Monday 18 November 2013

నిజాయితీ లోపించిన మేధావితత్వం


"చెడ్డవారి దుర్మార్గం కంటే కూడా మంచివారి మౌనం వల్ల ఈసమాజానికి ఎక్కువ నష్టం". ఇది మన ప్రియతమ లోక్‌సత్తా అధినేత తరుచుగా వినిపించే సూక్తి. ఈజేపీ తెలుసుకోవాల్సిందేమిటంటే  చెడ్డవారి దుర్మార్గం, మంచివారి మౌనం కంటేకూడా మేధావివర్గం పక్షపాత ధోరణివలన సమాజానికి ఎక్కువ నష్టం. జేపీ మేధావి అన్నది ఎంత నిజమో తెలియదు కానీ ఇతను ప్రాంతీయ, కుల పక్షపాతాలకు ఏమాత్రం అతీతుడు కాదు, పైపెచ్చు ఈపిచ్చి కొంచెం మోతాదుకు మించే ఉన్నది అని మెల్లిగా అందరికీ తెలిసొచ్చింది.

రెండువేల తొమ్మిది డిసెంబరు తరువాత ఈరాష్ట్రమంతా విభజన అంశంపై విడిపోయి ఉడికిపోతున్నవేల పార్టీ ఫండ్శ్ కోసం అమెరికా వెల్లిన జేపీని అక్కడి తెలంగాణవాదులు రాష్ట్రవిభజన అంశంపై మీవైఖరి ఏంటి అని నిలదీస్తే ఇతనిచ్చిన సమాధానం అదిప్పుడు ప్రయారిటీ కాదు అని. ఆతరువాత సంవత్సరం  తిరిగినాక  ఇదే జేపీ ఇంత ముఖ్యమైన విషయంపై రాష్ట్రం ఉడికిపోతుంటే కేంద్రం ఎన్ని రోజులు సమస్యను నాంచుతుంది, వెంటనే తేల్చాలి అని స్టేట్మెంటు ఇచ్చాడు.. కాకపోతే "అందరికీ ఆమోదయోగ్యమైన సామరస్యపూరిత పరిష్కారం" కావాలంటూ ఒక క్లాజు తగిలించాడు, అదెలాగూ సాధ్యం కాదని తెలిసినోడు కాబట్టి.

రాష్ట్రవిభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నతరువాత ఈమధ్యన టీవీషోల్లో బుజీగా కనిపిస్తూ ఇదేం చిన్నపిల్లల ఆటనా, కేంద్రంలో అందరూ పనికిమాలిన వెధవలు అంటూ అందరినీ తిడుతూ తానొక్కడే పెద్దమేధావి తనకు తెలిసినంత మరెవ్వరికీ తెలియదు అన్నట్టు ఫోజు పెడుతూ కేంద్రం విభజన వ్యవహారంపై రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నదని భారీ డైలాగులు వినిపిస్తున్నడు. పోనీ ఎలా విభజిస్తే బాగుంటుందో కాస్త మీరు చెప్పండి అంటే అమ్మో నేనేదైనా చెబితే మల్లీ నన్నంటారు అంటూ వెంటనే తప్పించుకున్నాడు.

ఎక్కడా కనపడని సమైక్య ఉద్యమాన్ని పెద్దది చేస్తూ వందరోజులుగా రోడ్లపైకి జనం వస్తుంటే ఈకేంద్రానికి పట్టదా అని ప్రశ్నిస్తాడు. నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమాలతో ఉడికిపోతుంటే మాత్రం రాష్ట్రాన్ని ఉద్యమాలపేరుతో తగలబెడుతున్నారు అంటూ మొసలి కన్నీరు కార్చేవాడు. ఈసమస్యను తేల్చాల్సింది కేంద్రం కాదు, రాష్ట్ర అసెంబ్లీయే తెల్చాలి అంటూ పైగా అదే రాజ్యాంగ స్ఫూర్తి అని చెబుతున్నాడు. దోచుకునెవాన్ని దోచుకోబడేవాడు వెళ్ళి అయ్యా మీరే నాసమస్యకు పరిష్కారం చెప్పాలి అంటే చెబుతాడా? ఆ సంగతి తెలిసే రాష్టృఅ విభజనపై అధికారాన్ని రాజ్యాంగనిర్మాతలు కేంద్రానికి కట్టబెట్టారని ఈయనకు తెలియదా? 

ఒస్మానియా విద్యార్థులను అమానుషంగా కొట్టిన పోలీసులను మానవ హక్కుల ఉల్లంఘనకింద కోర్టులే అక్షేపించినా ఆవిషయంపై నోకామెంట్ అంటూ తప్పించుకున్న జేపీకి అరెస్టులూ బైండోవర్ కేసులతో ఉద్యమంపై ఉక్కుపాదం మోపినపుడు నోరుమెదపని జేపీకి ఇప్పుడు సీమాంధ్రలో మీడియాలో తప్ప ఇంకెక్కడా కనపడని ఉద్యమం గురించి ఆక్రోషం ముంచుకొస్తుంది. ఇలాంటి పక్షపాత బుద్దులవల్ల ఈసమాజానికి మేలు జరగదు గానీ కీడు మాత్రం బోలెడు. తిన్నింటివాసాలు లెక్కబెట్టే ఇలాంటి కుహనా మేధావులను తెలంగాణనుండి తరిమేసే రోజులు ఎంతోదూరంలో లీవు, ఎన్నికలకు ఇంకా ఉంది ఆరు నెలలే. 


9 comments:

  1. TG agitation musugu lo TRS and Osmania students chesindhi arachakam. rakshasatvam. sakala janula same ye agreement tho aapesadu KCR ?? Hyderabad lo okka seat kuda geluchukoleni party hyd ni TG ki matrame ivvali ani ela adagagaladhu ??

    100 days SA udyamam lo okka chota aina prabhutva aasthulu vidvamsam jarigindhaa ?? (don't say Rajiv/Indira statues or Bothsa issue).

    million march ani cheppi tank bund lo entha mandhi goppa goppa valla vigrahaalu kulchesaaru ??

    entha mandhi Andhra industrialists diggara TG peru cehppukoni KCR commission lu kummesaadu ??

    avanni TG udyamalu anukone mee laanti moorkhulaki entha cheppina artham kaadhu... TG statehood ki against ga matlade vaadu evadaina meeku Moorkhudu gaane kanpistadu. god bless you.

    ReplyDelete
    Replies
    1. ఓరి మూర్ఖుడా!
      పెద్దమనుషుల ఒప్పందం తుంగలో తొక్కింది ఎవడురా?
      610 జీవోని అణగ దొక్కింది ఎవడురా? ముల్కీ నిబంధనలను పాటించక, గయ్యాళి వేషం వేసింది ఎవడురా?
      విద్యుత్ ఉత్పత్తి బొగ్గువనరులున్న తెలంగాణలో పెట్టకుండా, సీమాంధ్రలో పెట్టింది ఎవడురా?
      నీటి వాటాలు కేటాయించకున్నా, అక్రమంగా నీళ్ళు మళ్ళించుకుపోయింది ఎవడురా?
      మొన్నకు మొన్న చిత్తూరుకు ఆరు వేల కోట్లు తరలించుకుపోయింది ఎవడురా?
      ఇక్కడ పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటే, నోరు మూసుకొని చూస్తూ కూర్చున్నది ఎవడురా?
      ఎన్ని..ఎన్నని...ఇంకా ఎన్నని మీ అక్రమాల్ని చూస్తూ ఊరుకోవాలి మేం?
      మీ దొంగ ఉద్యమం వంద రోజులది..ఐతే...మా ఉద్యమం అరవై ఏళ్ళది!
      తెలంగాణను దోచుకొనే కుట్రలు, కుతంత్రాలు మీవైతే, న్యాయంగా మమ్మల్ని మేం పరిపాలించుకుంటా మనే సజ్జనవాదం మాది.
      మాకూ, మీకూ "హస్తి మశకాంతరం" తేడా ఉంది.
      దొంగ ఉద్యమకారులు...స్వార్థ ఉద్యమకారులు మీరు! అసలైన ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు!
      సిగ్గు లేక తెలంగాణ బ్లాగుల్లో నీతి పాఠాలు నిన్నెవడు వల్లించ మన్నాడు?
      మీ చరిత్ర అంతా తెలంగాణను దోచుకున్న చరిత్ర!
      నోరు మూసుకొని పో...పోయి నీ సీమాంధ్రకు ఏం కావాలో కోరుకో పో...

      Delete
    2. super sepinavu anna

      Delete
  2. గూండాలని అద్దెకు తెచ్చుకుని సిటీలో ఒక ప్రాంతం వాళ్ళ షాపులూ, కార్లపై రాళ్ళేయించారు. ప్రభుత్వానికి సమాంతరంగా ఓ బక్కాయన ఏకంగా కంపెనీ సియ్యీవోల మీటింగు పెట్టి మరీ సూట్కేసులు దండుకున్నాడు. అల్లుడేమో అడ్డాగోలుగా మామూళ్ళ పనిలో పడ్డాడు. తెలంగాణాలో జాగ్రత్త పడ్డ ఒకావిడ సినిమాలపై కన్నేసి ఆడనివ్వమంటూ కలెక్షన్లు చేసింది. బైటి వాళ్ళని స్టూడెంట్లతో కలిపి ఒక విశ్వవిద్యాలయాన్నే రౌడీల రాజ్యంగా మార్చేశాడో ప్రొఫెసర్. ఒక నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని వాళ్ళూ ఈ వసూళ్ళ వృత్తికి ప్రారంభోత్సవం చేసారు. ఈదేం పద్ధతని ఓ నిజాయితీగల నాయకుడు అస్సెంబీలో నిలదీశాడు. ఏయ్ నిజం చెబుతావా? అంటూ ఆయన్ని మాడు పగలగొట్టారు. దేశమంతా నిజాయితీ గల నాయకులకి నీరాజనాలు పలుకుతుంటే ఈ కొంతమంది మాత్రం మాకు నిజాయితీ పరులొద్దూ అంటూ తిట్టుకుంటున్నారు. అంతేలెండి, నిజాయితీ పరులు ప్రజలకి కావాలి. మీకెందుకూ?

    ReplyDelete
    Replies
    1. అసత్య ప్రచారం చేయటంలో సీమాంధ్రులు సిద్ధహస్తులు! మీ కడుపుల్లో ఇంత విషం పెట్టుకుని, తెలంగాణ వాళ్ళను మీతో కలిసుండమని ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? మీరు రాసిన పైవన్నీ మీకే వర్తిస్తాయి. మా తెలంగాణ వాళ్ళకు ఇలాంటి మాయలు, కుట్రలు, కుతంత్రాలు రావు! మీరు వెధవ వేషాలు వేసి, మమ్మల్ననడం మీ ఆధిపత్యభావజాల దుర్మార్గాంధ్రులకే చెల్లింది! ఇప్పటి దాకా విషం చిమ్మింది చాలక, ఇంకా చిమ్మడానికి వచ్చావా నాయనా? అబద్ధాల పుండాకోరు నక్కజిత్తుల వెధవలారా అనకముందే జాగ్రత్తపడండి. పొండి.

      Delete
    2. ఒరే ఆంధ్రోడా! నువ్వు చెప్పినవన్ని పేర్లతో నిరూపించడానికి సాక్ష్యాలతో సహా వచ్చి మాట్లాడరా! అవి నిజాలైతేకదా, నువ్వు నిరూపించడానికి! మీ బుద్ధి పోనిచ్చుకున్నారుకాదు! కుక్కతోకకు గుండు కడితే చక్కగైతదా? వక్రబుద్ధి వక్రబుద్ధే! అవన్నీ మేం చేస్తుంటే నువ్వు నోర్మూసుకొని కూర్చున్నావా? దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమనే రకానికి చెందినవాళ్ళు మీ సీమాంధ్రవాళ్ళు! మీ దుర్గుణా లెన్నని చెప్పాలి? ఒకటా రెండా? సవాలక్ష! ఇంకా సిగ్గు లేక, తెలంగాణ బ్లాగుల్లో కొస్తున్నారు! అబద్ధాలు పేలుస్తున్నారు! నోరు తెరిస్తే అబద్ధం...పో..పోరా వెధవా...పో!

      Delete
    3. @Anonymous 18 November 2013 19:12

      అనామకా ఉరఫ్ పాపంఆంధ్రా, మన్మధన్ చెంబు, చ..,

      దేశమంతా కేజ్రీవాల్, అన్నాహజారే లాంటి నిజాయితీపరులను కోరుకుంటుంది, ఇలా ప్రాంతీయ పక్షపాతం, కులగజ్జి మూర్తీభవించిన అబద్దాలకోరును కోరుకోవడం లేదు. అందుకే ఢిల్లీలో కేజ్రీవాల్ దూసుకుపోతుంటే ఇక్కడ మాత్రం ఉన్నొక్క సీటుకు కూడా తరువాతి ఎలక్షనులో గ్యారంటీ లేదు.

      సమైక్యాంధ్ర ఉద్యమానికి హెడ్‌క్వార్టరు మొన్నటిదాకా చంచల్‌గూడా జైలు. సమైక్యాంధ్ర నాయకుల్లో ఒకడు మనికొండలో గుట్టులూ, గుళ్ళూ, స్మశానాలూ వదలకుండా మింగేశాడు. ఒకతి భక్తిపేరుమీద మియాపూర్లో సొసైటీ భూములు కబ్జా పెట్టింది. ఒకడు లక్ష కోట్లు, ఇంకొకడు వేలకోట్లు. ఒక్కడన్నా నీతిగల సమైక్య నాయకుడున్నాడా? ఈజేపీ మేధావి మాత్రం కేవలం కబ్జాలను కాపాడుకోవడంకోసం ఒక దొంగ ఉద్యమాన్నే సృష్టించిన వీళ్ళ గురించి ఎన్నడూ మాట్లాడడు. అది తన సామాజిక వర్గం అయితే అస్సలు మాట్లాడడు.

      ఈఅపర అంబేద్కరుకు రాజ్యాంగంలో ఉన్నది ఉన్నట్టు చేస్తే అది రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకమట. ఈచత్త వాదనలకు కొందరి వత్తాసు.

      ఇంక తెలంగాణ నేతలపై ఆరోపణలు.. అవే నిజాలయితే అధికారం చేతిలోనే ఉందిగా ఎందుకు విచారణ చేయలేదో? అయినా ప్రజల సొమ్మును మింగేవాల్లకు వత్తాసు పలికేవారు దొంగలదగ్గర వసూల్లగురించి ఏడవడం అసహ్యంగా ఉంది.

      Delete
    4. నిజాయితీ గల కేజ్రీవాల్ తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చాడు. పక్షపాతబుద్ది జేపీ తెలంగాణకు అడ్డంపడుతున్నాదు.

      Delete
    5. Yes, Kejrival supported Batla house terrorists too, and supporting lot of terrorists and even for kasmir to pakistan. yes he is having నిజాయితీ

      Delete

Your comment will be published after the approval.