Thursday 26 September 2013

ఒక ప్రాంత సీఎం గా పనిచేస్తున్న కిరణ్ - దిగ్విజయ్ వ్యాఖ్య

-పక్షపాతం పనికిరాదు.. అన్ని ప్రాంతాల ప్రజలు 
-ఎన్నుకుంటే  సీఎం అయ్యారు: దిగ్విజయ్ వ్యాఖ్య
-కేబినెట్ నోట్ తయారవుతోంది.. కేంద్ర మంత్రివర్గం చూశాక అసెంబ్లీకి పంపిస్తాం
-ఎపీ ఎన్జీవోల సమ్మెతో సామాన్యులకు ఇబ్బందులే .. వేడుకుంటున్నా .. విరమించండి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25 (టీ మీడియా) :రాష్ట్రానికి ముఖ్యమంవూతిగా ఉండి ఒక ప్రాంతంపై పక్షపాతం ప్రదర్శించరాదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఎన్నుకుం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని గుర్తుచేశారు. 
diggirajaకాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో బుధవారం రాష్ట్ర రాజకీయాలపై సమావేశం అనంతరం తనను కలిసిన విలేకరులతో దిగ్విజయ్ మాట్లాడారు. తెలంగాణపై కేబినెట్ నోట్, సీఎం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న తీరు, ఏపీఎన్జీవోల సమ్మె, ఎంపీల రాజీనామా తదితర అంశాలపై ఆయన ఘాటుగా స్పందించారు.

అందరూ ఎన్నుకున్న సీఎం..
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికే ముఖ్యమంవూతిగా వ్యవహరించరాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారూ ఎన్నుకుం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి అన్ని ప్రాంతాల పట్ల ఆయన సమబాధ్యతతో వ్యవహరించాలి’ అని దిగ్విజయ్ హితవు చెప్పారు. ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని చట్టసభల్లో అడ్డుకుంటే రాష్ట్రపతి మీద ఒత్తిడి చేసి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోగల శక్తి తనకు ఉందని కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రకటనపై ఆయనఈ విధంగా స్పందించారు. మంగళవారం సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని ఓడిస్తే తాను వ్యక్తిగతంగా రాష్ట్రపతిని కలిసి బిల్లును తిరస్కరించాలని కోరతానని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. 

ప్రైవేటు పనిచేస్తుంటే...
ఎపీఎన్జీవోల సమ్మె పై మాట్లాడుతూ..‘సమ్మెను నిలిపివేయాలని వారిని కోరుతున్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అనవసరంగా ఇబ్బందులకు గురవుతున్నారు’అని దిగ్విజయ్ అన్నారు. ‘ప్రైవేటు వ్యాపారాలు కొనసాగుతున్నప్పుడు, ప్రైవేటు దుకాణాలు తెరిచి ఉంటున్నప్పుడు, ప్రైవేటు రవాణావ్యవస్థ పని చేస్తున్నప్పుడు, ప్రైవేటు స్కూళ్లు నడుస్తున్నప్పుడు, కేవలం ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే ఎందుకు మూసేశారు?’ అని ఆయన ప్రశ్నించారు. ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కోరారు. ‘ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా... అన్ని ఇబ్బందులు, భయాలను వినేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు దయచేసి పనిలో చేరండి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగి ప్రయోజనాలు పరిరక్షించబడతాయని హామీ ఇస్తున్నాం’ అని ఆయన చెప్పారు. 

3 comments:

  1. http://vruttanti.blogspot.in/2013/09/blog-post_5162.html

    ReplyDelete
    Replies
    1. రాజీనామాలు చేస్తామని అరుస్తూ కరవనిది ఎవరంటే సీమాంధ్ర ఎంపీలూ, మంత్రులు. డిగ్గీ తన పని తను చేసుకు పోతున్నాడు.

      మంత్రులూ, ఎమ్మెల్యేలూ ఏప్రాంతానికి కొమ్ముగాసినా చివరికి ముఖ్యమంత్రి నిర్ణయమే రాష్ట్రంలో చెల్లుతుంది. ముఖ్యమంత్రిసీటులో గూర్చున్నవాల్లు యాభై ఏల్లనుంది ఒక ప్రాంతానికి కొమ్ముగాస్తున్నారు గనకే విభజనకోసం ఉద్యమం జరిగింది. ఇప్పుడు కిరణ్‌రెడ్డి ప్రవర్తన తెలంగాణ ఎందుకు అవసరమో మరోసారి గుర్తుచేస్తుంది. ఇలాంటి ముక్యమంత్రులుంటే సమైక్యత ఎప్పటికీ సాధ్యం కాదు.

      Delete
  2. ముఖ్యమంత్రి కిరణ్ గారిది ఆరిపోయేముందు ఒక్కసారి విప్పారిన వెలుగు ,కొసమెరుపు!ఆయనకు ఇక కాంగ్రెస్ ఎం ఎల్ ఏ టికెట్ కూడా ఇవ్వదు!స్వంత పార్టీ పెట్టుకున్నా ఆయన ఒంటెద్దుపోకడలతో అందులో చివరికి ఒక్కడూ మిగలడు!కిరణ్ గారిలో పట్టూ విడుపూ లేవు!తాను పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అనే రకం!ఎవ్వడి తాతకు వినే రకం కాదు!తెలంగాణాకు రూపాయి ఇవ్వను నీ దిక్కున్న చోట చెప్పుకో అనే నియంతృత్వం టైపు!తెదేపా లో చేరినా, వైకాపా లో చేరినా ఎందులోనూ ఇమడలేడు!తెలంగాణా ప్రజలు అమాయకులు,మంచివాళ్ళు కాబట్టి ఇంకా కిరణ్ ను ముఖ్యమంత్రిగా భరిస్తున్నారు!అతను open గా సీమాంధ్ర పక్షపాత వైఖరి,తెలంగాణా ప్రజల వ్యతిరేక ధోరణి అవలంబిస్తున్నాడు!As a chief minister his days are numbered!

    ReplyDelete

Your comment will be published after the approval.