Wednesday 31 October 2012

సమైక్య ఉద్యమం @ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్} ఆనాడు అదే కంట్రోల్ రూం

సమైక్య ఉద్యమం @ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్} ఆనాడు అదే కంట్రోల్ రూం
PRAVEENKUMAR-REDDY_6
- ఎమ్మెల్యేల రాజీనామాలకు బాబే కారణం
- పార్టీ కార్యక్రమంగానే సమైక్యాంధ్ర బస్సు యాత్ర
- కేంద్రానికి లేఖ ఇచ్చామని ఇక్కడ కలరింగ్..
అది డమ్మీ లెటర్ అంటూ అక్కడ కవరింగ్
- బాబు వైఖరిపై ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి నిప్పులు 

హైదరాబాద్, అక్టోబర్ 30 (టీ మీడియా): టీడీపీ అధినేత చంద్రబాబు లోగుట్టును ఆయన సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రవీణ్‌డ్డి బయటపెట్టారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చినప్పుడు టీడీపీ కార్యాలయం కంట్రోల్‌రూమ్‌గా పనిచేసిందని చిత్తూరు జిల్లా తంబాలపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్‌డ్డి సంచలన రీతిలో వెల్లడించారు. డిసెంబర్ 9 ప్రకటన అనంతరం సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలకు చంద్రబాబే సూత్రధారి అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తనను కూడా చంద్రబాబు భాగస్వామిని చేశారని వెల్లడించారు. తెలంగాణ విషయంలో ప్రాంతానికో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఒక చానల్‌తో మాట్లాడిన ప్రవీణ్‌డ్డి.. తెలంగాణ విషయంలో కేంద్రానికి లేఖ ఇచ్చానని కలరింగ్ ఇస్తున్న చంద్రబాబు.. సీమాంధ్ర నేతల వద్ద మాత్రం అందులో ఏమీ లేదని, అది ఉత్తుత్తి లేఖ అని, దానిని పట్టించుకోవద్దని చెప్పారని అన్నారు. 2009 డిసెంబర్‌లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని, తెలంగాణపై ప్రకటన వచ్చిన తరువాత చంద్రబాబు పార్టీ కార్యక్షికమంలాగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేయించారని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 9 రాత్రి చిదంబరం తెలంగాణపై ప్రకటన చేశారని, మరుసటి రోజు చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని అన్నారు. సీమాంవూధలో సమైక్య ఉద్యమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే డైరెక్షన్ వచ్చిందన్నారు. ఆనాడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పార్టీ కార్యక్షికమంలాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే మానిటరింగ్ చేశారన్నారు. ఆనాడు సమైక్య ఉద్యమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కంట్రోల్ రూమ్‌లాగా పని చేసిందన్నారు. ఆనాడు సీమాంవూధలో పార్టీనే బస్సుయాత్ర చేయించిందని, బస్సును పంపించి, దానికి అయ్యే ఖర్చులను కూడా పార్టీనే ఇచ్చిందని తెలిపారు.

ఈ విషయంలో ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కదలిక తెచ్చేందుకు తనను సైతం ఉపయోగించారని చెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రకటనను వెనక్కు తీసుకొని సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని ఆనాడు సీమాంధ్ర నేతలను ఢిల్లీకి పంపించింది చంద్రబాబేనన్నారు. దీనిని కూడా పార్టీ ఖర్చులతో పార్టీ కార్యక్షికమంగా చేపట్టారని వివరించారు. తెలంగాణపై ఢిల్లీలోచిదంబరం అఖిలపక్షం నిర్వహించినప్పుడు చంద్రబాబు నాయుడు కావాలనే సీమాంధ్ర నుంచి యనమల రామకృష్ణుడు, తెలంగాణ నుంచి రేవూరి ప్రకాశ్‌డ్డిని పంపించారని అన్నారు. టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసైం తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నాడని అన్నారు. సమైక్య ఉద్యమ బాధ్యతలను రాయలసీమలో పయ్యావుల కేశవ్‌కు, ఆంధ్రాలో దేవినేని ఉమామహేశ్వరరావుకు అప్పగించారని చెప్పారు. 

No comments:

Post a Comment

Your comment will be published after the approval.