావారే కాబట్టి మావాల్లు మెల్లగ దొడ్డిదారిలో దూరిపోతారు. లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎలాగూ ఉంది మావారికి ఉద్యోగాలు ఇప్పించడానికి. ఇవన్నీ కాకపోతే దొంగ సర్టిఫికెట్ పెట్టి తెలంగాణ కోటాలో ఉద్యోగం తెచ్చుకోవచ్చు."
    ఇప్పుడంటే అవసరమేమో గానీ, అప్పుడు దొంగ సర్టిఫికేటు పెట్టాల్సిన కరమ ఎవుడికీ ఉండదు. ఎందుకంటే ఆరొందల పదులూ మూడొందల ముప్పైలూ లాంటి జీవోలు అప్పుడుండవు గదా! దొడ్డిదారులక్కర్లేదు, నేరుదారే, రాచబాటే, ఎర్ర తివాసీ మీద నడుసుకుంటా పోటమే! అయినా.. రాస్ట్రం ఇడిపోతే ఆడేదో బోల్డన్ని ఉజ్జోగాలు రాసులు పోసేసుకుని "ఉజ్జోగాలు ఉజ్జోగాలు ఏడేడి ఉజ్జోగాలు" అంటూ గొవురుమెంటోడు అరుత్తా ఉంటాడా.. మన పిచ్చిగాకపోతే!

    "రేపు రాష్ట్రం ఏర్పడితే మాప్రాంతంలోని ఉద్యోగాల్లోనే మాలో మేమే పోటీపడాలికదా, ఎలా మరి?"
    అసలికి ఉజ్జోగాలే ఉండవు అంటంటే మీరేందండీ బాబూ..! మీ ప్రాంతం లేదు మా ప్రాంతం లేదు, యాడా ఉండవు ఉద్యోగాలు. ఒకేల ఉజ్జోగాలుంటే, మేమూ మేమూ పోటీలు పడి, ఇద్దరికీ రాకుండా చేసుకుని, ఈ తెవాదులకే ఒదిలేత్తాంలే.. పగలూ రేత్రీ కూడా చేసుకుంటారుగాని ఆ ఉజ్జోగాలన్నీ!

    4) "ఇప్పుడంటే తెలంగాణ మాతో ఉంది కాబట్టి అందరం కలిసి ఇక్కడ తినేస్తాం కానీ రేపు విడిపోతే మాలో మేమే (సీమ, ఆంధ్రా వాల్లం) మీరు దోచుకుంటున్నారంటే మీరని కొట్టుకుంటాం, అలా మేం కొట్ట్కోవడం అవసరమా?"
    ’తెలంగానలో ఏదో శానా ఉంది, దాన్ని కోస్తా సీమల జనం తినేత్తన్నారు, తెలంగానోల్లేమో పులిస్తరాకుల దగ్గర కుక్కల్లాగా సొంగ కారుత్తా ఆబగా సూత్తన్నారు’ అని ఎవురైనా అనుకుంటే ఆళ్ళంత నయవంచకులు, అబద్దాలకోర్లు, తెవాదులూ ఇంకేడా ఉండరు.


    5) "ఇప్పుడంటే తెలంగాణాకు చెందాల్సిన ఫండ్సన్నీ మాకు వచ్చేస్తున్నాయి, విడిపోతే మాప్రాంతంలోని ఆదాయంపై మాత్రమే మేము ఆధారపడాలి, అలా అయితే ఎలా?"
    మన పండ్సన్నీ ఎవుడో ఎత్తుకుపోతంటే, మన పండ్లన్నిట్నీ ఇంకెవుడో కోసుకుపోతంటే తెలంగానపోడు సూత్తా కూసుంటాడా? తెవాదులు అబద్దాల మీద అబద్దాలు చెబుతానే ఉంటారు, మీరు పట్టించుకోబాకండి.


    6) "ఇప్పుడంటే సమైక్య రాష్ట్రంలో మాకులం వాల్లు బలమయిన స్థానంలో ఉన్నారు. అధికారం మాకులానికి లేక ఫలానా కులం వారికే ఎప్పుడూ దక్కుతుంది. రేపు రాష్ట్రాలు విడిపోయి చిన్న రాష్ట్రం అయితే బడుగు వర్గాలు మమ్మల్ని వెనక్కి నెట్టేసి అధికారం చేజిక్కించుకుంటే, అమ్మో ఎలా?"
    అవే కులాలకు చెందిన తెలంగానలోని జనం దేవుల్లు, తాము అదికారాన్ని వొదులుకోని బడుగు వర్గాలకు ఇచ్చేత్తారు అని ఎవురైనా అనుకుంటే, ఆ అనుకునేవోల్లని ఏమని అనుకోవాలో మనకి తెలుసు.

    7) "మాకు సొంత గుండెకాయ లేదే? ఇంతకుముందు మద్రాసే మాగుండె అనుకున్నాం. అది అందకపొయ్యేసరికి హైదరాబాదే మాగుండె అని ఇప్పుడనుకుంటున్నాం. ఇప్పుడు విడిపోతే మాగుండెకాయ వెతుక్కోవాలి, ఎక్కడుందో ఏమో?"
    నిజవే.. మాకు గుండెకాయొకటుంది. కానీ, "నీ గుండె నాది, అది నాక్కావాలి, నాది నాకిచ్చెయ్యి", అని కత్తి గుచ్చి గుండెకాయని తోడేసుకోవాలని సూసేవోన్ని ఏవనాలి? తోడేలనాలా? నక్క అని అనాలా? మొసలి అనాలా? అన్నిట్నీ మించిన తెవాది అని అనాలా?

    ReplyDelete
    Replies
    1. @తుమ్మల శిరీష్ కుమార్

      చానాలేటు గా రంగంలోకి దిగినట్టున్నారు. ఈపోస్టుకు కామెంట్లకోటా అప్పుడే అయిపోయింది. ఉన్నమాటంటే ఉలుకెక్కువని దీనికిముందూ, తరువాత రాసిన పోస్టులను ఎవరూ పట్టించుకోవడంలేదు గానీ ఈఏడుముక్కల టపాకు (అదికూడ రెండేల్లటపాకు రీపోస్ట్)మాత్రం ఒకటే కామెంట్లు వస్తున్నాయి.

      మీరు పైన చెప్పిన సగటు సమైక్యవాదుల్లోరారు. మీరు వీర సమైక్యవాదులు...తెలుగుజాతి ఐక్యతకోసం కంకణం కట్టుకున్నారు. సరేనా.

      Delete
    2. ఓ.. ఇది పాత టపానా? ఎంత పాతవైనా, సరుకున్న టపాలకు వద్దన్నా వస్తాయి వ్యాఖ్యలు.

      Delete
    3. @తుమ్మల శిరీష్ కుమార్


      పాతటపాను నాలుగు రోజులక్రితం రీపోస్ట్ చేశాను. నిజంగా సరుకున్న టపాలు దీనికి ముందూ, తరువాతా ఉనాయి. ఉదాహరనకు

      http://kotiratanalu.blogspot.com/2012/05/blog-post_15.html
      http://kotiratanalu.blogspot.com/2012/05/blog-post_09.html

      కానీ ఈటపా కొందరికి బాగ తగిలినట్లుంది.

      Delete
    4. @విశ్వరూప్:

      సతికిల, ఒకేల, ఉజ్జోగాలన్నీ: ఏందో ఇదంత?

      తెలుగు సరిగ్గా రాస్తలేవని కోప్పడే పెద్దాయన ఎమయిండో ఎక్కడ పోయిండో?

      వారీ, గీ తుమ్మల అనేటాయన రాసిన మాటలు నాకు అర్ధం అయితలేవు. ఏదో రంది పడ్తున్నడని ఎరికయింది గానీ కతెందో తెలుస్తలేదు. గీ ఒక్క ముచట చాలదా ఎవని దారి వాడు చూస్కోనీకే?

      "నాకు భాష రాదన్నోడు, నా యాసని ఎక్కిరించినోడు సిగ్గు లేకుండా కలిసి ఉందామంటున్నాడు": కాళోజీ

      Delete
    5. రెండున్నర జిల్లాల భాష మామీద రుద్దేసారు బాబో.. అని ఓ.. తెగ ఏడుస్తూంటారు కొందరు తెవాదులు. ఇప్పుడు ఆ జనానికి తెలిసొచ్చేలా చెబుతున్నా.. వీళ్ళు ఏడుస్తూండే ఆ రెండున్నర జిల్లాల్లోని ఒక ప్రాంతపు యాస లోవే ఆ పదాలు. (నా వ్యాఖ్యలోని ’నీల్లు’ లాంటి మాటలు మాత్రం అక్కడివి కావు, ఇక్కడివి. అలాంటి మాటలు నేను ఎక్కడా రాయను, ఇక్కడ మాత్రమే రాసాను).

      ఆ యాస రుద్దేసారనేది నిజమైతే, ఆ యాస లోని ఈ మాటలు ఎందుకర్థం కావు? అబద్ధాలు చెప్పటం ఇక్కడ కూడా మానలేదన్నమాట! ఇంతకీ ఏది అబద్ధం.. యాస మామీద రుద్దారన్న మాటా? లేక అర్థం కాలేదన్న మాటా? ఏం జై గొ.. కనీసం నా ఈ ప్రశ్నైనా అర్థమైందా మీకు?

      Delete
    6. @Jai Gottimukkala

      గదేదో మనకర్ధంగాని యాస అయుంటుంది. గీ తుమ్మల అనేటాయన పెద్ద తెలుగుభాష పండితుడేనని విన్న.

      Delete
    7. @విశ్వరూప్: నిధులు, నీళ్ళు, నియామకాలూ - ఇవే తెలంగాణ ఉద్యమానికి కారణం అని మీరు రాసారు. కానీ ఆ కారణాలన్నీ అబద్ధాలని తేలిపోయాక భాష, యాస, సినిమాలో విలన్లు.. ఇలాంటి కారణాలు చూపించడం మొదలెట్టారు అని నేను రాసాను. కావాలంటే చూడండి.. నేను రాసింది అర్థం కాలేదు కాబట్టి విడిపోవాల్సిందేనని జై.గొ గారు అంటున్నారు. ఇదీ ఈ ఉద్యమం పోకడ.

      Delete
    8. @తుమ్మల శిరీష్ కుమార్

      ఓహో! అబద్ధాలని ఎవరు తేల్చిన్రు? తమరేనా? తమరి బ్లాగులనా? సూశినంలే తమరు తేల్చినవి..త్రేన్పులొచ్చినయి.

      Delete
    9. నిజం చెప్పండి, వచ్చింది త్రేన్పులా ఎక్కిళ్ళా?

      Delete
    10. Yawwwn!! You think your mediocre comparisons with rice production numbers of biggest distrect like Palamoor with Srikakulam or GDP numbers any proofs? Come with some better logic next time. Good luck!!

      Delete
    11. అయ్యొ.. కోప్పడకండి. మీ బాధ నేను అర్థం చేసుకోగల్ను. కానీ, మీకు సౌకర్యంగా ఉండేలా గణాంకాలు లేకపోతే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పండి.

      Delete
    12. Do you still want to continue on this and expose your mediocre logic?

      Delete
  16. "గదేదో మనకర్ధంగాని యాస అయుంటుంది. " - ఇంతకీ ఏది అబద్ధం.. యాస మామీద రుద్దారన్న మాటా? లేక అర్థం కాలేదన్న మాటా? అన్న నా ప్రశ్న కనీసం మీకైనా అర్థమైందా విశ్వరూప్?

    "గీ తుమ్మల అనేటాయన పెద్ద తెలుగుభాష పండితుడేనని విన్న." - అబద్ధాలు చెప్పడం అలవాటై పోయీ పోయీ, ఇలాంటి ఘోరమైన అబద్ధాలను కూడా వ్యాప్తి చేస్తున్నారన్నమాట!

    ReplyDelete
    Replies
    1. @తుమ్మల శిరీష్ కుమార్

      గీయాస రెండున్నరజిల్లాలది కాదు, మిగిలిన అరదని నాసమాచారం. ఈఅరజిల్లాభాష వింటె రెండున్నరజిల్లాలొల్లకు మంచిగనే అనిపిస్తది, అదే మావోల్లు మాట్లేడేదాంట్లో తురకం ఇనిపిస్తది...సవతి తమ్మునోలె.. సడకంటె తప్పు..రోడ్డంటె శభాషు. పైన జూసినంగద పెద్దమనిషి కత..తెలంగాణోడు రాసినదాంట్లొ చిన్న అచ్చుతప్పు ఉంటె బరిగెదీసె కొట్టెలాగుండు..మరి ఎందరు సమైక్యవాదులదగ్గరికెల్లి పాఠాలు జెప్పిండు?

      Delete
    2. @తుమ్మల శిరీష్ కుమార్:

      "తెగ ఏడుస్తూంటారు కొందరు తెవాదులు": వారీ, ఆ కొందరిని అడగరాదే. ఇక్కడ రాసిన పాయింట్ల నాకయితే అగుపించలే.

      "ఇదీ ఈ ఉద్యమం పోకడ": నాకు తెల్వక అడుగుత, ఇంటర్నెట్ల ఎవడో ఏదో రాసిండని ఉద్యమానికి వంకలు పెడ్తరెంది? గీ లెక్కల వీర సమైఖ్యవాది తాడేపల్లి తెలంగానోల్లు తాగుబోతులని రాసిండు, రాళ్ళబండి అనేటాయన అంబేద్కర్ దేశద్రోహి అన్నడు, కృష్ణ మోహన్ "గారు" నచ్చనోల్లను ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించిండు, ఇదే టపాలో ఒకాయన కారంచేడు దమనకాండను "incident" అన్నడు. వీళ్ళందరి మాటలు సమై"ఖ్య"వాద పోకడలా?

      Delete
    3. Jai Gottimukkala: ఆడిట్టాగన్నాడు, ఈడిట్టాగన్నాడు.. ఈ కబుర్లొద్దు. నేను మిమ్ముల్ని అడిగినాటికి సూటిగా సమాదానా ల్జెప్పండి.

      Delete
    4. మీరు నన్ను ఏమి అడిగిన్రు? This is your first comment addressed to me.

      Delete

Your comment will be published after the approval.